28, ఫిబ్రవరి 2016, ఆదివారం

ప్రతిబింబం

   ప్రతి బింబ న్యాయం .
ప్రతిబింబం రెండు విధాలుగా మనకు సరి అయిన బింబ దర్శనానికి సహకరించదు . 1బింబం సరిగా లేనపుడు ,ఎలాగూ సరిగా కనిపించదు . 2అద్దం మురికిగా ఉన్నప్పుడు సరిగా ప్రతిఫలించదు . 1భౌతిక ప్రపంచ విషయాలు . తనను సరి చేసుకుని ప్రతిబింబ రూపమైన జగత్తును చూడాలి . 2పరమాత్మ విషయంలో బింబం ఎప్పుడూ మార్పు లేకుండా ఉంది .
అంతే నిష్కల్మషంగా అనుభవానికి అందాలంటే ,మనస్సనే అద్దాన్ని శుద్ధ సత్వాన్ని ఆశ్రయించి శుభ్ర పరచి ,బుద్ధి యోగంతో
పరమాత్మను సంధానం చెయ్యాలి .
   బుద్ధి యోగం .
 జగత్తు ,పరమాత్మగా సత్యం . ప్రపంచం బాహ్యంలో ఉన్నది . అప్పటి వరకు అది పరమాత్మ . కానీ అంతర ప్రపంచం
వస్తు ప్రపంచం కాదు . నిజానికి ఇది వీడియో ,ఆడియో తప్ప వేరుకాదు . కానీ దీనికి సత్యత్వాన్ని ఆపాదించి ,జన్మ
పరంపరను ఆహ్వానిస్తున్నాము . దీనికి సాక్షిగా చూచే వినే ,చైతన్యం స్పష్టంగా తెలుస్తున్నా గమనించక పడే అనర్ధమే
బంధం .