14, డిసెంబర్ 2013, శనివారం

సంస్కృతి -సంప్రదాయం



   ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః. 

సంస్కృతి -సంప్రదాయం
     పరమాత్మ వైభవం అద్వైతం . సమాజం ద్వైతం . రెండు విడివిడిగా ప్రశ్నించబడి సమాధానాలు వెదికి
క్రుతక్రుత్యతనుసాధించాయి . కానీ వీటి అనుసంధానం మాత్రమే మనిషికి అంతరంగ శాంతికి అత్యంత ఆవశ్యకం .ఆత్మ శోధనలో అంచులు చూసినా ,అంతరంగంలో మాత్రమే ధ్యాన స్థితిలో ,లేదా తనలో తాను మునిగినంత వరకు శాంతికి ఏ భంగము కలగదు. కానీ శరీరపరమైన వ్యవహారానికి సమాజంలో కదలిక తప్పదు . 'అహం బ్రహ్మాస్మి 'అని నిర్ద్వందమైన అనుభవం స్వంతమైనా, చరించే దిశలో ద్వైతపరమైన సందేహాలు సహజమే . అలానే ద్వైతపరమైన ఎన్నో ఆటంకాలు దాటేందుకుసంపూర్ణ భక్తి,లేదా శరణాగతి నిర్ద్వందమైన సమాధానమైనా,ఉన్న శరీరంలో ఇప్పుడే ఇక్కడే 'అహం బ్రహ్మాస్మి'   అని శాంతిమంత్రాన్ని చెప్పే సాహసం కొరవడుతుంది .అద్వైతం శివుడైతే ,అమ్మవారిని ద్వైతంగా  ,పెళ్లి కూతురుగా సింగారించికళ్యాణం చేస్తే కదా,అర్ధ నారీ శ్వరుని చేస్తే కదాజీవకళ్యాణం.అంతరంగ వైభవంగా అద్వైతం ,భాసిస్తున్నా,పరమ సంతృప్తిగా జీవితం విరబూసిన పుష్పంగా సాగాలంటేఅన్వయం ,అత్వంత ఆవశ్యకం .నిజానికి ద్వైత బోధగాని ,అద్వైత  బోధగాని, శిష్యుని రూపంగా ఒకవ్యక్తి పొందుతాడు,నిజానికి ఒక నీటి బొట్టుకు ఒక ఆవర్తం ఏర్పడుతుంది .ఏ చుక్కకైనా అదే పరిధి . ప్రతి నీటి బొట్టు తన పరిధికి మించినది,లేదనే అనుకుంటుంది ,తనలో ,కానీ జాగ్రదావస్థలో మాత్రమే సాధ్యం . నిద్రలో  పరిధి జారి పోతుంది.ద్వైతాన్ని మెలకువలోకాపాడుకోవచ్చు ,కానీ నిద్రలో కాదు . అంతా  సమానమేఅనేనిద్రాస్థితిని మెలకువకు  అన్వయించడం ,అసాధ్యం. అందువలన కలను, ఉపమానంగా సృష్టిని అనుసంధానం చేశారు పెద్దలు అందువలన కలను యధాతధంగా స్వీకరించినట్లు కష్ట ,నష్టాలనుస్వీకరించి ,ప్రతి మనిషి సహనంతో వాటిని దాటవచ్చు . అంతవరకూ మాత్రమే ఈ అవగాహనకు అవకాశం ఇవ్వాలి . లేకుంటేప్రయత్నం అనేది కుంటు పడుతుంది . నైరాశ్యం ఎదురవుతుంది .
      దీన్నుండి బయటపడా లనుకుంటే కర్మ యోగం యొక్కఅవగాహన అవసరం . మెలకువకు మాత్రమే కర్మయోగం అనుసంధానం అవుతుంది . మెలకువకున్న ప్రధాన లక్షణం పరిధి .ఇది ద్వైతంలో మాత్రమే ప్రవర్తిస్తుంది .  అందువల్లనే ఎవరి పరిధిని వారు అతిక్రమించక జీవించాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించక తప్పదు .ఈ విషయంలో మాత్రమే మతాలు మానవత్వాన్ని శాసిస్తాయి .అందరికీ సమానమైన నీరు ,నిప్పు ,గాలి ,ఆకాశం, నేల ,ఒక్కటే  అలాగే సుఖఃము ,దుఖఃము , నిద్ర ,జనన ,మరణాలు అందరికీ సమానమని అన్ని మతాలు ఒప్పుకుంటాయి . అందరూ ఒప్పుకునేది అద్వైతం . విబేధాలున్నది ద్వైతం . విబేధాలున్న ద్వైతంలో ఎవరి భావాలు వారు ఎవరితోవిబేధించకుండా కాపాడుకుంటే ,అదే సభ్య సమాజం .కానీ ,ఒకరికి ఎంతో గొప్పదైన భావజాలం వేరొకరికి పేలవంగా అనిపించవచ్చు . ఎవరి పరిధి వారిది అని సరిపెట్టు కోవలేకాని వాదన వలన పరిష్కారాలకు బదులు ,ప్రమాదాలే మిగులుతాయి.కర్మ యోగం లోని ప్రధాన ప్రతిబంధకం,పని తాను చేస్తున్నాననే భావం వలన ఏర్పడే,పాప పుణ్య రూపమైన,జన్మ కారణమైన సంచితంగా, మార్పు చెందడమే .దీనినుండి బయట పడాలంటే ,భరతునికి పట్టం కట్టవలసిందే .భరతుని పాదుకా పట్టాభిషేకాన్ని జీవుడు తనంత తానుగా స్వీకరించి , కర్తృత్వ భావం నుండి విముక్తి పొందాలి .
       దీన్ని వేరే కోణం నుండి పరిశీలిస్తే ఉన్నది అద్వైతమే . అర్ధం చేసుకోవడమే పరిష్కారం కానీ ,వాదన కాదు . కన్ను ఎన్నో వస్తువులను చూస్తున్నది . వస్తువులు మారుతున్నాయి . కానీ కన్నులో కానీ , చూడడం అనే క్రియలో కానీ ఏ మార్పు లేదు . దాన్ని గమనిస్తూ వస్తువుల విషయాన్ని పరిగణన లోకి తీసుకోకుండా చాలా జాగ్రత్తగా జీవిని ఉద్ధరించే , భగవదత్త మైన జీవిత కాలాన్ని వినియోగించుకునే నేర్పే ధర్మం .తల్లి ,తండ్రి ,పిల్లలు ,మనుమలు ,ఇలా తొలి పరిధి కుటుంబం . కంటికి కనిపించక పోయినా ముందు తరాల పెద్దలు వీరికిఆధారం .ద్వైతంలో ధర్మవాదులకు వేద ,శాస్త్ర , గీతాది గ్రంధాలు,ఆధారంగా  అందరికి పరిధులు విధించబడ్డాయి .జన్మ తోనే పరిధి ప్రారంభ మౌతుంది . తల్లి దండ్రుల ఆర్ధిక సామాజిక ,స్థితిగతులే ప్రమాణంగా ,ప్రతివారి పరిధి ,పుట్టుకతోనే నిర్ణయమౌతుంది . ఈపరిధిని గౌరవించి జీవించి
ఎంతటి పురోగతి నైనా సాధించ వచ్చు . ఈ విధమైన జీవిత విధానం ధర్మ పరిరక్షణకు సోపానమౌతుంది .
      అదే ముందు తరాలవారికి మార్గ దర్శకమౌతుంది . ఎవరి కుటుంబ పరిధి వారు కాపాడుకుంటూ ,చాలా తక్కువగా ప్రపంచంతోఅనుబంధాన్ని కొనసాగించారు . అందు వలన పల్లెలు పోషించబడ్డాయి.కుటుంబం తరవాతి పరిధి విద్యకు కేటాయించారు . దీనికి వృత్తి ప్రాధాన్యంగా,వేద  జ్ఞానమే సాధనంగా ,బ్రాహ్మణులు . ఈజ్ఞాన సహాయంతో రాజులు , పరిపాలనాపరమైన విషయాలను ,వైశ్యులు న్యాయ బద్ధమైన వ్యాపారాన్ని ,మిగిలిన వారంతావ్యవసాయ, గోపాలనాది వ్యవహారాలు నిర్వహించి ఎవరి పరిధిలో వారు తృప్తిగా జీవించారనడంలో ఎటువంటి సందేహం లేదు .ఆక్రమణల పేరుతో కానీ ,వ్యాపారం పేరుతోకాని విదేసిపరిచయంతో మాత్రమే మన వ్యవస్థ కుప్పకూలింది .దీని ద్వారా ఏమి పొందగలిగమొఅందరికీ తెలుసు .
      ఈ విపత్కర పరిస్థితులలో, ప్రస్తుతపు మన మొదటి పరిధినైనా కాపాడుకోవలనుకోవడం అత్యాశ మాత్రం కాదు . ఒక్కరిద్దరుపిల్లలైనా, మన  పెద్దలు ఆశించిన రీతిలో దిద్ది ,తల్లి దండ్రుల ఋణం తీర్చుకోవడం ప్రధమ కర్తవ్యం .ఇది ద్వైతంలో విషయం .మరి అద్వైతంలో, ప్రతి మనిషిలో అంతః కరణ చతుష్టయంలో అహంకు జ్ఞాన యోగాన్ని ,చిత్తానికి భక్తి యోగాన్ని,బుద్ధికికర్మ మార్గాన్ని ,ప్రతిపాదించి వీటియొక్క సంపూర్ణ ప్రజ్ఞతో మనస్సును స్వాధీన పరచి, శరీరం సాధనంగా మాత్రమే గుర్తించాలి.కానీ శరీరం కోసం మాత్రమే జీవితాన్ని సమర్పించ కూడదు .
                     శ్రీ రాముని చిత్రంలో ,మనకు శ్రీరాముడు ,సీత ,లక్షణుడు ,హనుమంతుడు సాధారణంగా కనిపిస్తారు . శ్రీరాముడు  జ్ఞానం ,సీత భక్తి ,లక్ష్మణుడు వైరాగ్యం ,హనుమంతుడు బుద్ధి యోగం . సర్వే సర్వత్ర ఉన్నది సీతా రాములే . లక్ష్మణుడనే జీవుడు , వైరాగ్య భావంతో ,నాది అనే భావాన్నిశరీరానికి  [ఊర్మిళలా]నిద్రాణంగాఉంచి , ప్రచోదనం చెందిన హనుమంతునివంటి బుద్ధితో, సర్వే సర్వత్ర సీతారాములే ఉన్నారని ,తానంటూ వేరుగా లేనని పొందే  అనుభవం ఒక  వ్యక్తిదే కానీ ,సాధన స్వరూపాన్నే మనకు 4మూర్తులుగా పరిచయం చేస్తున్నది ,రామాయణం. శరీరమే తను . శరీరానికి సంబంధించినవి తనవి . ఇదే జీవతత్వం . తాను శరీర మాత్రుడు కాదని, సృష్టి, దృష్టిలో ఉన్నా అనుభవానికి రావడం పరతత్వం . దృష్టిలో, సృష్టి కదలుతున్నా , మెలకువలో బుద్ధి పరతత్వంలో మేలుకొని సృష్టిలో కదలు తున్నదంతా పరమాత్ముని శక్తి మాత్రమే, అనే అనుసంధానాన్ని కొనసాగించి ,ప్రతి కదలికను జ్ఞానాగ్ని పునీత సీతగా గ్రహించి అష్ట సిద్ధి రూపంగా కలుగుతున్న భౌతిక ,ఆధ్యాత్మిక సంపదను మాయగా గుర్తెరిగి ,సాక్షాత్తుగా సీతా మహాదేవి ప్రసాదించిన మాల,అయినా,తన అంతరంగంలో శాంతికి ఏ మాత్రం భంగం కలగకుండా సాధనలోని ఏకాగ్రతను సడలనివ్వక ప్రతి క్షణంలో,రామపట్టాభిషేకాన్నిద్రుష్టి నుండి దూరం కానియక[అంతా పరమాత్మదే]అని,నిద్రలోనడిచే వ్యక్తిలా[భరతుడు] అవసరమైనంత వరకే ,సృష్టిలో చరిస్తూ,చేరే ,జీవన్ముక్త స్థితికి నిర్వచనమే,రామాయణం.ప్రతి అవతార గాధ, వివిధ,మానవ స్వభావాలకు,వివిధ మార్గాలను గమ్యాన్ని చేరడానికి నిర్దేసించినవి. ఎన్నో మానవ స్వభావాలకు వేరు,వేరుగా బోధ సాగడానికి అనువుగా పెద్దలు వివిధ దేవతా రూపాలుగా,తత్వాన్ని పరిచయం చేశారు .విద్యుచ్చక్తి అనేక ఉపకరణాలుగా , వినియోగించ బడినంతమాత్రాన,దాని ఏకత్వానికి ఏభంగం లేనట్లే ,అనేకదేవతారాధన అని అందరూ భావించేది,అవగాహనా రాహిత్యమే కానీ,నిజం కాదు .దీన్ని కూడా అవసరం లేని వారిని లోపలికి రానివ్వని కంచెలా , అర్హత లేని వారిని సాధనకు రాకుండా  కాపాడే మాయ మాత్రమే.
