13, డిసెంబర్ 2013, శుక్రవారం

గోమాత

ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః
గోమాత 

            శరీరాలు మూడు ,స్థూల ,సూక్ష్మ,కారణ అని చెప్పబడుతున్నాయి . అమ్మ స్థూల రూపం కన్న తల్లి.సూక్ష్మ
రూపం గోమాత. మనకు దేవతా రూపాలన్నీ,మనసుతో అనుబంధం కలిగినవే. అందరి దేవతా రూపాలను ,తనలో
కలిగి ఉన్నది గోమాత. ఒకప్పుడు రాక్షసుల బారినుండి తప్పించుకునే నేపధ్యంలో అందరు దేవతలు కామ ధేనువు
శరీరాన్ని ఆశ్ర యించారట. అలా గోవు సకల దేవతా రూపమై అనుగ్రహిస్తున్నది. ప్రత్యక్ష రూపంగా మనకు చర్మ
చక్షువుకు కనిపించే సాకార దేవతా రూపం గోమాత.

        ఆలయాలలోను,ఇంటిలోనూ,భగదారాధనకు ఎన్నో నియమాలున్నాయి.కానీ భగవంతుడు గుడిలోనికి వచ్చి
దర్శనం చేసుకోలేని వారికోసం రధంలో ఊరేగింపుకు వచ్చినట్లు,నియమ నిబంధనలతో సంబంధంలేకుండా
అందరిని తరింప చేయాలనే తపనతో భూమి మీద నడయాడే అందరి ఇలవేల్పు గోమాత. కుల వ్యవస్థతో సంబంధం
లేకుండా ఎవరైనా సేవచేసి తరించగల ఒకేఒక రూపం గోవుది. కానీగుడిలోగాని,యజ్ఞాలలోగాని,ఇంటిలోగాని,
ఎక్కడైనా,ఎవరు గానీ,శాస్త్రోక్తంగా ,పూజించాలంటే దానికి గోవే ఆధారం. పంచ గవ్యాలు లేకుండా ఏ విధమైన శుభ
సందర్భమూ సుసంపన్నం కాదు. పూర్వం ఇంటి ముందు ఆవుపేడ కళ్ళాపి[కలిపిన నీళ్ళు]జల్లితే కానీ ఇంటిలో
ఏ పనులు ,ప్రారంభం అయ్యేవికావు. వాకలి తుడిచి ,కళ్ళాపి[కళ్లము =కొంత ప్రదేశము,అప్ =నీరు]అని అర్ధం.

         అంతేకాని అర్ధం పర్ధం లేని ఒక మాట కాదు కళ్ళాపి అంటే. ముగ్గు వేసి ,తరువాత శరీర శౌచం పూర్తి చేసి,
దీపారాధన చేసిగానీ,ఇంట్లో పొయ్యి వెలిగించే వారు కాదు. అలా వెలిగించడం ఇంటికి ఎంతో శుభం. ఇంటి ముందు
ముగ్గు వెయ్యకుండా ,నిప్పు రగిలించడం అంటే అరిష్ట హేతువు. అలా వెలిగిస్తే ఆ ఇంట అశుభం జరిగి నట్లు లెక్క.

           గోమయం అంటే లక్ష్మీ రూపం. ఎలా అంటే, లక్ష్మి గోవు పృష్ట భాగాన్ని ఆశ్రయించింది. ఆవు ముఖ భాగం
పూజార్హమైనది కాదని ,ముందుగా ప్రుష్టాన్నే పూజించాలనే ఐతిహ్యం మనకు తెలిసిందే. అలానే శివుని కూడా
గృహస్తు వెనుక భాగాన నిలబడి పూజిస్తాడు,అభిషేకిస్తాడు. గోవు,శివుని  పరీక్షించి వచ్చిన బ్రహ్మకు, అబద్ధపు
సాక్ష్యానికి గుర్తుగా తల ఆడించిందని,కానీ సత్యాన్ని ప్రతిపాదించేందుకు,పృష్ట భాగాన్ని తోకను కదిపి,తన తప్పును
సవరించుకుందని ఐతిహ్యం. సత్యాన్వేషికి లక్ష్మి ప్రసన్న మౌతుందని గోవు ,చెప్పకనే చెప్పింది.

