29, జూన్ 2016, బుధవారం

పరంపర

                                                       పరంపర
అమ్మ నేర్పితే అన్నం తినడం వచ్చిమ్ది . అదే బాటలో అన్నీ చెప్తేనే వచ్చాయి . భౌతిక విషయాలకే ఇది అవసరమైతే భగవంతుని చేర్చడానికి గురువు ఎంత బాధ్యత వహిస్తారు ?అదే పరంపర . అందరూ చెప్తున్న షిర్డీ సాయి ,ఎల్లప్పుడూ 'అల్లా మాలిక్'అన్నారేకాని ,రామ ,కృష్ణ అనలేదు . దేవత నామాన్ని కూడా ఉచ్చరించని వారికి ,హిందువులు గుడి కట్టడం శోచనీయం . మీ పూజ మీరు చేసుకొండి అన్నారు .కానీ ఆయనకు గుడి కట్టమనలేదు . భగవన్నామం చెయ్యండి అన్నారుకాని ,తన నామజపం చెయ్యమనలేదు .ఏనాడూ విగ్రహారాధన చెయ్యలేదు . విగ్రహారాధన చెయ్యని వారికి గుడిలో పూజలేమిటి ? నిజానికి వారి అనుయాయులు 'అల్లా మాలిక్ 'అనాలి అంత గౌరవం ఉంటే గుడి కట్టేకన్నా పాతమసీదులు బాగుచేసుకుని అల్లా మాలిక్ అనాలి .
        ఆచార ,సంప్రదాయాలు పాటించ వలసిన అవసరం లేదని ,సంధ్యావందనాది క్రియలకు దూరమై, భగవదత్తమైన సంప్రదాయానికి తిలోదకాలిచ్చే వారికి ,బాసట మాత్రమే సాయి భక్తి . దీని వలన అనాచారం పెరిగి సర్వమూ సంకరమైనది . ఎన్నో రూపాలతో తన దరికి ఎవరినీ రానీయక, శ్రేష్ఠ మైన అర్హునికి మాత్రమే ఉపదేశం చేశారు దత్తులు .పరశురామునికి శ్రీవిద్యని ఇచ్చి ఉపాసనా ఫలంగా మాత్రమే పరబ్రహ్మతత్వాన్ని వారికి ప్రతిపాదించారు . శ్రద్ధతో శ్రాద్ధ క్రియలు జరిపే ఇంట జన్మ స్వీకరించి తమ తమ ఆచార వ్యవహారాలు తప్పక పాటించమని సూచించారు . కొన్ని మహిమలు చేసినంతమాత్రాన వారిని దేవతలుగా మనవారు ఎన్నడూ గ్రహించ లేదు . సాధన దశలో ప్రాప్తిమ్చే సిద్ధితో ,మందిని పోగుచెయ్యడం అనుష్ఠానానికి వ్యతిరేకం . ఆచరణ అవసరంలేని వేదాంతం , సన్యాసికి మాత్రమే . సన్యాసం ధర్మాలు గృహస్తును పాటించమని ఎవరూ అనరు . గృహస్తు అంటే తనవిధిని పాటించ వలసినదే .విధి ,నిషేధాలు అవసరం లేని విషయం ప్రపంచంలో లేనే లేదు . శృతి సమ్మత జీవన శైలి పరంపరా ప్రాప్తంగా అందరూ జన్మతో కలిగి ఉంటారు . దానినే ధర్మం అని గురువు తెలియజెయ్యాలె తప్ప క్రొత్త విధానాలు ప్రవేశపెట్టి తికమక పెట్టడమే తప్ప ,అన్యంగా వేరే ఏమి లేదు .షిర్డీ సాయిని దత్తాంశగా భావిస్తున్నారు.
          శ్రీ దత్తులు 24 ప్రకృతి పరమైన అంశాలనుండి తాను నేర్చుకున్న విషయాలను తెలియజేసారు తప్ప ,ఎవరిని తమగురువుగా ప్రకటించలేదు .ముందుగా అనుకున్నట్లు శ్రీ దత్తులు ,ఎవరికి ఎంతవరకు అవసరమో అంతే అందేలా ఎన్నో విచిత్రాలు చేశారు . అందులో భాగంగా నామరూపాలకు అతీతంగా గురు తత్వాన్ని గుర్తు పట్టి సూచన గ్రహించాలి కానీ గుడులుకట్టి ,సినిమా ట్యూన్ భక్తి పాటలతో ఎవ్వరూ ఏదీ సాధించేది లేదు . గురువుచూపిన మార్గాన్ని నడవాలే కానీ గురువుకు గుడికట్టి ,సొంత నామావళితో పూజ కాదు . నారదుడు వాల్మీకికి రామనామాన్ని ,అలానే ధ్రువునికి నారాయణ నామాన్ని ఉపదేశిస్తే ,వాళ్ళు ఉపదేశించిన నామాన్ని జపించారే తప్ప నారద నామాన్ని కాదు .నమస్కరించ వచ్చు కానీ గురు బ్రహ్మా ... కానీ, గుడులు అవసరం లేదు . మీ పెద్దలు నడిచిన దారిలో నడవమన్న గురు వాక్యాన్ని విస్మరించి గుళ్ళు కడితే,తోటమాలి తోటపని మాని యజమాని పేరు జపించినట్లు ఉంటుంది. దీనికి మనవాళ్ళు పెట్టిన పేరే విష్ణుమాయ .