       ఆదివారంతో ప్రారంభిస్తాము వారాలని . ఆదిత్యుడు పరిపూర్ణ పరబ్రహ్మ తత్వంగా సంభావించారు పెద్దలు . 
అందువల్లనే ఇష్ట దేవతను సూర్యునిలో భావిస్తారు . సమయ పాలనలో ఆదిత్యుడే అగ్రగణ్యుడు . ఆయనరాకకంటే ముందే  లేచి చేతులు వినమ్రంగా ముడిచి అర్ఘ్య ప్రదానంతో ప్రారంభించే జీవనశైలి భారతతీయులది .గర్వించ దగిన భూమండలంలోని పూజగది మన భారత దేశం . పుజారిలా ఎవరికివారే సంపూర్ణ స్వాతంత్ర్యంతో నమస్కరించి , సూర్య నమస్కారాలతో  అందరూ సేవించే, పరమాత్మ స్వరూపం ఆదిత్యునిదే .నవగ్రహ పరమాత్మాంశలలో 'శ్రీ రాముడు' సూర్యుని పరమాత్మంశ. ఏ కష్టమైనా రాజుతో మొర పెట్టుకునే స్వాతంత్ర్యం ఉంటే ,పట్టాభిషేకంతో, రాముని మహారాజుగా మన శాస్త్రాలు పరిచయం  చేసాయి  . సర్వులూ ధనుర్ధారి అయిన శ్రీరాముని ప్రార్ధించి, తమ వెతలను విన్నవించడానికి వెనుకాడరనడానికి, ప్రతివీధిలో జరిగే సీతారామ కళ్యాణాలే సాక్ష్యం .రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు పెద్దలు . ఏది ధర్మం ? ప్రాధమికంగా సృష్టి అంతా పరమాత్మది .శరీరంతో సహా సకలము పరమాత్మదనే సంపూర్ణ అవగాహనే సంపూర్ణ శరణాగతి .ఈభావంనుండి మనసు   జారిపోనికుండా జీవన యాత్ర సాగించేవారికి శ్రీరాముడు  ధనుర్ధారి అయి వారిని రక్షిస్తాడు .జీవ భావంతో ఏది తనదిగా భావించినా శిక్షిస్తాడు . జ్ఞానేంద్రియాలు ,కర్మేంద్రియాలు మొత్తం పది ,ఇవి కలిగి ఉన్న తాను ప్రకృతిలో కనిపిస్తున్నది తనదిగా భావించినపుడు యుద్ధం ప్రారంభం అవుతుంది . ఒక పువ్వుని చూశాo అనుకుందాం . పరమాత్మ సృష్టికి ఆనందిస్తే కలిగేది ఆనందం .కానీ అది తను పెంచిన మొక్కది కనుక నాది .ఈ అవగాహన తప్పు .సృష్టిలో ఉన్న సూర్య రశ్మిని నీటిని,  బీజాన్ని ఇవన్నీపరమాత్మ ఇవ్వడం వలన, అది పువ్వు పూసింది .దాన్నిపెంచే తీరిక దొరికే జీవితం కూడా భగవంతుని  ప్రసాదమే . ఆత్మను ధర్మంతో ఎక్కుపెట్టిన బాణంలా ,గమ్యం చేరే వరకు ప్రయత్నించాలనే పరమ లక్ష్యంతో మొదటి అడుగు వెయ్యాలని 'ఆదివారం 'మన చెవిలో రహస్యంగా చెప్తోంది. 
           స ఉమా వారం ,సోమవారం .ఉమా శివులిద్దరూ, విడిగా కూడా ధరించి  నెలరాజును ,పొంగు కుంగు జీవితంలో   సహజమే ,అంటూ తమ విశ్వకుటుంబానికి తెలియజేస్తూనే ఉన్నారు . నవగ్రహాలలో చంద్రుని పరమాత్మాంశ 'శ్రీ కృష్ణుడు'. వెన్నదొంగ . యింద్రియాలన్నీ ఎవరూ చూడట్లేదనే ,ధైర్యంతో చేసే ప్రతి పని ,ఆలోచనా గమనించే సర్వసాక్షి . ఎవరికీ  దొరకకుండా ఉండాలంటే మరి రాత్రే కదా రావాలి . కృష్ణ జన్మాష్టమికి ,ఉట్టి కొట్టడానికి ఏ బంధనాలున్నాయి ?అందరివాడే పరమాత్మ.  నావాడే, అనే ధైర్యం ఉంటే కనురెప్ప కాడా కన్నయ్య ?ప్రతి భావం వెనుకా కృష్ణయ్యను పట్టుకునే గోపికగా మారితే,మనలోనే లేరా, పదారువేలమంది కన్యలు ?జీవితానికి అందమైన ఆధారం వేరే లేదని గుస గుస లాడింది సోమవారం
     మంగళుడంటేనే కుజుడు . ప్రహ్లాదుని రక్షించిన నరసింహునిలా, పరమాత్మను పరమ గమ్యంగా చూపే ఉగ్రమూర్తి . కుజునికి పరమాత్మంశ ,'నరసింహుడు' . ఎన్నో బాధలు పీడిస్తున్న ప్రహ్లాదుని వలె, కలిలో ఋణ ,రోగార్తులైన మనుజులకు బాహ్య అభ్యంతర సంధిలో ,మృగమవకుండా కాచి రక్షించి ,హిరణ్య కశిపుని స్థితి నుండి, సర్వే సర్వత్ర పరమాత్మ దర్శనం చేసే ప్రహ్లాదుని ,గమ్యంగా, పయనానికి సంసిద్ధం చేసే మంగళ వారాన్ని అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమే .కుమారస్వామి  మరో రూపం కుజుడు.అందువల్లనే మంగళవారం, సుబ్ర్హహ్మణ్య స్వామి ఆరాధనం శాస్త్ర సమ్మతం . కుమారస్వామి గుడిలో పూజలు ,కళ్యాణాలు అందుకుంటే ,సుబ్రహ్మణ్యుడు ,సర్వే సర్వత్ర ,అందరిచేత పుట్టలో పాలుపోయించుకుని అందరూతన వారనే తల్లి దండ్రుల,వారసత్వాన్ని, యిలకు తెచ్చి అందరివాడై ,భయ భక్తులు రెండూ అవసరమంటూ,అల్లరి పిల్లల ఆట కట్టే పద్ధతిని పరిచయంచేస్తుంది మంగళవారం . భయ పెట్టి మరీ భగవంతుని చేర్చే లక్ష్య సాధనను చెవి మెలి పెట్టి మరీ చెప్తుంది మంగళవారం.
      ధీ యో యో నః ప్రచోదయాత్ .ఒకేఒక ఆకాంక్ష .మానవ జన్మ సార్ధకతకు చిన్న ఆశ .అంకురం .ఇది ఉంటే అన్నీ ఉన్నట్లే . బుద్ధి ప్రచోదనం వల్లనే భగవంతుని విశ్వరూప సందర్శనం సాధ్యం . అదికూడా ఎప్పుడో కాదు ఇప్పుడే ,ఇక్కడే అంటుంది బుధవారం . విష్ణువు వర్తమానానికి ,ఆకాశ తత్వానికి ప్రతీక,వ్యాపకత్వం .ఈ క్షణం వర్తమానం . ఇదే పరమార్ధం, విష్ణువు అధి దైవతంగా కలిగిన బుధవారం చేసే బోధ .బుద్ధిని ఏకాగ్రంచేసి వర్తమాన క్షణంలో, శరీర పర్యంతం కాని, ఉనికిలో మునకవేయ్యమనే 'బుద్ధుడు',బుధవారపు పరమాత్మంశ .పుట్టుకకు కారణమైన పాప పుణ్యాల చిట్టావిప్పిదిగులు పడకుండా విష్ణువు పాదాలు పట్టమనే ప్రబోధం ,బుద్ధుడుకాక ఎవరివ్వగలరు ?తారా,చంద్రుల కుమారుడుగా బుధుడు పేర్కొన బడ్డాడు.  గురుపత్ని అనగానే పురాణకధను ,పక్కదారి పట్టించకుండా ,అర్ధం చేసుకుంటే ,పత్ని అంటే శక్తి . గురువుగారి శక్తిని ,తార అన్నారు . అంటే ,శిష్యుడికి అర్ధమైన గురు శక్తి , నక్షత్రమంత మాత్రమే .మినుకు ,మినుకుమని ఎంత కాంతి శిష్యుని వరకు చేరుతుందో, అదే సంపూర్ణమనుకుని మధ్యలోనే ,తనంతతానుగాపరిపూర్ణతను ఆపాదించుకునే ,చంద్రుని వంటి  శిష్యులకు కలిగిన భావావేశం ,ఉపదేశాలకు తావిస్తే కలిగే అనర్ధాలకు ఎవరు బాధ్యత వహించే వారు ?ఇటువంటి భావోద్వేగాలే ,చంద్రుని వృద్ధి క్షయాలకు, ఒక కారణం కావచ్చు . కారణం ఏదైనా బుద్ధి వికల్పానికి గురైతే కలిగే విపరీతాలకు సంకేతమే బుధుని జననం .వీరి బారిన పడినవారికి  ఏకైకమార్గంవిష్ణువుకు పరిపూర్ణ శరణాగతులవడమే . తస్మాత్ జాగ్రత అని బోధించి , గురువు దరి చేర్చేదే మంచి బుధవారం .అంతేకాదు వర్తమానానికి గుర్తుగా అటు మూడు రోజులు ఇటుమూడురోజులు కలిగి మధ్యలో ఉంది బుధవారం.గురువును చూపించి,వారి బోధను సంపూర్ణంగా గ్రహించమని,గోల చేసి వినమంది బుధవారం.
       శ్రీ గురుభ్యో నమః . నిస్వార్ధ గురువు ,బృహస్పతి . గురువారం వీరికే ప్రత్యేకం . ఆదిగురువు దక్షిణా మూర్తి ,విష్ణు రూపంగా హయగ్రీవ మూర్తి ,దేవీ రూపంలో సరస్వతిని ,అందరూ ఆరాధిస్తారు .గురువారానికి అధిపతి బృహస్పతి . అందు వల్లనే బృహస్పతివారం కూడా.గురువుకు పరమాత్మంశ 'వామన మూర్తి'.నిస్వార్ధానికి గుర్తుగా, చెయ్యి చాపి అర్ధించే మూర్తి వామన మూర్తి . సకలమూ తానైన విష్ణు రూపునికి ,దయ తప్ప వేరే కారణం లేదు చెయ్యి జాపడానికి . తాను అంతరంలో క్రీడించే క్రీడలో,తానే పాత్రధారిగా వామనావతారాన్ని గ్రహించ వచ్చు.ఉదాహరణకి,అంతర ప్రపంచంలో చూస్తున్న, వింటున్న ప్రతిదానికి,ఏ విధమైన పాంచ భౌతిక వస్తు సముదాయము అంతరంలో లేదు.కానీ ప్రతివారి ప్రపంచము అదే.అంతరప్రపంచానికి ఏ విధంగా తానే ఆధారమో ,అలానే దృశ్య ప్రపంచం పరమాత్మ అంతరంలోనిదే . అతడే ఆధారం . ఈ పరమార్ధాన్ని తెలిపే కౌపీనధారి అయిన పరమాత్మ ,అతని ప్రపంచాన్ని తమదిగా భ్రమిస్తున్న మానవాళికి ,'అహం'అని వారు భావిస్తున్న, అహం తనదని , వారి అహంతను అణగ ద్రొక్కి [బలి ]తీసుకుని ,బాహ్యంతరాలు తానై వెలిగే ,ప్రస్థానానికి గురువు అనుగ్రహంతో కదలమని శాసిస్తున్న, శాసనాన్ని మౌనంగా విందాం .
          గురువు శాసనాన్ని మనసా, వాచా, కర్మణా, అనుసరించే వారికి కలిగే శుభ సూచకమే ,శుక్రవారము .64 కళలు శుక్రుని అనుగ్రహంతో ప్రాప్తిస్తాయని పెద్దల వాక్కు . భగవంతుడు తన స్వరూపాన్ని ,వైభవాన్ని తెలిపే, ఒక నాటకాన్ని ,ఈ విశ్వమనే చిత్రంగా భావిస్తే ,భగవంతుని పురుషునిగాను ,శక్తిని స్త్రీ గాను భావిస్తే,శరీరం ఆధారంగానే శక్తి ప్రకటించ బడుతుంది. అలాగే వాక్కు శరీరం ద్వారా ప్రకటించ బడుతుంది .అందువల్లనే జప ,హోమ,వేద ప్రతిపాదితమైన సకల శాస్త్రాలు,పురుషుడే పఠించాలానే వాదం ప్రకటించబడి ఉండవచ్చు .బహుశా స్త్రీలు చదవరాదనే దానికి ఇది ఆధారమై ఉండవచ్చు .అన్ని కళలను ఈ విధంగా అర్ధం చేసుకుంటే భగవంతుని శక్తి ప్రకటించబడిన రీతిగా ,మానవులు మాత్రమే కళ ద్వారా తమను తాము వ్యక్త పరచు కుంటారు . సృష్టికి వ్యక్తీకరణ మాత్రమే ఆధారం . అవ్యక్తమైనది వ్యక్తమైతే కలిగేదే ఆనందం.ఆనందానికి అలంకారమే సంకేతం .అలంకార ప్రియుడు శ్రీ మహా విష్ణువు . ఆయన పత్ని శ్రీ మహా లక్ష్మి ,శుక్రవారపు అధి దేవత .భ్రుగు పుత్రిక .ఈ వారం . భ్రుగు వారం . ఈ వారానికి పరమాత్మంశ 'పరశు రాముడు' .పైన తెలిపిన విధంగా గురుబోధను గ్రహించి సకలమూ పరమాత్మదని , తాము పాత్ర ధారులమనే కళా కోవిదులకు ,పరశు రాముడు తన శక్తిని కూడా రాముని కిచ్చిన విధంగా ప్రసాదిస్తాడు .సృష్టిలోనిదంతా తమదనే ,అజ్ఞానాన్ని ,తమ రాజసంగా ప్రకటించాలనకుంటే, పరశువుతో,ప్రహారం చేసి,రాజస భావాన్ని వదిలేలా ఎన్ని సార్లైనా [21]ప్రహారం చేస్తాడు.ఏదైనా దానం చెయ్యాలనుకునే బలి వంటివారికి ,రాజసం శుక్రునిలా అడ్డు పడుతూనే ఉంటుంది . అలాంటి శుక్రునికి అజ్ఞానమనే కంటి చూపు పోగొట్టి ,త్రి విక్రముడై ,సకలమూ తానేనని తెలిపిన శ్రీ మహా విష్ణువు ,పరశు రామునిగా అనుగ్రహిస్తాడని శుక్రవారం తన ఆశీర్వాదాన్ని, సున్నితంగా వినిపిస్తోంది .
