30, మార్చి 2018, శుక్రవారం

మన శాంతి

    సర్వం బ్రహ్మ మయం జగత్.అనేది పారమర్దిక సత్యం.పార్షిక సత్యం కాదు.ఈ జగత్తు పార్షిక సత్యం.ఈ జగత్తులో వివాహానికి తరతమ బేధాలు తప్పనిసరి.నిజానికి ఆధ్యాత్మిక సాధనా స్థాయిని తెలిపేది జన్మతో వచ్చిన వర్ణం యొక్క స్వభావం.నాలుగు కాళ్ల జంతువులు,అడ్డంగా వెన్నుపాము కలిగినవి ,అన్ని ఓకేరకం కాదు.కొన్ని గడ్డి,ఇతరమొక్కలు వీటిపై ఆధారపడి జీవిస్తాయి.
కొన్ని మాంసహారులుగా జీవిస్తాయి.వీటిలో ఎక్కువ ,తక్కువ అని ఏమీలేదు.వేటి జీవన విధానం వాటిది. భగవంతునికి అన్నీ
సమానమే.కర్మ గతిలో వేటి స్థానాన్ని అవి పొందాయి.అలానే. మనుషులు ఒకేలా కనిపిస్తున్నా, ఎన్నో బేధాలతో జీవిస్తారు.
వేరు వేరు విభాగాల జంతువులు వాటికి అవే సమానత్వం ఉన్నవాటితోనే జతకడతాయి. ఇది ప్రకృతి సహజం.బేధాలు జంతువుల
వలె ,మనుషులకు తెలియవు.అంత మాత్రాన లేవని కాదు.అందువల్లనే పరమాత్మ వర్ణ విభాగం చేసాడు.ఒకే రకమైన ఆచార,
వ్యవహారాలు,ఆలోచనా ధోరణి కలిగిన వారు ,పైకి విబేధాలు ఉన్నట్లు కనిపించినా, పెద్దగా సమస్య ఉండదు.
        కానీ,వర్ణాంతర వివహాలలో,ముందుగా శరీర పరంగా ఆలోచించి అంతా బావుంది అనుకున్నా, పరమాత్మ సృష్టిలో నియమాన్ని తప్పినట్లే అవుతుంది.నియమాల ప్రకారం కాలం నడుస్తున్నది.ప్రకృతి అంతా స్వభావ సిద్ధంగా నడుస్తున్నది.
కానీ పరమాత్మను చేరడానికి ఇచ్చిన వివేక జ్ఞానం ,తప్పుతోవపట్టి శరీరానికి సంబంధిచిన విషయాలకు,అనవసర ప్రాధాన్యం ఇచ్చి మానవాళి ఇక్కట్ల పాలవుతున్నది.ఇలా పెద్దలు కాదన్న వివాహాలు,ఎంతో గొప్పగా ఉన్నాయి అని నిరూపించాలనుకునే వారు
ఎక్కువే.కానీ మనసును మభ్యపెట్టి తమలో తమ అంతరంగములో వాదించుకుని సరిపెట్టుకుంటారు.కానీ నిజాన్ని ఒప్పుకోరు.
ఎందుకంటే అహంకారం అడ్డు వస్తుంది.పెద్దలను కూడా బలవంతంగా ఒప్పించినా, అంతరంగం మాత్రం అందరికీ కల్లోలమే.
ఎప్పుడూ మన శాంతి ఉండదు.దీనికి బదులు ముందుగా పిల్లలు తమ మనసునే లొంగదీసుకుంటే ఏ సమస్యలు ఉండవు.
అందుకే పిల్లలకు చిన్నప్పుడు ఇటువంటి సంఘటనలు,ఎలా తెలిసినా, పెద్దలు తప్పక ఖండించాలి.వారి మనసులో అటువంటి
విషబీజాలు పడకుండా కాపాడుకోవాలి.ఇటువంటి వాటికి సహజంగా చిన్నప్పుడే బీజాలు పడతాయి.స్నేహాలు ఆడపిల్లలకు,
అడపిల్లలతో ఉండేలా జాగ్రత్త పడాలి. వారి మధ్యన కూడా ఎటువంటి చర్చలు జరుగుతున్నాయో గమనించాలి.మన పెద్దలు చూపిన బాటలో నిలకడగా సాగాలి.మన శాంతితో, జీవించి,పరమఅర్ధం వైపు సాగాలి.లేకుంటే ఇలాంటి తప్పులు పిల్లలు చేసినా పెద్దలకు
పర మార్ధం అందదు.మనో చాంచల్యం వదలదు.తస్మాత్ జాగ్రత.ప్రాప్యవరాన్నిబోధత.



23, మార్చి 2018, శుక్రవారం

స్వభావం

స్వభావం.
  ప్రతి మనిషిలోను స్పష్టంగా అందరిలో కనిపించే లక్షణాలు కొన్ని ఉంటాయి. ఇవి సహజమైన నిత్య సత్యమైన పరమాత్మ లక్షణాలు. అవి  ఎప్పుడూ తాను ఉంటాననే నమ్మకం. అంతా తెలుసనే లక్షణం. ప్రకటితం కాకున్నా తనలో తనపట్ల సంతృప్తి.ఇవి సతిచ్చిదానంద లక్షణాలు.ఎప్పుడూ ఉండడం సత్ లక్షణం.తెలుసు అనేది చిత్, ఆనందం సంతృప్తి.ఇవి లేని మనిషి ఉండరు.కానీ వీటిని శరీర పర్యంతంగా భావించడమే
అవిద్య.అలానే పరబ్రహ్మ తత్వంలో, అహం ప్రజ్ఞ తెలిస్తే సృష్టి.ఇదే అద్వైతంలో ద్వైతం.స్పందించిన అహం తిరిగి స్వస్థితిని పొందాలనే సహజమైన కోరిక మోక్షం.ఇది శరీర పర్యంతమైనపుడు,బాహ్యంలో జంట కోసం వెతుకుతుంది. కానీ అంతరార్ధంగా గమనిస్తే,ఇది నిజానికి తనలోనే ఉన్న తనను చేరడమే.బాహ్యంలో స్త్రీ,పురుష బేధం తెలిసే 8సం. వయసు నుండి పరమాత్మ జ్ఞానాన్ని అందించ గలిగితే ,తమలో
కలిగే భావాలకు మూలం తెలియడం వలన పిల్లలు, తమను తాము అనవసర భావజాలం నుండి కాపాడుకో గలుగుతారు.శ్రీరాముని యోగ వశిష్ఠ అనుభవం ,ఈవిషయాన్ని తెలియ జేస్తున్నది.అనవసర సమయంలో,అక్కరలేని విషయాలనుండి పిల్లలను కాపాడుకోవచ్చు.విజ్ఞానం అవసరం లేని పశు జనాలకు మాత్రమే తినడం తెలిశాక, తరువాత ప్రత్యుత్పత్తి మాత్రమే గమ్యం.కానీ మానవ జన్మ పరమార్ధం
గ్రహించాలి.