25, జూన్ 2023, ఆదివారం

తత్వం

 🙏తత్వం,ఆలోచన రూపంలో ఉయ్యాల లూగుతుంటే అమ్మవడి,తనలో తానైతే నాన్నవడి,ఎరుక ఎప్పుడూ బాల్యమే,సృష్ఠిరూప వినాయకుడైనా,ఎరుకరూప స్కందుడైనా🙏

7, డిసెంబర్ 2022, బుధవారం

నిజం.

 నిజమైన భగవన్నామం 'నేను'అని జడచేతనాల్లో ప్రతిధ్వనిస్తోంది.ధ్వని పరమాత్మది.ప్రతిధ్వని జీవులు తమదను కుంటున్నాయి.

తపన.

 జీవించాలి.ఎప్పుడూ అదే తపన.ఎందుకంటే తాను ఎప్పుడూ ఉండే సత్యం గనుక.కానీ తాను కాని శరీర తాదాత్మ్యం వలన,అది కోరికలా కనిపిస్తోంది.సంపాదించాలి.తనను తాను ప్రపంచం కంటే వేరుగా ఉన్నాను అనే ద్వైతం వలన,తన పరిమితి నిజం కాదు గనుక అపరిమితమైన తన స్వరూపానుభవ కాంక్షే ఇలా వ్యక్త మవుతుంది.

ఆనందించాలి.నిజానికి తన స్వరూపమే ఆనందం.రెండోది ఉన్నప్పుడే హద్దు.ఉన్నది స్వరూపం మాత్రమే.జీవ భావం వలన మాత్రమే ఇబ్బంది.ఈ మూడింటికి కలను అనుసంధానం చేసుకుని,అనంత శయన నారాయణుని తత్వం గ్రహించి, కలలోని తన పాత్రవంటి జీవభావాన్ని గ్రహించి,కర్తృత్వ,భోక్తృత్వ, అహంకారాన్ని వీడి, కేవలం తన జీవితాన్ని,నాటకం లోని పాత్రగా భావించి,అంతరంగ శాంతిని పొందాలి.నిజానికి మనకు వచ్చే ఆలోచనలు,రెండవ వారి వల్ల మాత్రమే వస్తాయి.తండ్రి గురించి ఆలోచిస్తే తనది కొడుకు పాత్ర,అలానే కొడుకు గురించి ఆలోచిస్తే తండ్రి పాత్ర,అలానే ఉద్యోగి,పాత్ర,భర్త పాత్ర,ఇలానే ఎన్నో.ఇవేవీ లేని అస్తిత్వం స్వరూపం.అదే వర్తమానం.ముందు,వెనుక క్షణాలు మాత్రమే బంధ కారణాలు.ఈ క్షణం అన్ని పాత్రల ముసుగు లేని నిజం.తీరిగ్గా గమనించి గ్రహిస్తే,నెమ్మదిగా స్వరూపం తెలిసి,దాన్నే సాధనంగా గమ్యాన్ని చేరవచ్చు.

1, ఏప్రిల్ 2020, బుధవారం

మాయ

విద్యుచ్చక్తికి అవసరమైన,నెగిటివ్,పోసిటివ్,శివశక్తులు.గాడ్జెట్ వినాయకుడు.దానినుండి పొందే,వెలుగు,వేడి,గాలి ఇలాఏదైనా సుబ్రహ్మణ్యుడు. ఇది శరీరానికి అన్వయిస్తే ,శరీరం వినాయకుడు.సత్,చిత్,శివ పార్వతులు. ఆనందరూపుడు వ్యక్త మోతున్న జీవుడు,శివా శివుల ఆనందా అంశ .తాను అనే అహం ఉంది అనుకోడమే మాయ.పుట్టినవి ఎన్నైనా పోవచ్చు.ఎప్పుడూ ఉండే చైతన్యానికి,ఏ మార్పు లేదు.

30, అక్టోబర్ 2018, మంగళవారం

శబ్దం

శ్రీ గురుభ్యోనమః.  శబ్దం అమ్మవారు,మౌనం అయ్యవారు. శబ్దాన్ని మౌనంలో సమర్పించడం కల్యాణం. అది వర్తమానంలో సాధ్యం,కనుక కల్యాణం చేస్తున్నది విష్ణువు.

5, జులై 2018, గురువారం

వైరాగ్యం

వైరాగ్యం. 
      వైరాగ్యం  అనేది ప్రధాన భూమిక ముముక్షువులకి. అన్నీ వదిలెయ్యడం అనేది లౌకికర్ధం. వదిలెయ్యడంలోని అర్ధం తెలియడం వైరాగ్యం . తాడుని చూసి పాము అనుకున్నా,లేదా ఏదైనా నీడచూసి పాము అనుకున్నా, జ్ఞానం వల్ల మాత్రమే భయం పోతుంది. మళ్ళీ ఎన్నిసార్లు చూసినా మరి భయం కలగదు .అలానే ముత్యపు చిప్పలోని వెండి.
       చూడడానికి రెండు వెలుగులు కావాలి . బయటివెలుగు,మనసు కళ్ళు వలన మనదృష్టి. ఈ రెంటితో 
భయం పోయింది.భౌతిక ప్రపంచము ఈ తాడు వంటిదే. కానీ పరమాత్మ విషయం తెలుసుకోడానికి ఈ వైరాగ్యం ఒకటి సరిపోదు .ఈ జ్ఞానం ఏమిటో తెలియాలి. ఎందుకంటే రెండు వెలుగులు భౌతిక వస్తువులు 
చూడడానికి పనికివస్తాయి. కానీ జ్ఞాన అజ్ఞానాలకు ఆవల పరమాత్మ. 
       గదిలోఉన్న దీపం వస్తువులను ప్రకాశింప చేస్తుంది. కానీ దీపాన్ని ఎవరూ ప్రకాశింప చెయ్యలేరు. 
ప్రకాశంలోని వస్తువులు,దీపముకూడా తెలియడం,అలానే ప్రకాశం లేనప్పుడు అవి తెలియక పోవడం కూడా 
మనకు తెలుస్తోంది.అంటే జ్ఞానము అజ్ఞానము కూడా తెలుస్తున్నాయి.పరకాశిస్తున్న వస్తువులు ,పై  ఉదాహరణ
లోని తాడు ,పాము వంటివి. అంటే అస్థిత్వం లేదు . ఏది ఒకసమయంలో మాత్రమే ప్రకాశిస్తుందో ,అది 
నిజానికి లేదు .రెండు వెలుగులు లేకపోతె సృష్టి మృగ్యం. మొదలు తుది ఉన్నది భ్రాంతి. ఈ రెండు లేనిది పరమాత్మ తత్త్వం ఒకటే. జ్ఞానాన్ని అజ్ఞానాన్ని ప్రకాశింప చేస్తున్న తాను మాత్రమే నిజం. ప్రకాశింప బడుతున్న 
శరీరం అజ్ఞానం . శరీర జ్ఞానం కలిగిఉన్న తాను పరమాత్మ.