        సూర్యుని కుమారుడు శనైశ్చరుడు . ఈ పేరుతో ఉన్నదే శనివారం . సూర్య నారాయణ మూర్తి ,తెలిపే ఎన్నో విషయాలు,నెమ్మదిగా జీవితంలో అనుసంధానం చేస్తూ నారాయణుని చేరాలనే ఉత్సాహం కలవారిని ప్రోత్సహిస్తూ,లేనివారికి దండ ధరుడై ,దండిస్తూ,ప్రక్కనే ఉన్న భాను వారం వైపు నడిపిస్తాడు.భానుడు తూర్పు వైపు ఉదయిస్తే,పడమర వైపు చూస్తూ భగవంతుని నియతిని ఎదిరించే [ఎదురుతిరిగే వారిని ]గుర్తించి ,వారి పురాకృత పాపాల ఫలితమైన దుఃఖాన్ని వారికి గుర్తు చేసి ,కర్మ ఫలాలను అందించే కరుణా మూర్తి . పిల్లలను గదమాయించైనా సన్మార్గంలో పెట్టే పెద్దన్నగారిని గుర్తించి ,తండ్రి మాటను అమలు చెయ్యమని గుచ్చి ,గుచ్చి చెబుతోంది శనివారం . శనివారానికి పరమాత్మంశ 'ఆది వరాహ మూర్తి '. యజ్ఞ వరాహ మూర్తి .యజ్నమంటే కర్మ. శ్రద్ధగా కర్మాచరణ చెయ్యమంటుందిశనివారం .[అలసత్వాన్ని క్షమించడు శని] భూ వరాహమూర్తి కదా స్వామి .సముద్ర జలాల్లో మునిగిన భూమిని ధరించి తెచ్చి,యజ్ఞ కల్పనకు అందించిన వరహముర్తి. పురాక్రుతమైన పుణ్య ,పాపాలకు అనువైన శరీరాన్నిచ్చి ,శరీరం వదిలి ,మరో శరీరం కోసం అలమటించే జీవులను ఉద్ధరించి శరీరమనే ,భూమిని ,దారి తెలియక అగమ్యంగా తిరిగే సముద్రం నుండి ఉద్ధరించి ,కర్మాధికారం ప్రసాదించిన గోవిందునికి నమస్కారం . యజ్ఞ ఫలంగా ,పరమాత్మ తాననే సంపూర్ణ జ్ఞానం కలిగే వరకు ,ప్రతిజన్మలో తోడుండి ,మానవ కర్తవ్యాన్ని సక్రమంగా పూర్తి చెయ్యమని శాసిస్తోంది శనివారం . అన్నగారి మాట చెవిన పెట్టాలి కదా .
భద్రం కర్ణేతి  శృణు యామ దేవాః . అనేది మొదటి శ్రుతి వాక్యం . బాహ్యం కంటే నిజానికి అంతరంగమే ఎక్కువగా
వ్యక్తులు వింటారు.ఎప్పుడూ పరమాత్మ విషయాలు వినడానికి ,బాహ్యానికంటే అంతరంగమే సరిఅయిన వేదిక. బాహ్యమైతే ఉపద్రవాలు కలగవచ్చు . అంతరం మౌనానికైన ,మాటకైనా సిద్ధంగా ఉంటుంది,సంస్కరించబడి ,సాధన చేస్తే . కుమారునికి , గర్భాదష్టమంలో,ఉపనయనంలో,తండ్రి,గురూపదేశమైన గాయత్రీ మంత్రాన్నివినిపిస్తాడు.ఉపదేశం అంటే సమీపంలో కూర్చుని అతనికి మాత్రమే,వినిపించేలా చేసేది,అనికదా అర్ధం. ఇది బాహ్యోపదేశానికే కాదు.ఈ సూచన నిజానికి అంతరానికే ,ఎక్కువ అనుసంధానమౌతుంది .అంతరానికే వేరే ఏమీ వినకుండా ఉపదిష్ట  మంత్రాన్ని వినే శక్తి ఉంది. అందువలన ,భగవత్ సంబంధ విషయాలను వినడం ఈ వయసు నుండి మనసుకు నేర్పించడం వేదవిధి .అందువల్లనే ధృవుడైనా,ప్రహ్లాదుడైనా అతి త్వరలో పరమాత్మ సాక్షాత్కారం పొందినట్లు గమనించవచ్చు .జీవుడు సనాతనుడైతే ,ప్రతిజన్మ ,పరమాత్మ ప్రస్థానంలో ఆరోహణలో భాగమే . దానికి మనో నియంత్రణతో కూడిన నిబద్ధతను అందించడం తల్లి దండ్రుల ప్రాధమిక కర్తవ్యం. మననం చేయడం వలన తరింప జేసేదే మంత్రము.మననంలో వినడమే ప్రాధాన్యం వహిస్తుంది .అనడంకన్నాప్రభావంతో  మనసును అదుపులో ఉంచడానికి వినడమే ప్రధానం .నాదానికి మనసును వశం చేసుకునే శక్తి ఉండడం వలననేసంగీతజ్నులు, మనోనియంత్రణకు నాదాన్ని వినడమే సాధనగా సాగించారు. పాడుతున్న వారు ,తమ పాట తాము వినడంలోనాద మయులౌతారు . అంటే తన్మయులౌతారు.వింటే కలిగే తన్మయం పాడడం మీదకు దృష్టి మళ్ళినపుడు ఏకాగ్రతగా సాధన స్వరూపంగా మారుతుంది . వింటే ఆనందంగా ఇంద్రియాతీత స్థితినిస్తుంది . క్షణాలలో మనసు రెంటినీ మార్చడం వలన కలిగే అనుభూతి ఆనందంగా మాత్రమే అనుభూతమౌతుంది . శ్రవణానికి కూడా ,శ్వాస పై ధ్యాస ఎలా పరమాత్మను చేరుస్తుందో అంతే శక్తి ఉంది . అందువలన రామ నామమైనా హృదయంలో వింటే ,ఈ సాధన సాక్షిత్వాన్నిస్తుంది .అందువలన బాల్యంలో పిల్లలకు వినే నేర్పును పరిచయం చేస్తే వారి భవిష్యత్తుకు మంచి పునాది అవుతుంది . వినడం వలన వివేచనా జ్ఞానం పెరుగు తుంది . సారభూతమైన మంచిని స్వీకరించే శక్తి మెరుగౌతుంది . 
         ఏ తల్లి దండ్రులైనా పిల్లల బాగుకన్నా కోరేదేమి లేదు . కానీ బాగు శరీర పర్యంతమా ,శరీరిక్కూడా అవసరమా ? జీవభావం వదలలేదు కనుకనే శరీరం ప్రాప్తించింది .అది వదిలే లోపే ఉద్ధరణ అవసరం . శతం జీవతి . కానీ ఉద్ధరణ మాత్రం ఎప్పుడు ప్రారంభమో శాస్త్రం నిర్దేసించింది.ఎనిమిది సం/.బాహ్యంతర వివేకం మొదలవుతుందని సూచనగా మననానికి మంత్రాన్నిపరిచయం చేసింది . మంత్ర మిచ్చి చేతులు దులుపుకోమనలేదు . చర్విత చర్వణంగా పరమాత్మ సంబంధిత విషయాలను ధారా పాతంగా వినిపించే బాధ్యత పెద్దలు స్వీకరించి,తాము తమను ఉద్ధరించుకుని ,పిల్లలకు సహకరించడం కర్తవ్యం.గృహస్థాశ్రమం స్వీకరించేదే,తాము తరిస్తూ,తరించడానికై ఎదురుచూస్తున్నజీవులకు శరీర దానమే ప్రధమ లక్షణంగా గ్రహించాలి . అంతేకాని శరీర సుఖం పరిధిగా గృహస్తాశ్రమం విధించ బడలేదు . వధూ వరులకు బాల్యంనుండి భగవత్ ప్రాప్తి లక్ష్యంగా జీవన విధానాన్ని సంస్కరించి ,వారి ఇంద్రియాలు వారు చెప్పినట్లు వినేలా నేర్పి ,వారికి వివాహంతో ,సంతాన సంరక్షణే ధ్యేయంగా జీవించే ప్రాధమిక సూత్రాన్ని అవగాహనకు అందేలా చేసేదే ,వైదిక జీవన విధానం .ఏకాగ్రత అవసరమైన క్షణంలోమనసు,అన్నిఇంద్రియాలను నిగ్రహించి,తనలోతాను లక్ష్యసాధనలో మునిగే,ఈ అచంచల స్థితి,ఆ శ్రీకూర్మనా ధునిదే. ఈ పరిచయం కోసమే ,ఉపదేశం . పిల్లల మనసుకు దగ్గరగా పెద్దల మనసు దిగివచ్చి వారికి చప్పే ప్రతి మాట ఉపదేశమే . దీనిని మరిచే కన్నా ,సంతానానికి చేసే వేరే అపకారమేది లేదు . ఇదే పెద్దలు,పిల్లల కిచ్చే నిజమైన ఆస్థి . అస్థికల కంటేలా ఏకాగ్రత  ఎంత ఆవశ్యకమో ,తెలియజేసి ,భుక్తి పరిధికి ఎంత వరకు అవసరమో అంతే విలువ,విదేశీయులు అంటగట్టిన చదువుకిచ్చి ,పరమ గమ్యాన్ని కూడా నొక్కి వక్కాణించాలి .  'శ్రీ రామాయ  నమః.'. వాక్కు పలికే మానవ శరీరం కలిగి ఉన్న వారెవరైనా పలకవచ్చని ,సాక్షాత్తుగా బోయవానిచేత పలికించిన మంత్రం ,నేర్పే ఓర్పు ,నేర్పు ఉండాలేగాని కులాలు అడ్డు వస్తాయా ?  ధర్మవ్యాధునికన్నా ఎక్కువ ధర్మాన్ని , అధర్మంగా ఎవరినో చూసి చెయ్యనక్కరలేదు . మనసును సరి పెట్టే ,మిషతో అధర్మాన్ని గెలిపించ వద్దని పిల్లలకు , నేర్పే తల్లి దండ్రులు ధన్యులు .            