          గోవు ముఖ భాగంలో శివుడు అధిస్టించి ఉన్నాడు. అందువల్ల ప్రుష్టాన్ని పూజించి నపుడు ,శివుని వెనుక
భాగం పూజించి నట్లౌతుంది. ఇది ఒక అర్ధం. మనం గురువును ,వారి వెనుకగా అనుసరించి వెళతాము. శివుడు
ఆదిగురువు.ఇదొక కారణం. అంతే కాదు ,భూత ,భవిష్యత్ ,వర్తమాన కాలాల్లో ,శివుని భూత కాలానికి ప్రతినిధిగా
మనం భావిస్తాము. అంటే జరిగి పోయిన కాలానికి కూడా ,మనం వెనకే కదా ఉంటాం. ఇదో కారణం. శివుడు భూత
గణాలకే కాదు,మన భూత[జరిగిపోయిన]కాలానికి కూడా అధిపతి. అందువల్లనే పురాకృత పాప పరిహారం కోసం
శివాభిషేకం చేయిస్తారు.

            శ్రీ కృష్ణావతారం లోను స్వామి గోసంరక్షణం చేసి మనకు మార్గ దర్శనం చేశాడు. వెంకటాధిపతి అయి,తనే
గోవును రక్షించి ,దాని బదులు తాను ప్రహారానికి గురి అయ్యాడు. రాధా అంటేనే గోవులను ఎంతో గొప్పగా సంరక్షించ
గలిగేదని ఒక అర్ధమట . అందు వల్ల స్వామికి ప్రాణ సఖి అయిందని ఒక భావం. అంతరార్ధం చూస్తే ,ఇంద్రియాలను
గోవులుగా కూడా ప్రతిపాదించారు. ఎవరు ఇంద్రియాలను నిగ్రహించి స్వామికి మనసు సమర్పిస్తారో వారు పరోక్షంగా
రాధా స్వరూపులే. రాధా కళ్యాణం బాహ్య మైనది కాదు. ఎవరి మనసు ఇంద్రియాతీత మైన పరబ్రహ్మ స్వరూపమైన

అహం స్వరూపంతో అవిభక్తమైఉన్నదో,వారికీ,రాధాకృష్ణ తత్వానికి భేదం ఏమీ లేదు.మానవునికి తనస్వస్వరూపం
పై ఉండే మక్కువ రాధామాధవ అవినాభావ సంబంధమే. కానీ శరీరానికి దీనితో ఎలాంటి సంబంధమూ లేదు.
అందువల్లనే మనిషి తనను తాను ప్రేమించినంత లోతుగా ఎవరినీ ప్రేమించలేడు. కానీ అవగాహనా లోపం వలన
శరీరాన్ని,సంబంధీకుల్ని,తనకు పరిచయమైన,ప్రపంచానికీ అన్వయించుకుంటాడు. ఇదే జగత్తులోని ప్రతి ప్రాణిపై
మాయ కుండే ప్రభావం. దీనిని గ్రహిస్తే చాలు ,నిగ్రహించ బడుతుంది. తెలియకుంటే శరీరంతో పోయి,మళ్లీ శరీరంతో
వస్తుంది.గోవిందుని బాట నడిస్తే ముందుగా ఆవులను రక్షించు కోవడానికి మన ప్రాణాలను పణంగా పెట్టగల
ఆవేదన మనకు ఎంత అవసరమో మనం గుర్తు పట్టాలి.రాను,రాను,గోవులు వృద్ధితో బాటే ఎద్దులు సంఖ్య పెరగడం
సహజం . వాటి పోషణ కష్టమే అనడంలో ,ఏ సందేహం లేదు . దీనికి ,ముసలి ఆవుల నిర్వహణ ,సామాన్య రైతు
భరించలేడు ,అనేది నిజం . వీటిని ,బంజరు భూముల్లో విడిచి ,తగిన రక్షణ కల్పిస్తే ,వాటి బ్రతుకు ,అవి ,బ్రతుకుతాయి .
 కొంత కాలానికి సహజంగానే ,అడవి తయారవుతుంది ,బీడు ఫలవంత మౌతుంది .

