5, జులై 2014, శనివారం

సర్వం బ్రహ్మ మయం జగత్

ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః

సర్వం బ్రహ్మ మయం జగత్ 


         కనిపిస్తున్న జగత్తుగా పరమాత్మ అనుభూత మైన స్థితిలో ఒక ముని అనుసంధానంతో చెప్పే మాట 
                                                          సర్వం బ్రహ్మ మయం జగత్ . 
        కానీ ప్రతివారికి ఈ అనుసంధానం ఎంతో అవసరం . ప్రతి సంఘటన అనుకూలమైనదైనా ,ప్రతికూలమైనదైనా, అది  అందించే అవగాహనతో సాగే జీవితం , సాధనా మార్గం.అనుకూలమైన విషయాలను భగవద్విభూతి గాను , ప్రతికూలత ,పూర్వ కర్మ దోష పరిహారం గాను భావించి ,సాధన సాగించాలి . విశ్వం ,విష్ణువే .శక్తి లక్ష్మి .పోషించే విష్ణు స్వరూపం , ఇలలో లక్ష్మి రూపం .ఏ ఐశ్వర్యమైనా అష్ట లక్ష్మీ రూపమే .అన్నిటి సమగ్ర రూపమే ,వాడుకలో ఉన్న ధనం. ప్రతిదీ , త్రిమూర్త్యాత్మకమే ,సంపాదన ,కలిగి ఉండుట ,ఖర్చుఇలా. ప్రతి రూపాయి అమ్మకు ఆహ్వనమే అనే స్పృహతో  సంపాదనను కలిగి ఉన్నప్పుడు,అది సృష్టి .అంటే కుమారుడైన బ్రహ్మను ఆశీర్వదించినట్లు ,అమ్మ ఆశీర్వ దిస్తుంది. శివుడు ఖండించిన ఐదవ తల [అహం] వదిలి ,శాస్త్ర బద్ధంగా అంటే నిజాయితీగా సంపాదన లక్ష్మీ స్వరూపం అది పవిత్రమై ఎంతో తృప్తితో ఇంట నిలిచి ఉంటుంది .కానిది డబ్బు మాత్రమే . సమృద్ధి కాదు .సృష్టి ,స్థితి , చూశాము 
అమ్మకు అయ్యతో కళ్యాణమే ఖర్చు. అంటే అంత ఆదరంతో ఎంతో ప్రీతితో,ప్రతి రూపాయి పరమాత్మకే సమర్పిస్తున్న
భావన లక్ష్మీ , నారాయణ కళ్యాణమే . అప్పుడు తనకు,కుటుంబానికి , సమాజానికి , ప్రతి దైవ కార్యానికి,దానానికి 
మనసు ఆనందంతో,ఇది పరమాత్మ సేవయే అనే భావంతో శాంతిని పొంది సాధనకు సహకరిస్తుంది . విశ్వం విష్ణువే .
         విష్ణు ధామమైన వైకుంఠఆనికి ,జయ,విజయులు ద్వార పాలకులని మనకు తెలుసు.జీవితంలోవ్యక్తికి కలిగే జయము ,విజయము ,అహంకారాన్ని కలిగించి , పరమాత్మ నుండి జీవాత్మను వేరు పరుస్తూ , వేరైన తనకు కలిగిన విజయానికి పొంగి పోతూ,ద్వైతాన్ని బలపరిచి,కర్మ బంధాన్ని మరింత జటిలంగా మారుస్తాయి. పరమాత్మకు ,తాను భిన్నమనే అజ్ఞానాన్ని బలపరిచే , వీరు నిజంగా ద్వార పాలకులే . అందువల్లనే  విద్య వలన  కలిగిన జ్ఞానానికి వినయాన్ని జోడించి ,కలిగే గెలుపు ,ఓటములకు ,పొంగక , క్రుంగక జీవించే విధానం సాధనా మార్గం .