               సంస్కృతీ, సంప్రదాయా లంటేనే ధర్మ ప్రతిపాదన.సంస్కరించ బడితేనే సాంప్రదాయం ఆవిష్కరింప బడుతుంది. సంస్కారం సంప్రదాయమైతే,సాంప్రదాయం సంస్కృతిగా మారుతుంది.సంస్కరించు కోవడానికి ఆధార బిందువే నేను. ఎలా?నేను తానై ,పరకాయ ప్రవేశం చేస్తే సాధ్యం. ఎదుటివారి స్థానంలో మానసికంగా ప్రవేశించి,తాను,తను మాట్లాడే మాటలువింటే ఎటువంటి సంతోషం,లేదా బాధ,కోపం ఏ భావాన్నిపొందుతారోగమనించి[వాడే ప్రతిమాట,వాక్కుతో,][భావం మనసుతో,][శరీరంతో అవ్యగ్రత]కలిగితేదాన్ని మాత్రమే ప్రపంచంలో కలిగి ఉంటే,ఎదుటివారికి,అలాగే తనకు న్యాయ బద్ధమైన ధర్మానికి సంస్కరణ ప్రారంభంఅవుతుంది.సాక్షిగా ధర్మాన్ని ప్రతిపాదిస్తే అందులో న్యాయం లోపిస్తుంది.అనుభవ శూన్య మైనధర్మబోధకుటుంబానికి,తమవంతుఅన్యాయాన్నిఅందించినట్లౌతుంది.ఒకపాటగురించిఆలోచిద్దాం.ఉదా:పనిలోపాటపాడుతూశ్రమనిమరచిపోడానికి,ఒకరుజానపదంలోని దైవసంబంధితంగాని,వ్యంగంగాని,ఎత్తిపొడుపు కానీ,స్త్రీ,పురుషుల సల్లాపాలు కానీ ఏదోఒకటి పాడుతూ ఉంటారు.దీంట్లో కూడా మనిషి,మనిషికి భావ ప్రాధాన్యం మారిపోతూ ఉంటుంది. నెమ్మదిగా భజనకు తావిచ్చి భగవత్తత్వానికి చేరువై కొద్దిమంది వారి శైలి మార్చుకుంటారు. కానీ ఒక శాతం కూడా కష్టమే. కానీ అవకాశమే లేదు అనలేము. కానీ ఎన్నో తరాలుగా సంగీతంలో రమించి తరించిన కుటుంబాలు పూర్వపు తరాల్లో ఎక్కువే.వారింట పుట్టి ,పెద్దగా పెద్దలమాట వినక, సాధనచేయ్యక,తమోగుణం వలన జానపదులైనా  తరించే సంగీతం తో తరిస్తానని పలకవచ్చు. తమోగుణం తో దేన్నైనా సాధించడం అసాధ్యం. పరమాత్మ ప్రసాదించిన ,జన్మించిన కుటుంబానికి వన్నె తెచ్చేలా బ్రతికితే దాన్ని దైవం పట్ల కృతజ్ఞత అని,ధర్మం అనీ అనుకోవచ్చు. తమ అనుకూలత మాత్రమే ప్రధానం ఐతే ధర్మం పట్ల అన్యాయమే.మానవులు తమకి జరిగే అన్యాయానికి కోర్టులో న్యాయాన్ని ప్రశ్నించవచ్చు. కానీ మానవ హృదయమే న్యాయ స్థానంగా ఉన్న ధర్మం ప్రశ్నించేది ఎక్కడ ? ఎన్నో సందర్భాలు జీవితంలో తారస పడినపుడు, భగవంతుడు ప్రసాదించిన ,దేశ,కాల,కుల,కుటుంబ నేపధ్యానికి తగిన జీవితవిధానం ,గుణ ప్రతిపాదన లేని ధర్మ కర్మాచరణ న్యాయాన్ని ప్రసాదిస్తే 'ధర్మో రక్షతి రక్షితః 'అనేది అందరికీ అనుసంధానమౌతుంది.
     మన సంప్రదాయం వేద ప్రతి పాదనం.  దీనికి ఆధారం మన శాస్త్రాలే. మౌలికంగా వ్యక్తిత్వ ప్రధానంగా చూస్తే
రామాయణాన్ని దీనికి ప్రాతిపదికగా తీసుకోవచ్చును. మనం ధర్మప్రధానంగానే ఎవరికైనా ప్రాధాన్యత నిస్తాము. పొగిడినా,తెగిడినా అదే ఆధారం.వేరే దేన్నైనా ఆధారంగా గ్రహిస్తే ,దానికి గుణమే ప్రాధాన్యం వహిస్తుంది.కానీ గుణం ప్రధాన్యత వహిస్తే ,మనకున్న అరిషడ్వర్గాలు బలపడతాయి,అంతేకాని మనకున్న  షడ్గుణైశ్వర్యాలు బలపడవు.
      నిజానికి గుణాధారంగా భగవంతుడు ఏర్పాటుచేసిన వ్యవస్థ మాత్రమే,కుల వ్యవస్థ. పంచాంగం ప్రకారం ద్వాదశ రాశుల ఫలితాలు ,ఎవరి పుట్టిన తేది ,చోటు ,వీటి ప్రధానంగా అనుసంధానం అవుతాయో,అలానే గుణ ప్రధానంగా మాత్రమే వర్ణవ్యవస్థలో,జన్మ సంభవిస్తుంది.ఇవి భౌతిక సూత్రాలకు అందవు. రసాయన శాస్త్రం,విద్యుత్తూ ఇలాంటి ఎన్నో విషయాల్లో , అవి అలా ఉన్నాయి ,అని తెలుసుకో వలసిందే తప్ప,అవి అలా ఎందుకున్నాయి?అని ప్రశ్నించడం వీలుకాదు. అటువంటి విశ్లేషణకు అందనిదే వర్ణ వ్యవస్థ.
          శ్రీరాముడు సంపూర్ణ పరబ్రహ్మమే అయినా,అవతార ప్రయోజనం,రాక్షస సంహారం కనుక,రజోగుణ ప్రధాన మైనక్షత్రియ వంశంలోజన్మించి గురువుగా వసిష్టుని స్వీకరించి అందరికీ మార్గ దర్శకుడైనాడు.'బ్రాహ్మణుడైనా,పరి- పూర్ణమైన పరబ్రహ్మమైన,నాకంటే వసిస్టుడు ఎలా గొప్పవాడు?'అని ప్రశ్నించ లేదు.అలాగే ఎన్నో అస్త్ర ,శస్త్ర విద్య లిచ్చిన,విశ్వామిత్రుని, నీవు కూడా క్షత్రియ గుణాలు కలిగి ఉన్నావు కనుక,నీవు,నేను సమానమే. అని అతనిని, సమానత్వం ముసుగులో ,కించ పరచలేదు.విశ్వామిత్రునితో యాగ సంరక్షణకు వెళ్ళినా ,మా నాన్న కన్నా మేమే అర్హులము ,అని విర్రవీగ లేదు.
      పరంపర ముసుగులో,మానాన్నకు ముగ్గురు భార్యలైతే ,నాకు ఆరుగురు అనలేదు.తండ్రి ఇచ్చిన మాటకు, తల్లి చేతిలో , తండ్రి కీలు బొమ్మ ,అనలేదు. ప్రధమ సంతానానికే రాజ్యం ,ఇది పూర్వీకుల ఆస్థి, దీనిని నీకు దానం చేసే హక్కు లేదని , న్యాయ వ్యస్థను అడ్డు పెట్టుకోలేదు.అడివికి పోయినా ప్రైవసీ లేదని,లక్ష్మణుని పై గొణగలేదు. ఒక సారి, శబరి పెట్టిన పళ్ళను తిన్న స్వామి, ఎవరు ఏమి పెట్టినా,ఎంగిలి ,సంగిలి లేకుండా, అన్ని వర్గాలవారు, అలానే అన్ని వర్ణాలవారు ,ఏక పంక్తి భోజనాలు ,చేస్తేనే సమానత్వం కాపాడ బడుతుందని ,దండోరా పీకలేదు. అలా చెయ్యని వారంతా ,సంఘ ద్రోహులని ప్రకటించలేదు. అల సముద్రం కన్నా వేరుకాదు కనుక ,అలలకు పెద్దా చిన్నా బేధం లేదుకనుక,అంతా సమానం అని బోధ , చెయ్యక, ఎవరి వ్యవస్థ వారికి నేర్పిన కట్టుబాట్లు వారు, పాటించడం వలన ,రామరాజ్యం సుసంపన్నం అయింది.అంతేకాదు అరణ్యవాస సమయంలో,తండ్రి ఇవ్వక పోయినా,తాను సంపాదించ గలనని,వారిని నిందిస్తూ,వేరే సామ్రాజ్య స్థాపన చెయ్యలేదు. అందుకుగాను,జనకుడు, మీనాన్నకు చేతకాక పోయినా నీకు నేనున్నానని మర్యాద అతిక్రమించ లేదు. సీతాదేవి మీనాన్న చూసారా మనకు ఎంత అన్యాయం చేశారో అని భర్తకు నూరి పోయ్యలేదు. ఎవరి పరిధి వారు అతిక్రమించ లేదు.
    నావికుడైనా,ఈతగాడైనా అలలను పట్టించుకోకుండా గమ్యానికి చేరడానికి ప్రయత్నిస్తాడే కానీ,చిన్న , పెద్ద అని లెక్కలు పెడుతూ ఉండడు కదా.గుహుడి జీవన విధానమే పడవ నడపడంకానీ,ప్రయాణిస్తున్ననావలో ప్రయాణానికి, తన నావను ఎంచుకున్న పరభ్రహ్మాన్ని గుర్తు పట్టినందువలన తరించాడు.మానవుని ప్రయాణ సాధనం శరీరం ,ప్రయాణిస్తున్న పరబ్రహ్మాన్ని గుర్తు పట్టడమే గమ్యం. దీనికి అతని జన్మ,కర్మలతో సంబంధం లేదు . వీటికోసం వాదులాట కన్నా ,లక్ష్యం పట్ల ప్రీతితొ కూడిన అవగాహన ముఖ్యం.
     హనుమంతుడు, రామబ్రహ్మాన్ని చేరే దిశా నిర్దేశంలో,భక్తి రూపమైన సీతమ్మను రామునికి చేర్చడానికి పడిన తాపత్రయం మనకు తెలిసిందే. మనొరూపమైన వాయుపుత్రుడు ,చలించడమే ప్రధానంగా కలవాడు ,దాన్నే సాధనగా మార్చినవైనం ,మనకున్న ఏ జన్మ లక్షణ మైనా,సాధనకు వాడుకోడానికి ప్రేరేపిస్తుంది. అందువల్లనే దశావతారాలు క్రోధ,లోభ స్వరూపమైన విధానాలు కూడా పరమాత్మను చేర్చిన విధానం, అనుసరణీయం కాకున్నా ఆలోచనకు తావిస్తాయి.కానీ సత్వ ప్రధానమైన భక్తి ,జ్ఞాన,వైరాగ్యాల సమ్మేళనం,వలన కలిగే జీవన్ముక్తికి పరమేశ్వ  రానుగ్రహం తోడవుతుంది. పై విధానంలోని ,క్రోధాన్ని ఆయుధంగా వాడితే ,ప్రతిగా స్వామికూడా ఆగ్రహాన్నే చూపినపుడు మనకు కనీసం అర్ధం కూడా కాదు.ప్రతి దానికి శాస్త్రం అడ్డదారి వద్దని,సరళ మైన దారిలోపయనాన్ని, ప్రోత్సహిస్తుంది.పరమ ప్రశాంతమైన జీవన్ముక్త స్థితికి,నిర్మలమైన సత్వమే కదా కారణం. ఆగ్రహాన్ని కూడా అను గ్రహంగా చూసే నేర్పు ,జీవన్ముక్త స్థితి మాత్రమే ఇవ్వగలదు.
         ఏదైనా మన పరిస్థితిని బట్టి ప్రయాణం సాగాలేకాని,మనకు అనుగుణంగా లేని విధానాలను ,ఎవరినో చూసి గ్రహించడం అంత అనువైనది కాదు. వాతావరణానికి అనువుగా వస్త్రాలంకరణ ఉండడం సహజం. అంతేకాదు ఉండే పరిసరాలు,జీవన విధానము,వయసు ఇలా ఎన్నో పరిమితులు మనను శాసిస్తాయి.వేటినీ మనము బంధనాలుగా భావించము. చాలా సహజంగా ప్రవర్తిస్తాము. కానీ తమకు ఏది ధర్మ బద్ధంగా విధించబడిందో దానినివదలి వేరే విధానాలను అనుసరించడం,ఆధ్యాత్మికతకు అంతగా సహకరించదని తెలిసినా,కొందరు 'అన్నప్రాసన రోజే ఆవకాయ'అన్న చందంగా సాధన అనే అంశాన్ని ప్రక్కన పెట్టి సర్వే సర్వత్ర వినిపించే 'అంతా బ్రహ్మ మయం 'అని తమను తాము మభ్య పెట్టుకుని సాధనకు న్యాయం చెయ్యలేక పోతున్నారు. దీనివలన ఎంతో విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో ప్రవేశించిన వ్యక్తి ,అదే చదువుతో ఎంతో ఉన్నత స్థాయిలోఉన్న పై అధికారికి అంత జీతమెందుకు అని ప్రశ్నిస్తే , సమాధానం,సాధన,దానికి పట్టిన సమయాన్ని గుర్తు పట్టలేదని,వెంటనే గుర్తిస్తాము. దీన్ని గుర్తించడం సులువే. కానీ జీవత్వం నుండి పరతత్వాన్ని చేరే సాధన పూర్తి అయిందని, తనను తాను ,మభ్యపెట్టుకోకుండా పయనించడానికి త్రిపుటిని గమనించడం అనే సాధన ఉపకరిస్తుంది. ఇది బాహ్య పటాటోపం లేని అంతర సాధన. ఏ పనీ ప్రతి బంధకం కాదు. ఈ సాధన గమ్యాన్ని సుస్పష్టంగా,సాక్షి తత్వాన్ని ధృఢ పరచి సహకరిస్తుంది. కొందరికి కొన్ని సాధనా విధానాలు ప్రశస్తం కావచ్చు,కానీ అందరికీ  అన్వయం కాకపోవచ్చు. అవగాహనకు తగిన భగవద్విషయాలను,ఆచారవ్యవహారాలను మాత్రమే  అందించాలి.