              శ్రీ శైలం అడవుల వంటివి ఎన్నో అందుబాటులో ఉన్నాయి . ఇటువంటి చోట గిరిజనుల సహాయ
సహకారాలతో దీనిని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు . ముందుగా గోవుల వృద్ధి దేశ క్షేమానికి , అత్యావశ్యకం అని ,
గుర్తించి ,వీటిని ఆరోగ్య కరంగా పెంచి ,నెయ్యి తయారు చేసినా కలిగే లాభం రైతులకు ఉపాధి రూపంగా అందుతుంది .
పాలుగా వినియోగించడం కంటే ,ఈ పాలను ప్రత్యేకించి నేతికి వాడి ప్రయోజనం సాధించ వచ్చు . ముందుగా దేశవాళి
ఆవులకున్న ప్రత్యేకతను గమనించి ,వీటికి గల సువర్ణ నాడి వలన ,సూర్యుని నుండి పాలలో సువర్ణం చేరడం వలన ,వీటి
పాల పదార్ధాలు ,అత్యంత సూక్ష్క్ష్మంగా ఆరోగ్యాన్ని కలిగిస్తూ ,ఎన్నో వ్యాధుల నుండి రక్షిస్తాయి . పాలు పలచగా
ఉండడం వలన అమ్మకం అవడం లేదనే వాదాన్ని పక్కకు పెడితే ,నెయ్యి ,ఎరువు రూపంగా, వీటితో సరిపోల్చ గలిగేవి
లేవు .రైతు కనీసం ,5,6,ఈతల తరువాత కూడా ,ఎంతో కొంత ప్రయోజనం ఆశించి ,వీటిని కబేళాలకు అమ్మడం అన్యాయం . పొందిన దానికి సంతృప్తి పొంది ,వీటిని దాన రూపంగా అడవులలో వదిలెయ్యడం ఇప్పటి వ్యవస్థకు న్యాయం . పాలక వ్యవస్థ శ్రద్ధ వహించి ,వీటికి రక్షణ కలిగించడం న్యాయం .

          అలాగే అమ్మను సంతృప్తి పరచడానికి,శ్రీనివాసుడు,కృష్ణావతారం ముగించి,తానై భూమి మీదకు దిగివచ్చి,
అమ్మకోరిక తీర్చిన వైనం మనకు తెలిసిందే. కానీ ఒక్క క్షణం కూడా దానిని కధగా ,కాకుండా మన జీవితానికి ఎలా అన్వయించాలో మనం మరిచాము. అమ్మను సంతృప్తి పరిచే దిశను ఎవరికి వారే నిర్ణయిం చు కోవాలి. కానీ జీవితకాలం మీకోసం శ్రమించారు. ఎలా అంటారా ?పెళ్లి తరువాతి కోరిక,పిల్లలు ఇది మీకు తెలుసు. కానీ పెద్ద వాళ్ళ అభిప్రాయం పిల్లల కోసం పెళ్లి. అందువల్లనే వాళ్ళు కులాచార వ్యవస్థకు పట్టం కడతారు. ఇరువైపులా ఒకే విధమైన ఆచార వ్యవహారాలవల్ల పిల్లలకు,వారిబాట చాలా సుస్పష్టంగా అవగాహన అవుతుంది.పిల్లలకు ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు. దీనికోసం వారి తపన మీ విషయంలో, మీ స్వాతంత్ర్యం హరించి నట్లుగా మీకు అనిపించ వచ్చు. కానీ నిజానికి ఆ పట్టుదల వెనుక ముందు తరాల బాధ్యత దాగి ఉంది. అది మీరు అంగీకరించినా,లేకున్నా ఇది నిజం. పిల్లలను, కాకులు పెంచినట్లు ఆహారంతో పెంచి వదిలెయ్యడానికి మానవ జన్మ అవసరం లేదు. ఆచంద్రతారార్కం గౌరవ మర్యాదలను కాపాడే బాధ్యతతో కుటుంబపు భావి తరాలను దిద్దే దిశగా సాగేదే పెద్దల ఆలోచనా ధోరణి.

      దీనికి బాధ్యత,పిల్లల పెళ్లి ముందు ప్రారంభం కాదు. బాల్యం నుండి మన కట్టుబాట్లు,జీవన శైలి వారికి,పునాది
కావాలి. ముందుగా అమ్మ మాట వింటే తరువాత దిశా నిర్దేశం దానంతటదే జరుగుతుంది.కానీ నేర్పేందుకు పునాది
ఎవరు వెయ్యాలి ?తప్పక ప్రూనింగ్ చేస్తూ పెంచే మొక్కలా ,అమ్మాయికి ఇష్టం లేకున్నా ,చాలా విషయాలు నేర్పే
బాధ్యత అమ్మాయి తల్లిదే. కానీ అదే సమయంలో ,బోన్సాయ్ మొక్కలా,అమ్మాయి మనసు పెళుసు బారక ముందే
అత్తవారింటికి చేర్చే, నర్సరీ లోని తోటమాలి వంటిదే ,అమ్మాయి తల్లి పాత్ర.