3, అక్టోబర్ 2016, సోమవారం

శ్రీమాత్రే నమః .

శ్రీమాత్రే నమః .
సాధన ,సంస్కారాన్ని  బట్టి ఉంటుంది . సాధకులుగా పిల్లలు తయారవాలంటే మంచి సంస్కారాలు పెద్దలు ఆచరించి
అందించాలి . అత్యంత ముఖ్య విషయం ఏమిటంటే అందరికి మంచి విషయాలు తెలుసు . కానీ ఆచరణలో లోపం వల్ల పిల్లలకు అందడం లేదు . కాలం అందరిని పెద్దవారిని చేస్తోంది . కానీ విజ్ఞత మాత్రం తల్లి ,తండ్రులు వారు పొంది ,
పిల్లలో పెంచి పెద్ద చేయాలి . తాము అన్య కారణాల వలన పొందక పోయినా ,మీ బాధ్యతగా మీరు ధర్మాన్ని వహించి
పిల్లలకు మార్గదర్శనం చేయాలి . అలా పిల్లల్ని పెంచితే ,కనీసం ముందు తరాలకు ధర్మ భ్రష్టత రాదు . దీని వలన
వంశంలోని, పూర్వపు 7తరలవారి ఆశీర్వాదంతో మళ్ళీ వంశం ఉఛ్ఛ స్థితికి వస్తుంది . ఆర్ధికంగా బలంగా ఉన్న
సమయంలోనే ,ఆచార ,సంప్రదాయాలు ,వ్యవహరించే తీరు ,కట్టు ,బొట్టు ఇలా అన్ని విషయాలలో పెద్దలు ,పిల్లల్ని
ప్రభావితం చేయాలి . ఇలా ధర్మాచరణకు నడుం కడితే ,అది మనను ,మనకు తెలియకుండానే సాధకులను చేస్తుంది
  సాధన యొక్క పరాకాష్ఠ ,లోపల అగ్ని వలె వాసనలను దహించి ,ఆత్మ గురువును చేరుస్తుంది . అంటే నిజమైన
జిజ్ఞాస భగవంతుని ఉనికి పట్ల కలుగుతుంది . ఇదే ఎక్కువగా ఉపయోగపడే ఆత్మగురువు లక్షణం . శిష్యుడు
సమిధలతో గురువును చేరడం ఇదే . తనలోని వాసనల తడి పూర్తిగా ఆరినపుడు ,ఒక్క తత్వమసి అనే గురు వాక్యం ,వ్యాఖ్యానం అవసరం లేనంతగా ,అగ్నిని శిష్యునిలోని సమిధలను  ఆత్మ యజ్ఞంలో పొగరాకుండా ,యజ్ఞ ఫలాన్ని
అందేలా చేస్తుంది . ఆయజ్ఞ ఫలమే ,అహం బ్రహ్మాస్మి .