       మతమార్పిడులు ఎంత అసహజంగా వ్యాపిస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో ప్రలోభాలకు గురి చేసి , చేసే మతమార్పిడి తల్లి దండ్రులకు తెలియకుండా వారిని విమర్శించి,పిల్లలను దారి మళ్ళించడం లాంటిదే. సృష్టిలో అన్నిటికీ పరిమితులున్నాయి. వాటిని గౌరవించడం మన కర్తవ్యం. అలాగే ఏ అంతస్థుకు,ఎవరి అవగాహనకు వారిని ప్రేరేపించాలి తప్ప,మన విధానాలే ఎంతో గొప్పవని ,మిగిలినవన్నీ పనికిమాలినవని ,వాటిని పాటించడం వ్యర్ధమని వారిని కించపరచడం , మన అవగాహనా లోపాన్నే తెలియ జేస్తుంది. భగవంతుని చేర్చే ఎన్నో సోపానాలున్నాయి.ఏదీ  ఎక్కువ,మరొకటి తక్కువ అయ్యే అవకాశమే లేదు.మధ్యలో ఆలయం ఉంది అనుకుందాం. నాలుగు వైపులా మెట్లు ఉన్నాయి. తూర్పు వైపుగా వచ్చే వారికి,పడమరలో వచ్చేవారు కనపడరు. అంతమాత్రాన వారి దారి తప్పని చెప్పే అధికారం మనకు లేదు. అందరూ పరమాత్మను దర్శించ గలరనేది నిర్వివాదాంశం. దీన్ని అవగాహన చేసుకున్న ఏ కులమైనా,ఏ మతమైనా మిగిలినవారిని కించ పరిచే విధానాన్ని అవలంబించదు.
        నిజానికి వేరేవారెవరైనా మన మతాన్నిఅవలింబించాలానే ప్రకృతికి ఆధారం అహం మాత్రమే.దీనిని నిర్జించడమే మత ప్రయోజనం. మౌలిక ప్రాతిపదిక లేనిదే ,మత మార్పిడిగానీ,లేదా యుద్ధంతో మతస్థాపన గానీ ,ఆలోచనా రాహిత్యాన్ని సూచిస్తుంది. ఇది కీచక విధానమే గాని,దీనికి ధర్మం ప్రాతిపదిక అనడానికి ఆధారం లేదు. ఎవరు ఏ విధానంలో సాగినా పరమాత్మను చేరతారనే,ప్రాధమిక సూత్రాన్ని విస్మరిస్తే,ఆయా మతాలు,పరస్పరాధారమైన మానవత్వానికి ఏ విలువ నిచ్చాయో ప్రశ్నార్ధకమే. మన బిడ్డను చాక్లెట్ చూపించి ఎవరైనా రోజూ పిలిచి, చివరకు వారిని తమ కనుకూలంగా మార్చుకుంటే,దానిని మనము,ఏ రకంగా సమర్ధిస్తాము?హిందూ సమాజంలో నిమ్న వర్గాలున్నట్లే,అన్నిమతాలలోను అణచివేయబడ్డారని సూచించే,అదే మతస్తులకు సంబంధించిన వారికి కొరతేమి లేదు. వారి ఉద్ధరణకు ఎంతో కృషి అవసరం. దాన్ని వదలి మత మార్పిడులకు ప్రయత్నించడం,హాస్యాస్పదం.      వర్గ విబేధాలను హిందూ ధర్మానికి లోపంగా చూపించే మతాలలో,విబేధాలే లేవా ?వాటిని వారుకూడా అధిగమించ లేదనేది ,నిర్వివాదాంశం. పేరు బేధమేగాని, వివాదాలు అన్ని మతాలలోను సమానమే. సమానత్వం ఇక్కడ మాత్రం ఎవరూ అధిగమించలేరు. మత మార్పిడికి ,అమాయకత్వం, లేమి,కారణమేగాని వేరే ఆధారమేమి లేదు. వీటిని వాడుకుని చేసే మత ప్రచారం,వారి విధానాలను చెప్పకనే చెబుతుంది.
         హిందూ విధానంలో గుణ,కర్మ విభాగం మాత్రమే వర్ణ వ్యవస్థకు ప్రాతిపదిక. మాథ్స్ బాగా చేసేవారు ,దానికి సంబంధించిన ఉద్యోగాలను ఆశ్రయించి జీవనం నడిపినట్లే,ఎవరి అర్హత ననుసరించి,వారి జీవన విధానం ఉంటుంది. కానీ ఒకే రకమైన విద్య అభ్యసించినంత మాత్రాన వారి జీవితాలు, ఒకేలా ఉన్నాయనుకోవడం, ఏరకంగానూ సరి అయినది కాదు, వివిధమైన చదువులు ,వేరే వేరే గమ్యాలను నిర్దేశిస్తాయి. అన్ని గమ్యాలలోను హెచ్చు,తగ్గులు సామాన్యం.ఇంతే సహజమైనది హిందూవర్ణ వ్యవస్థ.దీనికి వైషమ్యాలను,ఇతర మతాలు జోడించాయే తప్ప,నిజాలు స్వల్పం. ఆర్ధిక పరమైన అంశాలు మానవులను విభాగించినంత మాత్రాన,మానవత్వానికే మాత్రమూ భంగం కలగ నట్లుగానే,ఆచార వ్యవహారాలు కొద్ది మార్పులతో ఉన్నా, గమ్యం హిందూ ధర్మంలో మోక్షం మాత్రమే. ఆహార,ఆచార విధానాలు వేరైనా,అవి సాధనా పరమైనవే. గమ్యం మాత్రం బ్రహ్మమొక్కటే. కృషిలో బేధాలకు,బాధ్యత గమ్యానిది కాదు. కలలలో బేధానికి నిద్ర కారణం. మెలకువలో అందరికి గాడిద ,గాడిదే. గుర్రం,గుర్రమే. నిద్రలోని కలల బేధానికి అజ్ఞానం కారణం.అలానే సాధనా పరమైన అంశాలను,గమ్యమైన ఏకత్వానికి,వైషమ్యాలను జోడించడం,విజ్ఞతకాదు.
          జంతూనాం నర జన్మ దుర్లభం ,అనేది శాస్త్ర వాక్యం. కానీ వాటినుండి వేరుపరిచే మొదటి విషయం బుద్ధి. ధర్మ ప్రతిపాదన అనేదానికి ఇదొక్కటే సాధనం. మిగిలిన పాంచ భౌతిక విషయాలు జంతువులతో సమానత్వాన్ని ప్రతిపాదిస్తాయి. మానవునిగా నిరూపణకు బుద్ధి అవసరం. కుల మతా తీతంగా,నాస్తికులు కాకుండా మిగిలిన వారందరికీ,గమ్యం మోక్షం. ప్రతి మనిషి పుట్టినప్పటినుంచి పడే తాపత్రయం,ఆనందం కోసమే. అది శారీరిక సుఖం కానీ ,మానసిక సంతోషం కానీ,కొంతకాలానికి పరిమితమైన సమాధి కానీ అయితే ,కాల పరిధిని అతిక్రమించ లేవు. జీవితం పట్ల సరిఅయిన అవగాహన ఆనందానికి హేతువు అవుతుంది. ఇది అపరిమిత తత్వాన్ని పరిచయం చేస్తుంది.దీనికి మన మనసును వేధిస్తున్నఏదైనా ప్రశ్నకు,అనుకోకుండా సమాధానం అయాచితంగా లభిస్తే ,మనం ఎలాంటి భావాన్ని పొందుతామో,ఒకసారి ఆలోచిస్తే అర్ధం అవుతుంది.దీనికి భౌతిక ప్రయోజనమేమీ లేదు,అలానే పెద్దగా చెప్పుకోదగ్గ మార్పేం లేదు. కానీ విచిత్రమైన తృప్తి అనేది సహజంగా కలుగుతుంది. భోజనం కాదు,నిద్రకాదు  కానీ తృప్తి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. చాలా స్వల్పంగా కనిపించినా ఆనందానికి ,ఆధారం అవసరం లేదని మాత్రం తప్పక తెలియ జేస్తుంది. ఒక గులాబీ మొక్క కొమ్మను తెచ్చివేసాం అనుకుందాం. సరి అయిన పోషణ లేక నెమ్మదిగా ఒక మొగ్గ వెయ్యడం లాంటిదే,ఈ పరిచయం. మనం పెద్దగా ఏ విషయాలపైనా శ్రద్ధ పెట్టక పోయినా,ఒక ప్రశ్న,దాని సమాధానం మనకు తృప్తి నిచ్చాయి. అదే జ్ఞానంలోని ,సుకుమారంగా, సున్నితంగా,అంతే సునిశితంగా కలిగే ఆనందం. జాగ్రత్తగా జిజ్ఞాసను పోషిస్తే అది మనలోని బుద్ధి అనేదాని ప్రయోజనాన్ని మనకు అందిస్తుంది.      
            అందువల్లనే పరబ్రహ్మ స్వరూపాన్ని అవగాహన చేసుకోవడానికి,జిజ్ఞాస మొదటి లక్షణంగా,జగద్గురువులు ఆది శంకరులు ,బ్రహ్మసూత్రాలలో తెలియజేస్తారు.జిజ్ఞాస అంటే అర్ధం పర్ధం లేని ప్రశ్నకాదు. బాహ్యాడంబరం లేని అంతర్మధనం, అదే సాధనగా కూడా అపరిమిత ఆనందాన్నిస్తుంది. అంతరంగంలో ఏ బాహ్యాంతర వస్తు సహకారం లేక నిద్రించకుండా, తనని తాను  గుర్తిస్తే కలిగే స్పందన. ఇది జడం కాదు. జడాన్ని గుర్తించే చైతన్యం. నిజానికి బాల్యంలో, ఊహ తెలిసాక, తరువాత 15సం /వయసులో,మళ్లీ 25సం/కు,ఇలా కొంత,కొంత వ్యవధిలో  స్వస్వరూప స్థితిని గుర్తు చేసుకుంటే,శారీరిక మార్పులు,మానసిక మార్పులు కాకుండా  స్వానుభవంలో ఏ మార్పు జరగ లేదని స్పష్టం అవుతుంది. దీని పరిచయంతో, అనుభూతమైన స్వరూపం గురించి స్పష్టమైన అవగాహనకు జరిగే అంతర్మధనం,గురువు కోసం తపిస్తే కలిగే తపన తపస్సు. దీనినుండి కలిగే ఆర్తి జిజ్ఞాస. ఇది అగ్ని సమానం. పురాకృత కర్మ ప్రభావాన్ని ప్రక్కకు తోసి సాధనకు సహకరిస్తుంది. ఇది ఎవరెవరి తపనకు ఎంత బల ముందో,దానిఫలంగా పరిపక్వతకు సమయం నిర్ధారించ బడుతుంది.
         ఇది అత్యంత బుద్ధి సూక్ష్మతకు పరాకాష్ట. బాల్యం నుండి బుద్ధిని పదును పెట్టినపుడు బాహ్యావసరాలైన అతి సాధారణమైన,ఆహార,గృహ,గృహస్థ అవసరాలకు పరిమితం కాని,జన్మకు మూలమైన అజ్ఞాన నివారణకు అవసరమైన విజ్ఞానం వైపు దృష్టిని సారించే ప్రయత్నం బుద్ధి సాగిస్తుంది. కానీ పరిచయం చెయ్యడం మానవ కర్తవ్యం. సాధారణంగా మానవయత్న లోపం దీనిని పరిచయం చెయ్యక పోవడం వలన,శరీరం తాను భూమిపైకి వచ్చిన అత్యంత ఆవశ్యకమైన పరిపూర్ణతా స్వరూపమైన ముక్తి అనేదాన్ని పొందకుండా,go to pevillion.
         భౌతికమైన ఎన్ని విజయాలైనా,స్టేజి డ్రామాలో షో వరకూ పరిమితమైన వాటితో మాత్రమే సమానం.దీని కోసం  మానవ జీవితం,కోల్పోతున్నగమ్య రూపమైన మోక్షాన్ని,గుర్తు పట్టక పోవడమే,ఆధ్యాత్మిక పరంగా,ప్రమాదంగా మన శాస్త్రాలు,తెలియజేస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని అధిగమించి ప్రస్థానం సాగించాలంటే,దానికి బాల్యం నుండి పరిచయం అవసరం. బాల్యానికి డేటింగ్ ఆవశ్యకత లేదు. అన్ని జంతువులు చదవకుండానే ఈ విషయాల్లో నిష్ణాతులు.వీటికోసం సినిమాలు,కంపూటర్లు,వీడియోలు అవసరం లేదు. ప్రకృతికి ఏ సమయానికి ఏమి అందించి వంచించాలో బాగా తెలుసు. దీనికి కృషి ఆవశ్యకత లేదు. ప్రకృతిని అధిగమించి గమ్యాన్ని చేరడానికి,బుద్ధి బలం అవసరం,దీనిపరిచయం ఖచ్చితంగా బాల్యంలోనే జరిగి తీరాలి.అందువల్లనే ఉపనయనం వయసు ఏడవ సం/రమే. అపుడు చేసేది స్త్రీ,పురుష సంయోగం గురించిన ఉపదేశం కాదు. బ్రహ్మమే తానని తెలియడానికి,ప్రాతిపదికగా , గురు స్వరూపంగా ,తండ్రి చేసే ఉపదేశం. దీనికి ప్రత్యక్ష నారాయణుడైన సూర్య నారాయణుని,కిరణాల రూపంలో మనను సమీపిస్తున్న గాయత్రీ మాతగా సంభావించి,బుద్ధి ప్రచోదనాన్నే వరంగా,రోజూ ముమ్మార్లు ప్రార్ధించడాన్ని,  సంధ్యావందనంగా మనకు తెలుసు.ఇందులో మోక్షాన్నిఇమ్మని అడగడం లేదు.తనను తాను తెలుసుకునేరీతిలో బుద్ధి సహకరించేలా,చెయ్యమనే ప్రార్ధన ఉంది. నిజానికి ముక్తి తనకున్న అజ్ఞానాన్ని లేదని తెలుసుకోవడమే తప్ప వేరే కొత్తగా సంపాదించే,సంపాదన కాదు. అజ్ఞానాన్ని విడిచి పెట్టడమే లక్ష్యం కనుక,త్యాగమే జీవనము అని తెలియజేస్తుంది శాస్త్రం. అది వదిలించుకునే వ్యవహారంలో భాగమే సంన్యాసం. కానీ అది సూచించిన అజ్ఞాన నిరాకరణమే దీని గమ్యం. దిని ప్రాతిపదిక బాల్యంలోనే ప్రారంభం.