       బ్రహ్మ మానస పుత్రులైన , సనక ,సనందన ,సనాతన ,సనత్కుమార , విష్ణు దర్శనార్ధులై ,వెళ్ళినపుడు
జయ ,విజయులు అడ్డుకున్నందు వలన వారి శాపానికి గురై ,హిరణ్యాక్ష ,హిరణ్య కశిపులుగా,అలానే రావణ ,
కుంభ కర్ణులుగా ,శిశుపాల ,దంత వక్త్రులుగా ,వైరి భావంతో విష్ణువును చేరిన వైనం మనకు తెలుసు .సనక
 [పురాతన ],సనందన [ఆనంద]రూపమైన, సనాతన [శాశ్వతమైన],సనత్కుమార [బాల్యంతో]ఈ లక్షణాలు
తురీయ స్థితిని సూచిస్తాయి.ఈ గురు స్వరూప లక్షణాలు ,సాధన దశలో శిష్యునికి ,మార్గ దర్శనాలు.ఈ  సాత్విక సాధనకు ,విఘాతం కలిగించేవే ,తాను గొప్ప సాధకుడననే అహం ,తనకు ,విజయం కలగడం వలన పరమాత్మకు తానే, చేరువగా ఉన్నాననే భావం ,వలన కలిగే అహం .ఇవి సాధనతో పరమాత్మను చేరనీయక అడ్డు తగులుతాయి .
స్వరూప లక్షణాలను ,శరీరానికి ఆపాదించి ,తను శరీరంగా భావిస్తూనే ,శరీరానికి సంబంధంలేని ,శాశ్వతత్వము,
ఆనందము ,అనుభవంలో ఉన్న, ఉనికి వలన కలిగిన బాల్యం వంటి స్వఛత, వీటిని శరీరం కలిగి ఉందనే ధృఢ
భావనే ,ఐశ్వర్యమంతా తనదనే ,అహంకారానికి ఆలంబనగా ఉంటుంది . ఇదే హిరణ్యాక్షుని ద్రుష్టి .
           కామ ,క్రోధ ,లోభ ,మోహ ,మద ,మాత్సర్యాలనేవే ,జయ ,విజయుల ఆరు జన్మలు .[వీరికి] వీటికి మరణం ఉండ కూడదనేదే ,మొదటి కోరిక . దీని కోసమే ఎంత తపస్సైనా . ద్వైత ద్రుష్టి వల్ల మాత్రమే ,ఇవి జీవించి ఉంటాయి .
శరీర స్పృహతో జీవి ,ప్రపంచ వస్తు సంచయమే గమ్యంగా బ్రతికి నపుడు ,ఈ ఆరుగురి ప్రతాపానికి లోటు ఉండదు .
పరమాత్మను చేరడం ,గమ్యంగా గలవారికి ,సృష్టి పరమాత్మ స్వరూపమే అనే దృష్టిని ప్రసాదించి ,[శరీరం]భూమిని , [తనదనేది లేదనే బాల్యాన్ని]ప్రహ్లాదుని ,[సృష్టి లోని అమ్మవారి రూపమైన సంపద]సీతను ,తమో గుణ రూపమైన
కుంభకర్ణుని నిర్జించి ,[గురువు,శాస్త్రము ,చెప్పినవి,వినని ,మొండితనాన్ని].అసూయా స్వరూపమైన [మాత్సర్య]
శిశుపాలుని[మద]దంతవక్త్రుల నుండి ,మనః రూపమైన రుక్మిణిని ,కాపాడి ,తనలో తనే రమించే' అహం బ్రహ్మస్మి'
స్థితిని ,వర్తమాన రూపమైన విష్ణువై ,ప్రసాదిస్తాడు .
          పరమాత్మ నుండి స్వాభావికంగా ప్రకటిత మయే ప్రతిభే సృష్టి . దీనికి కారణం లేదు . నీటి చల్లదనంలా ,అగ్ని
వేడిలా ,వాయు చలనంలా ,ఆకాశ వ్యాపకత్వంలా ,పృధివి లాంటి సహనంలా ,స్వామి ప్రతిభే సృష్టి . దాన్ని అలానే
చూసే వారికి ,రాగ ,ద్వేషాలు కలగవు . ఇవి రెండు లేనంతవరకు,సందేహం లేదు.సందేహంలేని జ్ఞానం పరబ్రహ్మమే.
ఇంద్రజాలికుని సృష్టి ,మాయ అని అందరికీ తెలుసు.కానీ స్వామి స్వయంప్రభను ఎరుగక ,పంచభూత మహాప్రపంచం
అమ్మవారిగా గ్రహించక ,పొందే ద్వైత భావాన్ని నిరసిస్తూ ,అద్వైత ప్రతి పాదనమే వేద సారం . తానొక్కడే తప్ప అన్య
మెరుగని స్థితి ,సంన్యాసం . వారికి కలిగిన అనుభూతి సర్వం బ్రహ్మమయం జగత్ . కానీ చెవిన పడిన ప్రతి వారు
సాధన విడిచి అంత ఒక్కటే అనడం,పిచిక సముద్రాన్ని 'అవుపోసన'పట్టడం లాంటిదే. జన్మ పరంపరలలో ,శరీరాన్ని
తానుగా భ్రమించి ,అదే తననే అహంతో చేసిన కర్మ ఫలాలు ,పాప ,పుణ్యాలుగా కలిగి ,పునరపి ,జననం ,పునరపి
మరణం అనే చక్ర భ్రమణం నుండి ,అంతా పరమాత్మయే ,అంతా పరమాత్మదే అనే జ్ఞానం వరకు మాత్రమే ,అద్వైతం
నుండి గ్రహించి,సృష్టిలో చరించేటపుడు జీవ భావంతో, తన కర్తవ్యాన్ని విడువక ,బుద్ధి యోగంగా మాత్రమే ,జ్ఞానాన్ని
గ్రహించాలి . ఆచరణకు ధర్మాన్ని ఆశ్రయించాలి .
