15, ఆగస్టు 2016, సోమవారం

అద్వైతం

అద్వైతం
           త్రిపురసుందరి . నటరాజ నర్తనానికి సాక్షి . పరమాత్మను నామరూపాత్మకంగా [సోపాధికంగా]తెలుసుకుని , త్రిపురాలయందు భగవత్ సాక్షాత్కారాన్ని గ్రహించి సాక్షిగా రమించే అమ్మ తీరు సాకార ధ్యానం . శక్తిని చైతన్యం అని దర్శించి , ఆ కదలికల లాస్యాన్ని అంతరంలో గ్రహించి ,చలించని ధృతిలో తనలో తాను మునిగిన మోని ,నిరాకార ధ్యాని .
ధ్యాని శివుడు ,ధ్యానం శక్తి . సాకార ,నిరాకార ధ్యానాల రెండింటా ధ్యాని శివుడు ,ధ్యానం శక్తి . శరీరం శివుడు ,శక్తి స్త్రీ . శరీరంలో శక్తి దాగి ఉంది . శరీరం ద్వారా మాత్రమే వ్యక్త మోతుంది . భారతీయ సంప్రదాయం ఈ విషయాన్నే స్త్రీ గోప్యతను 
పాటిస్తుందని తెలియజేస్తుంది . అంతేకాని స్త్రీని ఎక్కడా తక్కువ అని పేర్కొనలేదు .
          ఉనికి నామరూపాత్మక ప్రపంచంగాను ,చైతన్యం శక్తిగాను ,ఆనందం  మనస్సుగాను అర్ధం చేసుకుంటే ,సత్చితానందం
యొక్క సృష్టి రూపం ప్రపంచం  . సత్చితానంద బింబరూపానికి ,సృష్టి ప్రతిబింబం . ఏ ఒక్కరికి తాను ఉన్నాను అనడానికి అద్దం అవసరం లేదు .తన ఉనికికి   బింబ లక్షణాలు అన్వయించి జీవించడం ధర్మం.ప్రతిబింబ లక్షణాలతో అన్వయించడం  అధర్మం.నిరాకారమైన శివస్వరూపానికి ,సాకార విష్ణు రూపం ,ప్రారంభం .అంటే అనంతం, నామరూపాలతో వ్యక్తమైంది.అందు
వల్లనే దశావతారాది కృత్యాలు విష్ణుపరంగా వచ్చినవే.శివుడు విష్ణు కళ్యాణం చేసి నట్లు కనపడదు . విష్ణువు పార్వతి   పరమేశ్వర   కళ్యాణం చేసినది అందరికి తెలుసు .స్వస్థితిలో ఉండడమే పార్వతీ పరమేశ్వర కళ్యాణం . వీరికి శక్తి కావాలి అనే వాంఛ ఉండదు . ప్రతిబింబం తానుగా భావించినపుడు మాత్రమే ,తాను శరీర పర్యంత జీవి నని ,తన శక్తి పరిమితమైనది అని భావించి ,పరమాత్మ యొక్క నిరాకార తత్వం సాపేక్షమైనది కాదు కనుక ,శక్తి కొరకు తనకు నచ్చిన దైవరూపంతో ,తపస్సు చేసి ,అనంత శక్తిని కోరుకుంటాడు . కానీ ఇది ప్రతిబింబ జ్ఞానం కావడం వలన పరిధులు తప్పవు . కోరిక ప్రతిబింబ లక్షణం .