      తల్లి ఒడి నుండి బడికి,తల్లిని వదిలితేనే సాధ్యం. ఇక్కడ ప్రారంభం అయిన ప్రయాణం పరమాత్మను చేర్చే దిశగా కదిలే బృహత్తర ప్రణాళిక మన వేద విద్యకు మాత్రమే స్వంతం.ఇది కొంతమంది ద్వారా సమాజానికి మేలుకుర్చే విధంగా అందించడమే ఈ యుగంలో ఎన్నో బేధ భావాలకు తావిచ్చింది. కానీ ఎప్పుడూ తండ్రి పిల్లల మేలు కోరినట్లే శాస్త్రం సమాజ శ్రేయస్సుకు కొన్ని నియమాలు ప్రకటించింది. ఎంతో ధర్మ బద్ధంగా కష్టపడి ఒకవ్యక్తి ఎంతో అభివృద్ధిలోకి వచ్చి,ఆనందానికి నోచుకోక తనువు చాలించాడనుకుందాము. న్యాయమేనా?మనకే అన్యాయమనిపిస్తే,సృష్టిలో పరమాత్మ తప్పకుండా న్యాయం చేస్తాడు.మళ్లీ వారసుడిగా వచ్చి తన హక్కును తాను వాడుకుంటాడు. అందువల్లనే పునర్జన్మ అనేది భగవంతుడిచ్చిన, మొదటి న్యాయ వ్యవస్థ. న్యాయ మంటేనే,తప్పు, ఒప్పుల మధ్యన జరిగే పోరాటంలో ఒప్పు గెలవడమే. ఇటువంటి ఎన్నో విశ్లేషణలతో కూడిన పునర్జన్మ సిద్దాంతంలో,భగవంతునే గమ్యంగా సాధన సాగిన జీవులకు కూడా న్యాయం చేస్తే,వారికి దొరికినది బ్రాహ్మణ జన్మ. వీరి కోరిక మేరకు భగవంతుడు,తనసేవకు గాను వేద విజ్ఞాన సముపార్జన జీవికగా ఏర్పాటు చేశాడు. పురాకృత పుణ్య,పాప ఫలంగా,ఎన్నో బేధాలతో ఉన్న సృష్టిలో చెట్లు ,జంతువులు ,మానవులు ఇలా ఉన్నా, మళ్లీ అన్నింటిలోను విభిన్నత్వం ఉంది. వీటిని ఎవరూ తప్పు పట్టరు. మామిడిపండ్లలోనే ఎన్నో రకాలు. మళ్లీ పక్వాన్ని బట్టి రుచిలో బేధాలు. ఇవన్నీ అందరూ ఒప్పుకుంటారు. కంటికి కనిపించని ఎన్నో బేధాలుగల మానవులను వర్ణ , వర్గాలుగా విభజించినపుడు,దీన్ని అత్యంత సహజమే అని ఈ సమాజం ఒప్పుకోకపోడమే పెద్ద ఆశ్చర్యం.        ఉపనయనం  కులాచార ప్రాతిపదిక మాత్రమే.
             ఎందరో B SC డిగ్రీ చేశారనుకుందాం,అందరూ బి ఇ డి చెయ్యరు,అంత మాత్రాన,డిగ్రీకి ఏ విలువా లేదా ? ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే ట్రైనింగ్ అవసరం.దీనివల్ల వారి గౌరవం పెరిగి పోలేదు. మిగిలిన వారికి తగ్గి పోలేదు. ఎవరి కులవృత్తి వారిది.అటువంటి విధానమే ఉపనయనం.ఒక కుమ్మరి,ఒక కమ్మరి,ఒక రైతు,ఒక మంగలి అందరూ సమానంగా,మాములుగా చదువుకునే డిగ్రీ అందరికీ సమానమే. కానీ విడిగా, వారు,వారి వారి కుల వృత్తిని అభ్యసించ కూడదనే శాసనం ఏమీ లేదు. అలాంటి ఒక ఆచార వ్యవహారమే ఉపనయనం. ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలను అన్వయించుకోడానికి,చదవాలి,తెలుసుకోవాలనే తాపత్రయం అవసరం కానీ వేరే ఏ అవసరమూలేదు. పరమాత్మను చేరాలనే తపన తపస్సుగామారుతుంది.అంటే అడవులు పట్టి పోవడం ఎంతమాత్రమూ కాదు.తన బాహ్యావసర జీవనానికి అవసరమైన విద్యతో బాటు,బుద్ధిని సూక్ష్మతరం చేసే ఆధ్యాత్మిక విద్య చాలా అవసరం. ఇది  భౌతికంగా చర్చకు అందనిది.
     దీనికి మన శాస్త్రాలను,ఎలిమెంటరి విద్యనుండి పరిచయం చెయ్యడం ఎంతోఅవసరం.సమయం పరమాత్మ స్వరూపం. నిరాకారమైనా జీవితాన్ని శాసించి,లక్ష్యపెట్టకపొతే,చివరకు నిరర్ధకమైన జీవితాన్ని కళ్ళముందు ప్రకటించి తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తుంది.సమయాన్ని గుర్తు పట్టడమే నిజానికి అన్నిటికన్నా గొప్ప సాధన. ఇది అవకాశం అనేదాన్ని అందించ గలుగుతుంది. అనవసర విషయాల వైపు మనసు పోకుండా,అవసరమైనంత వరకు సమయాన్నివినియోగించగల నేర్పు పిల్లలకు నర్సరీ నుంచి తెలిసేలా చేసి వారి భవిష్యత్తుకు,నిర్దిష్టమైన విధానాన్ని తప్పక పరిచయం చేయాలి.నిజానికి చాలామంది సమయం సరిపోవడం లేదుఅని, అంటూ ఉంటారు. కానీ భౌతిక పరమైన అంశాలకు ఎంత మేరకు తప్పనిసరి అవసరమో,అంతవరకు ఆలోచిస్తే,చాలా భాగం,మనసు అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన,ఎంతో సమయం వృధా అవుతుంది.       నిజానికి ఇపుడు కలియుగమైనా మన సాధన మాత్రం కలి నుండి ద్వాపరానికి,ద్వాపరంనుండి త్రేతాయుగానికి, త్రేతాయుగం నుండిసత్యయుగానికి ప్రయాణం సాగిస్తున్నామని భావించవచ్చు. ప్రశ్న పుట్టకుండా మన సమయా న్నంతా మింగేసేదే కలియుగం. ఐతే,మనసులో,ఆలోచన లేదాప్రశ్నకు 100శాతం అధర్మం వైపు మనసు ప్రయాణం చేస్తున్నా ,5శాతం మనసును   ధర్మం అడ్డుకున్నామనప్రయాణం ప్రారంభం అయినట్లే. 100మంది అధర్మ పరులైన కౌరవులు,5గురుధర్మపరులైన పాండవులు గానుపరిచయం చేసింది భారతం . దైవం పై అచంచలమైన విశ్వాసంతో, పట్టుదలతోమనలొఉన్న దుష్టస్వభావం,పై విజయం సాధించిన కొద్దీ భగవద్గీత మనకు అనుసంధానం అవుతుంది. తన ప్రవృత్తితో అంతరంగాన్నిశ్రీ రామరాజ్యంగా మార్చిన సమయం త్రేతాయుగమే.సత్యం తన స్వరూపంగా భాసించే వారికి సత్యమే,పునరావృత్తి రహిత సాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది.
         వస్తువు యొక్క పరిపూర్ణ జ్ఞానం వల్లనే వైరాగ్యం సంభవం. పరబ్రహ్మం పొందవలసినదనే ధృఢ నమ్మకంతో సాధన ప్రారంభం అవాలంటే తత్వజ్ఞానానికి సంపూర్ణమైన మద్దతును మనసుకు అందించాలి. అన్నివిధాలుగా ఎన్ని ప్రశ్నలు మనసు వేసినా,అన్ని ప్రశ్నలకు శాస్త్ర అవగాహన పెంచుకుని,చిన్న పిల్లలకు,తల్లిదండ్రులు ఎలా సమాధాన పరుస్తారో అలా ఓపిగ్గా negative వైపు ఆలోచన పోకుండా శాస్త్ర జ్ఞానాన్ని ఆలంబనగా ప్రయత్నం సాగించాలి.
         అదే సమయంలోఎంతో బలమైన పూర్వ జన్మ సంస్కారాలు,శరీర పరమైన అవసరాలు,సుఖ,దుఃఖాలు,కామ క్రోధ,లోభ,మద,మాత్సర్యాలు,వీటిలోని ఏదో ఒక అంశాన్ని ముందుకు తెచ్చిమనసు ,భగవత్స్వరూపమైన కాలాన్ని మన నుంచి దూరం చేస్తుంది.నిజానికి దేశ కాలతీతమైన స్వరూపం,స్వంతమైనా,చకోర పక్షి,స్వాతి చినుకు కోసం తపించి నట్లు,సాధనకు అవసరం లేని negative attitudeవల్లనే ఏర్పడిందంటే అతిశయోక్తి లేదు. 
    తనకు తాను బలవంతంగా నిగ్రహించిన మితిలేని భౌతిక వస్తు,సుఖాపేక్ష,కారణంగా,నిద్రాణంగాపేరుకు పోయిన అజ్ఞానమేజన్మకారణం.దీనికి జవాబుగా,సకల జగత్తూ పాంచ భౌతికమనే అవగాహన,మనకు మోక్షద్వారం.తన స్వ స్వరూపం భౌతిక జగత్తుకు సాక్షి.శరీరాన్నితానుగా భ్రమించి,భౌతిక వస్తువులే గమ్యంగా సాగిన జీవితం,మనను అహంభ్రహ్మాస్మి అననివ్వకుండా అడ్డుకుంటోంది.
           ఎప్పుడూ ఉన్న చైతన్య స్వరూపంగా ,మనం ముందు యుగాల్లో బహుశా ఏమి చూసి ఉంటా మంటే,సత్య యుగంలో హరిశ్చంద్రుడు సత్యం కోసం నిలబడి నప్పుడు,బాధ మాత్రం తప్పకపడి ఉంటాడు.కానీ శారీరిక, మానసిక బాధ మాత్రమే అని తలచి తన స్వ స్వరూపంలో ఒదిగి,వడ దెబ్బ తాపం నుండి,తనకు తాను,తన ఇంట్లో సేద తీరినట్లు, తప్పించు కున్నట్లు,బహుశా మనం చూసి ఉండవచ్చు.    
          బహుశా త్రేతా యుగంలో రాముడు ఎంత కష్టపడినా లెక్కచేయకసీతను దూరంచేసిన చాకలి రూపంలో అప్పుడు,ఎవరు సత్య,ధర్మాలను వారికి వీలైన పరిధిలో, ఇప్పుడు అనుష్టించినా,విసుగూ,విరామం లేకుండా వారిని విమర్శించేవారు,ఇప్పటికీ వారి స్వగుణాలను చాటుకుంటూ ఉండడంమనం చూస్తూనే ఉంటాము.తరిమి తరిమి అవస్థల పాలైన సాధకులను విసిగించే విధానం హరిశ్చంద్రుని కాలంనుండి వస్తూనే ఉంది. [1]ఇది సత్య యుగం నుండి ఇప్పటి వరకూ కొనసాగుతున్న అరాచకం.
            త్రేతా యుగం నుండి బహుశా,పర స్త్రీ కాంక్ష,కలి యుగం,సంపాదించుకుని ఉండవచ్చు.[2] ద్వాపరం నుండి  అన్నదమ్ముల,దాయాది పోరు సంక్రమించి ఉండవచ్చు. [3]ఇలా ఈ మూడు పువ్వులు,ఆరు కాయలై,అన్ని యుగాల్లోని వ్యతిరేక ఆలోచనా విధానాలు కలి యుగానికి కలికితురాయిగా భాసిస్తున్నాయి.మళ్లీ మనం తిరుగు ప్రయాణం చెయ్యాలంటే ఇప్పటి విధానాలకు వ్యతిరేక దిశా ప్రయాణం చేసే నావ ఎక్కక తప్పదు.
             వైవిధ్యం సృష్టి. ఏకత్వం దృష్టి. సృష్టిలోని మనీషులకు అంతరంగ మధనంలో సాధించుకున్నది,శివుని మూడోకన్ను,జ్ఞానమే నేత్రము. చర్మ చక్షువు కాదు.ఎప్పుడూ విడదీయలేని అంతర్ముఖత్వం. యిదే శివత్వం. శివుడు వేరుగా తత్వం వేరైన శివ తత్వం కాదు. తత్వమే తానైన శివత్వం. ఇది అనుభవం మాత్రమే. ఏకత్వం.