     సకల జీవకోటి లోను పరమాత్మను చూడగల మానవ జన్మకలిగి నందుకు ,పరమాత్మకు కృతజ్ఞతా ఆవిష్కారమే
సాధన . జీవాత్మ ,పరమాత్మగా, ప్రతిబింబ భావాన్ని విడిచి ,బింబమే తానుగా ,మౌనంలో రమించే ,స్వానుభవం
గమ్యం . దీన్ని యోగ పరంగా షట్ చ్రక్ర బేధనంగా అంటారు . సృష్టి అంతా అమ్మవారి రూపమే . మూలాధారం నుండి
ప్రస్థానం ప్రారంభం . అమ్మ [సృష్టి ]తాను , పరమాత్మయే అని చేరేదే ప్రస్థానం . ఇదే అమ్మవారి ఏ రూపమైనా ,మళ్లీ
అర్ధ నారీశ్వరమై శాంతిస్తుంది . మాయా వ్యాప్తమైనపుడు కూడా ,నిద్రలో ఏకమైతేనే కానీ ,విశ్రాంతి లేదు .
     వేద ప్రతిపాదితమై ,భారతీయ జీవనాధారమైన, ఆచారమైన ,కళ్యాణ శోభ, ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తుంది .
కలియుగ వైకుంఠము తిరుపతి లో ,అమ్మవారి కళ్యాణము ,తిరుమలలో అయ్యవారి కళ్యాణము ,వీటిని ఒకసారి
పరి శిిలిద్దాం . ఉనికి పరమాత్మ . వైభవం అమ్మ . కానీ సృష్టి నుండి పరమాత్మను చేరడానికి ,ఏడు కొండలు ఎక్కాలి
సృష్టిలో కూడా పరమాత్మ ఉనికి లేనిదే ఇది నిలబడదు.హృదయాంతర్గతమైన ,చైతన్యం సూక్ష్మంగా ఉంటుందని
పెద్దలు అంటారు . అమ్మవారు వరించి తిరుపతిలో,చేసుకునే కళ్యాణ మూర్తులను గమనిస్తే ,స్వామి మూర్తి ,చిన్నగా
ఉంటుంది . అలానే పూజించి అర్చించే మూర్తి ,గృహంలో కూడా కొంత పరిమాణాన్ని దాటకూడదు . పూజకు త్రిపుటి
ఉంటుంది . నిజానికి పరమాత్మ ,త్రిపుటికి అందనివాడు . అతనిని ఒక మూర్తిలో చూడడం అంటే ,అంతకంటే ఏమీ
చెయ్యలేము గనుక . ఇది మానవ యత్నం పరమాత్మను చేరడానికి ,ఇది తిరుపతిలో అమ్మవారి కళ్యాణం . స్వామీ
నీవే మాకు కావాలి ,ఇతరమేది వద్దు ,అనే సంపూర్ణ ప్రజ్ఞతో చేసే పూజ ,జప ,ధ్యానాలు ,మానవ యత్నం .
          ధ్యానంలో మనసు లయించి ,సర్వే సర్వత్ర ఉనికి ప్రకాశిస్తే , అది పద్మావతిని కానీ ,అలానే గోదాదేవిని గాని
స్వామి చేపట్టిన కళ్యాణం . ఇదే అంతరార్ధంతోనే అమ్మాయికి ,వివాహ సమయంలో ,గోత్రం మార్చి ,ఆమె ఉనికి
భర్త ఉనికిలో ఏకమై ,వేరనే భావనే లేక కరిగి పోవలనేదే ,సంప్రదాయం .మా అమ్మాయి ,మా ఇష్టం ,అనేది కాదు .
శాస్త్రాన్ని గమనించాలి ,అనుసరించి ,అనుసరింపచెయ్యాలి .