          ప్రవర్తన కాదు. ప్రవర్తించాలంటే సృష్టిలో మాత్రమే సాధ్యం. సృష్టి వివిధం. ఏకత్వ ప్రతిపాదన అసాధ్యం. అందు వల్లనే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం.మౌనమో అంతర్ముఖత్వం.అందువల్లనే, చెప్పి,చెప్పి అలసిపో యిన శ్రుతి మూగ బోయింది,పరమాత్మ విషయంలో.
       మౌనంగాశ్రుతి,శివత్వమే తానై,శివంగాఅరాధించ బడుతోంది,సృష్టి చేత.శివం ప్రవహిస్తే,శ్రుతి. శబ్ద గంగ.ప్రశ్నించే వారికోసం ఘనీభవించి గురువుగా ప్రకటించబడుతోంది.శిలా సదృశంగా అర్చా మూర్తిగా పూజింప బడుతున్నది. రూప రహితంగా లింగరూపంగా,నిరాకర తత్వాన్ని,అనేక స్వరూపాలతో సాకార సృష్టి రూపంగా,అన్ని రూపాలలోని ఏకత్వాన్ని ప్రస్ఫుటంగా తెలియ జెయ్యడానికి అనేక ఆలయాల్లో అనేక శిలా దేవతా మూర్తులుగా కేవల శివత్వమే ప్రకాశిస్తున్నది. ప్రపంచరూపంగా అరాధించ గలిగేవారికి 'విశ్వం'విశ్వరూప దర్శనమే.
             సృష్టి  వివిధం.దాన్ని అలానే ఒప్పుకోవాలి. తప్పదు. సృష్టికి మూల రూపం ఏకత్వమైనా,పాంచ భౌతికంగా మాత్రం వివిధత్వం మాత్రమే సృష్టికి ఆధారం. పోలిక ఉండవచ్చు,కానీ ఏ రెండూ ఒక్కటే అనిమాత్రం చెప్పలేము. కాపీ అనేది యాంత్రికం. వివిధత్వం మాత్రం సజీవం. కనీసం కవల పిల్లలుకూడా ఒకేలా ఉండరు. ప్రతి అణువు తన వైభవాన్ని చాటుతుంది. తనను తాను సంస్కరించు కోవాలనుకునేవారి ప్రధమ లక్షణం తను తక్కువ. అప్పుడు మాత్రమే సాధన అనే పదానికి అర్ధం ఉంది. అన్ని విషయాలలో పూర్ణత్వం అసాధ్యం. ఏవిషయంలో తన తెలియక పోవడం ఉందో దాని జ్ఞానాన్ని పొందడానికి సవినయం అవసరం. అంతమాత్రాన అతని మిగిలిన విషయాల్లో జ్ఞాన వైభవం కుంచించ బడదు. వినయం వలన అన్నీ మరింతగా ప్రకాశిస్తాయి.
            తెల్లని వస్త్రం బ్రహ్మాన్ని సూచిస్తుంది,కానీ ఉపయోగానికి రావాలంటే,దానికి అంచు ఉండి తీరాలన్నది,శాస్త్రం. అంతేకాదు దేవాలయాల్లో ప్రవేశానికి,పంచె,ఉత్తరీయం ధరించి రావాలనే శాస్త్ర వాక్యంలో,ఎంతో అర్ధం ఉంది. ఎక్కడా చింపడం కానీ అతుకు వెయ్యడంకానీ లేకుండా ధరించే విధంగా ఈవస్త్రధారణ ఉంటుంది.పరబ్రహ్మం వస్త్రంగాభావిస్తే, అందులో తగ్గించ వలసినది[కత్తిరించడం]కానీ,అలాగే కలప వలసింది[కుట్టడం]కానీ,అవసరంలేకుండా ధరించడం సాంప్రదాయం.అంటే తత్వానికి కలప వలసినదీ లేదు,తీసి వేసేదీ లేదు.ఉన్నతత్వాన్నిఉన్నట్లుగా ధారణ చేస్తు న్నాను,అని సవినయంగా భక్తితో,భగవంతుని ముందు నమస్కరించడమే,ఈఆచారం వెనుక అంతరార్ధం.అంతేకాదు సృష్టిలోని భిన్నత్వాన్ని అంతే సవినయంగా ఒప్పుకుంటున్నట్లు తెలియ జేసేదే ఉత్తరీయం. శుద్ధ సత్వమైన బ్రహ్మ తత్వానికి ప్రతీకగా రెండు వస్త్రాలు తెల్లనివి మాత్రమే ఉంటాయి. అంచు లాగా రంగు వాడినట్లే,సృష్టిలో చరించడానికి తగినంత మాత్రంగానే,మిగిలిన సత్వ ,రజో ,తమో గుణాలను ఉపయోగిస్తాననే సూత్రం దాగి ఉంది.భారతీయ స్త్రీ ధరించే చీర కూడా ఏక వస్త్రమై ఎక్కడా అతుకు,కుట్టు లేకుండానే,అంచు కలిగి ఉంటుంది. అంచు అనేది సృష్టిలోని కట్టుబాట్లపట్ల గౌరవాన్ని సూచిస్తుంది. పరిధిని పరిచయం చేస్తుంది. పూర్వపు స్త్రీ పై వస్త్రాన్ని కట్టుకున్నట్లు  చిత్రీకరిస్తారు కానీ,చీరను బుజాల నిండుగా కప్పుకోవడాన్ని మాత్రం చిత్రీకరించడం మరవడం వలన మన సాంప్రదాయాన్ని ప్రకటించ లేక పోయింది. ఈ పై వస్త్రం కూడా ఆ రోజుల్లో అతుకు లేకుండా ఉండేది. వీటి వెనుక,పైన అనుకున్న అంతరార్ధం ఉంది.
        బ్రహ్మచారి ఒక వస్త్రాన్ని ధరించవచ్చు. గృహస్తు ఉత్తరీయాన్ని తప్పక ధరించాలి. అంటే శక్తి సహిత శివ రూపం. భార్యకిచ్చిన గౌరవం,తనుకట్టుకున్నవస్త్రం కన్నాపై స్థానంలో ఉంచి,అంటే ఉత్తరంగాఉత్తరీయంఉంచి స్త్రీని గౌరవించిన ఆచారం మనది.అందుకే పెళ్ళిలో ఉత్తర జంధ్యాన్ని మామగారు తమ కూతురుతోపాటు సమర్పిస్తారు.నిజానికి మగ వారికి జీవితం అంటే కుటుంబమే కానీ,అవసరాలన్నీ కుటుంబానివే. వారి కష్టమంతా కుటుంబానికే. స్వప్రయోజనం శూన్యం.కుటుంబ అవసరాలు తమ అవసరాలుగా భావించి,భరిస్తారు కనుక భర్త.కానీ కనీసం కని పెంచిన తల్లి,తండ్రి అన్న దమ్ములు ,అక్క చెల్లెళ్ళు,తాత,బామ్మ,వీరిగురించి మాట్లాడే స్వాతంత్ర్యం ఎంత మంది కలిగి ఉన్నారో మనకు తెలియందేం లేదు.కోడళ్ళపట్ల అత్త మామల ఆరళ్ళువినిపిస్తున్నాయి కానీ,నిజానికి మగవారి పట్ల  90%వినిపించని నిజాలెక్కువ.కంటి నీరు కార్చే యోగం కూడా లేదు.ఎంతసేపు ఆడవారిపై చేయి చేసుకున్న చరిత్రలో మగవారి దురహంకరమే  గాని ఎంత చెప్పినా వినని అర్ధాంగి మొండితనం బయటకు రాదు.మగవారిని రెచ్చగొట్టే చూపు తమ ఆడపిల్లలకు  ఉందని గుర్తించే తల్లిదండ్రు లెందరు? సమాజంలోజరుగుతున్నఅరాచకాలలో సూర్పనఖలకు కొదవ లేదు.  సమాజంలో  మగ వారినే అన్నిటికీ బాధ్యులుగా వ్యవహరిచడం,అవగాహనా లోపమే.ఎవరైనా మగవారు దొంగతనం చేస్తే,అందరు మగవాళ్ళు దొంగలే అన్నట్టు వ్యవహరిస్తోంది సమాజం.
            బ్రహ్మమొక్కటే అనే అంతరంగ అనుభవాన్ని,శ్రుతి మౌనంగా తెలియజేసినా,అలాగే మౌన వ్యాఖ్యతో దక్షిణా మూర్తి తెలియజేసినా అంతరంగంలోనే,తందనాన అని స్వానుభావాన్నిఆస్వాదించ వచ్చు.కానీ అందరికి బాహ్యంలో అందిస్తే అది సాధనకు వేసిన తెల్లని ముసుగు మాత్రమే.దీనివల్ల సంపూర్ణంగా వర్ణవ్యవస్థ తనవైభావాన్ని కోల్పోయింది.వేలితో మనకన్నుమనమే పొడుచుకున్నట్లయింది.
    సృష్టిలోఎక్కడైనా ఎక్కువతక్కువలే ఉన్నాయి. సమానత్వంఎండమావి.అంతరంగంలో ఆస్వాదించ వలసిన మౌనానికి మాటలిస్తే,అర్హత లేనివారు దుర్వినియోగం చేస్తారనే శ్రుతి,తత్వాన్ని రహస్యం అని సూచించింది. గురు కృపతో,సాగిన సాధనలో కలిగే తృప్తి,పాట విని పాడినంత సులువు కాదు,సాధన చెయ్యడం.అభినయించిన వారందరికీ అనుభవం అందితే అందరూఅభినయిస్తే సరిపోతుంది. కానీనటనలో త్రిపుటి ఉంది.అసలు సాధన త్రిపుటిని జయిం చడానికే.అది గెలిస్తే కలిగేది మౌనం.బాహ్యంలోఅసాధ్యం అంతరంగంలోమన శరీరానికున్న బాంధవ్యాలను నటనగా ప్రతిపాదించి సాధనలో పరిపక్వతకు సోపానంగా మలచు  కున్నవారు,ప్రయోజనాన్ని పొంద వచ్చు. ఏది ఏమైనా సృష్టికి ఏకత్వ ప్రతిపాదన అర్ధ రహితం.
          ఒక మనిషికి,ఒక మనిషికి పోలిక లేదు. యూనిఫాం వెయ్యవచ్చు కానీ ఎవరి జీవితం వారిదే. వేరేలా ఎవరిలానైనా ఉండాలనుకుంటే కాపీ అవుతుందే కానీ సహజత్వం ఉండదు.తను ఎదగాలి అనే తపన తనను విశిష్టంగా  చూపుతుంది. అందువల్లనే మనకు శాస్త్రం వినయ సంపన్నుడే విద్యావంతుడన్నది.కానీ దానికి కూడా పరిధి ఉన్నది. 
       ఒక తత్వవేత్త వినయమని,పామరునికి నమస్కరిస్తే ,అది అతని విజ్ఞతకు గుర్తు. కానీ పామరుడు అది తన జ్ఞానానికి గుర్తుగా భావిస్తే కలిగే అనర్ధం అతణ్ణి సాధనకు దూరం చేస్తుంది . అతి వినయం కూడా అగౌరవమే.తన తల్లిదండ్రులు సభలోకూడా గౌరవించ దగిన వారు .నిరక్షురు లైనా  దైవ సమానులు. ఇలా ప్రతివిషయంలోనూ ఎన్నో బేధాలు,అన్నీ ధర్మాన్ని రక్షించేవిగాఉండాలి. అల్లుడు శ్రీ మహా విష్ణువని,శాస్త్రాన్ని నమ్మి,లక్ష్మిగా కన్యను సమర్పించి పాద తీర్ధం తలమీద జల్లుకుని, వారితో మీరు మేము సమానమే అని నొక్కి వక్కాణించే కన్యాదాత,వియ్యాలవారికి కప్పేది ఇలాంటి అంచు లేని తెల్లని వస్త్రమే .కానీ అదేమాట వరుని తండ్రి పలికితే, శాలువాతో సత్కరించినట్లుంటుంది.ఇద్దరు చెప్పింది ఒక్కటే అయినా అర్ధం మాత్రం ,అన్వయం కాదు. ధర్మ సూక్ష్మాన్ని గుర్తించిన వారిని కీర్తి వరిస్తుంది. ఎవరికీ తెలియదులే అని,అన్నీసమానం అనే ముసుగు,ఎంతోకాలం వారిరంగును దాచి ఉంచలేదు. అందరూ సమానమైతే శిష్యుడు గురువు వద్ద ,ఎప్పటికీ ఏమీ నేర్చుకోనివ్వని పొగరు మాత్రమే యివ్వగలుగుతుంది.
     భగవంతునికి వస్తు రూపంగా ఏమిచ్చినా,అది ఆయన సృష్టి లోనిదే.అందువల్లనే ఆచార్యులందరు స్తుతినే,భగ
వంతునికి కానుకగా సమర్పించారు.వాక్కు పరమేస్వరానుగ్రహమైనా దానిని అందరూ,వారి స్వప్రయోజనం కోసం
అనవసరము,అధర్మము అయిన వాక్చాతుర్యానికి వాడే అవకాశం ఎక్కువ. దీనిని అధిగమించి భక్తినే సాధనగా
వాక్కును ప్రవహింప చేసే సంస్కారానికి,సంయమనం చాలా అవసరం.మనకిష్టమైన విధంగా వాడుకోమని దైవం
అనుగ్రహించిన శారీరిక,మానసికి,బుద్ధి శక్తులను,పరమాత్మను చేర్చే సోపానాలుగా వాడితే అది ధర్మం. పంచ
ప్రయోజనాలే[ఇంద్రియ సుఖాలే] గమ్యం అయితే అది అధర్మం. అధర్మానికి వాడే వాక్కులు,భగవంతునికి వ్యతిరేక
దిశా,ప్రయాణం చేయించి జన్మ పరంపరలకు కారణ మౌతాయి.స్వతంత్రం మనకు ప్రసాదించినా, వివేకంతోవాడితే
పరమ ప్రయోజనం సిద్ధిస్తుంది. మనను మనమే పరమేశ్వరునికి సవినయంగా సమర్పించు కోవడాన్నే మనం
ధర్మం, అని భావిస్తే,అది ఇలలో కుమార్తెను మన మనసుగా భావించి లక్ష్మిగా,విష్ణువుకు సమర్పించడం ప్రధాన
ధర్మం.సవినయం లోపిస్తే అధర్మం.
         సంసారానికి పునాది గృహస్థాశ్రమమే. దీనికి వివాహ వ్యవస్థ సుసంపన్నమై,సరిగా తన పరిధిని కాపాడు
  కోలేకపోవడమే,ప్రస్తుత సమాజపు తీరుకు చాలావరకు కారణం. ఎన్నో జీవితాలు వీటికి ప్రతి బింబాలుగా సమాజంలో  కనిపించడం వలన,ఈ బ్లాగ్లో అనేకసార్లు,వివాహ సంబంధిత విషయాలు చర్చించడాన్ని విజ్ఞులు అర్ధం చేసుకోగలరు.సంస్కృతి ,సాంప్రదాయం కాపాడ గలిగేది సంసారం . అలా కాపాడిన సంసారి సత్యవ్రతుడు. దీనర్ధం మనకు పరిచయమే .ధర్మం కాలగతిలో మార్పుకు లోనైనా,ఆధారమైన సత్యం ఏమార్పు చెందదు. స్థిరంగా ఉన్న సత్యాన్ని దృష్టి నుండి జారి పోనీక దానికి ప్రదక్షిణంగాజీవితాన్నినడిపితే,కల్పాంతంలో మత్స్య రూపంలో బీజాలతో సహా ప్రళయంనుండి కాపాడి,సృష్టి నిపరమాత్మ కాపాడిన విషయం మనం పురాణాల్లో చూస్తాం . అంటే'అమ్మో కలికాలం,అన్నీ అలా జరుగు తున్నాయంతే 'మాకేం సంబంధంలేదు,అనేవాళ్ళు,సత్యవ్రతులెలాఅవుతారు?సత్యమే వ్రతంగా చాకచక్యంగా జీవించి భావితరాలకు మూలాలను పరిచయం చేసి ,వాటిని కాపాడే బాధ్యత అందించడమే మానవ కర్తవ్యం .దీనికి ధర్మాగ్రహం కూడా అవసరమే. అందువల్లనే దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ పరమావధిగా నారాయణుడు ,నారాయణి ఆయుధాలు ధరించి మనకు మార్గ దర్శనం చేశారు.దీనికి ఆయుధాలు ధరించి తిరగాలనేది ఉద్దేశం కాదు . ఆలోచనలో మంచి,చెడుల విశ్లేషణ చాలా అవసరం. అలా ప్రతి క్షణం జాగ్రత్తగా వేసే అడుగులు చూసి మాత్రమే ,పిల్లలు అప్రమత్తంగా ఉంటారు. లేకుంటే మోడరేషన్ పేరుతో వంచించ బడతారు .దీనికి తమను,తాము సవరించుకోని పెద్దలదే తప్పు. నిజానికి భగవంతుడు యుద్ధ ప్రాతిపదికకు మాత్రమే వాహనము , ఆయుధాలు ధరించినట్లు కనిపిస్తుంది . అలానే మానవ  శరీరంవాహనమైతే ఆలోచన ,ప్రవర్తన ,కార్యాచరణ ఇవే ఆయుధాలు.గెలవవలసిన శత్రువు అజ్ఞానమే .రూపం లేదు. అసలు ఉనికే లేదు . పోరాడవలసిన శత్రువుకు ఉన్న ఒకేఒక ఆయుధం ,కనిపించకుండా  పారిపోవడమే .స్వరూప జ్ఞానం జాగ్రత్తుగా అందితే మాత్రమే గెలుపు సాధ్యం . భగవంతుని స్మరణకు రానివ్వని  శత్రు లక్షణాలు,మానవ నైజాలుగా భావిస్తే ,వాటితో తల పడక తప్పదు . దీనిని అధిగమించి ,పాంచ భౌతిక విషయాలకు ఎంత వరకు అవసరమో అంతే విలువనిచ్చి గమ్యం వైపు ప్రయాణించే నేర్పు అందించే తల్లి దండ్రులకు పాదాభి వందనం.
          పంగల కర్ర అనే దానితో పిల్లలు ఆడుతుంటారు . y ఆకారంలోని కర్రకు రబ్బరు మ్ముక్క కట్టి ,ఒకరాయి తీసుకుని రబ్బరుతో వెనక్కి లాగి ,ఒక కాయనో లేదా మరో గమ్యాన్నో ,గురిచూసి కొడుతూ ఆడతారు. అలానే అర్జునునిలా అందరూ విలువిద్య నేర్వకున్నా ,సృష్టిలోని ప్రతివారు అన్ని విషయాలకు ,కొంత గురి నుపయోగించి తమ సమస్త వ్యవహారాలను సాగిస్తారు . కొన్నిగమ్యాలు  దగ్గరగా,కొన్ని దూరంగా భ్రమ  పెడుతున్నాయి . దగ్గర దానికి పట్టు బిగించినా ఓటమే . దూరానికి పట్టు తగ్గినా ఓటమే . ఈరెంటికీ ఆధారమైన గురి అనే దానిమీద దృష్టిని శాస్త్రం ఏకాగ్రత అంటుంది . కానీ ఏకాగ్రత  అంటే బాహ్య వస్తు ,విషయ ప్రతిపాదనం కాదు . గురి మీది అవగాహన ,ఆధ్యాత్మిక చైతన్యమే . గురిచూస్తున్న విషయాన్నిగమనిస్తున్న  సాక్షిని ,శరీర పర్యంతంగా చూస్తే జీవుడు .తన శరీరం కూడా అందులోనే లయిస్తే పరమాత్మ .      
          తల్లి,తండ్రుల సౌభాగ్యం పిల్లలు ,వీరి పట్ల అపారమైన ప్రీతి తల్లి ,తండ్రులకు . ప్రీతి అనే పేరుకూడా పరిచయం లేని పిల్లలకు ,తల్లి ,తండ్రులే ప్రపంచం .పిల్లలు ఈ దశలో ఉన్నంత వరకు పిల్లలకు  ,తల్లి,దండ్రుల సాన్నిధ్యం , అపారంగా అందుతుంది.ఇదే భక్తుడికి ,భగవంతుడికి ఉన్నఅనుబంధం.భగవంతుడికి సృష్టి అంతా సమానమైనా,మాయచేత  ఆవరింపబడిన జీవులకు, ఈ విషయం ,బుద్ధిలో ప్రకాసించదు . తనువూ మనసూ ఏకం చేసి , సృష్టి వైపు ద్రుష్టి పోనివ్వక సర్వమూ పరమాత్మ  అనే అచంచల విశ్వాసం వలన ,కష్ట నష్టాలను కనీసం దృష్టిలోనికి రానీయక ,సదా స్వామి పద కమల ప్రీతి రూపమైన భక్తితో రమించే భక్తులకు ,ప్రతి కదలికలోను పరమాత్ముని సామీప్యం అందుతూ ,మనసు అదే పనిగా పరమాత్మలో ,లీనమోవుతుంది. ఈ దశ నెమ్మదిగా మారి ,సాకార రూప ధ్యానం నుండి నిరాకార పరతత్వం వైపు , ప్రయాణమే,నిజానికి దీని వలన కలిగే లాభంఅంటుంది,త్రిపురా రహస్యం అనే గ్రంధం . ఇది దత్తాత్రేయులు , పరశురామునికి చేసిన ఉపదేశ రూపమైన గ్రంధం .
          ఇది ఒక జన్మలో జరిగే మార్పు అని చెప్పలేము . అందువల్లనే సాధకులందరికి ఒకే రకమైన అనుభవాలు , ఆచరణలుఉండవు . అందువలన సాకారం ,కొందరికి తృప్తి కలిగించినా ,వీరికి బుద్ధి నిరాకారం వైపు పారదు . అంత మాత్రాన లోటు ఏమిలేదు . వీరికి ఈ దశలో కలిగే తృప్తి అపారం . ఈమజిలీ నుండి బయట పడాలంటే ,తల్లిని విడిచి స్కూలుకు వెళ్ళే పిల్లల , మానసిక పరిస్థితే వీరిది . కానీ సృష్టి లోనికి వచ్చిన ప్రతి జీవి ప్రయాణం ,మోక్షమే . జీవాత్మ , పరమాత్మగా ప్రకాసించే వరకూ ప్రయాణం తప్పదు . పురాకృత పాపము  పుణ్యము ,సమానమైనపుడు ,ఏర్పడేదే మానవ జన్మ . అంటే ప్రారబ్ధ రూపానికిరానిది ఎంతో ఉంటుంది . దీనితో సంబంధం లేదు అనడం కుదరదు . భక్తిలో సంత్రుప్తులు కావచ్చు . కానీ మళ్లీ జ్ఞానం కోసంతిరిగి రారని అనలేము . భక్తిలో  సంచితాలన్నీ నశిస్తాయని ఎక్కడా చెప్పలేదు . జ్ఞానాగ్ని దగ్ధ కర్మణాం అన్నారు . అందువల్లనే సృష్టి మూలమైన పంచ భూతాలే తప్ప ,ఏమీ లేదనే నామరూప నిరాకరణ రూపమైన దృష్టినే జ్ఞానం అని ప్రతిపాదించారు పెద్దలు.
               పాంచ భౌతిక విషయాలు మనసును ఆకర్షించ లేని ఈ స్థితిని ,వైరాగ్యం అని భావించ వచ్చు . అంతేకానీ ఇంటిని సంసారాన్ని విడిచి పెట్టడమే ,వైరాగ్యం కాదు . ఈ భావాన్ని బలపరిచిన కొద్దీ ,తామరాకు మీది నీతి బొట్టులా మనసు , సాధనకు సహకరిస్తుంది . ఈ స్థితిలో జరిగే పూజ అత్యంత శక్తి వంతమైనది . బాహ్య ప్రపంచంలో విరమిస్తున్న మనసుకు ,పూజ  లోని ప్రతి పదార్ధము,శబ్దం,అంతరార్ధాన్ని పరిచయం చేస్తాయి .కదిలే ప్రతి భావము ఒక పువ్వై భగవంతుని కోసం విరబూస్తుంది .  ఇదే నిజానికి భగవదార్చన . ఇలా ఏర్చి కూర్చిన ,కదంబ మాల ,ఈ చిన్న blog .  ఉనికిని తన ఆత్మగాను ,పరమాత్మగాను  అనుభవానికి తెచ్చుకోవడమే మోక్షం. తను ఆత్మగా  సంభావించినది ,పర మాత్మ అని ,ఉప్పు బొమ్మ సముద్రంలో మిగలనట్లు   అంతా పరబ్రహ్మమే . ఇదే రమణ మార్గం .
                    'ఓం నమో భగవతే శ్రీ రమణాయ'           
      ఉగాది 'జయ'నామంతో వచ్చింది.ఉగాదిని సృష్టి ప్రారంభంగా భావిస్తాం . నారాయణుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు మధు ,కైటభులనే రాక్షసులు ,స్వామి కర్ణం నుండి ఆవిర్భవించి లోకాలను అల్ల కల్లోలం చేస్తున్నారు .దేవతల ప్రార్ధన మేరకు  జగదంబ నారాయణుని ,కనులనుండి ,వైదొలగి నందు వలన ,నారాయణుడు ,మధు కైటభులను నశింప జేశాడని , దేవి సప్తశతి  తెలియ జేస్తుంది . పరమాత్మ కన్న జగత్తు వేరనే ,నిద్రా స్థితిలో మాత్రమే ,తమోగుణ సంబంధ మైన ,జగత్తుపట్ల ఆసక్తి ,దాన్ని ఆస్వాదించాలనే తపన ,మనిషికి కలుగుతాయి . ఇవే మధు ,కైటభులు .మధువు ఒక్కటే ,అదే అహం . కైటభాలు ఎన్నో ,అదే నాది . వెరసి నేను , నాది . మహా కాళీ స్వరూపం ,తమో గుణ లక్షణాలను  తొలగించి ,రజో గుణ రూపమైన సాధనకు ,దారి సుగమం చేస్తుంది . అంటే రాత్రి ముగిసి ,ఉషోదయ మైందని గుర్తుగా ఉగాది నిర్వహించ బడుతున్నది .కాళి నాలిక చూపడం ,సరస్వతి రూపానికి గుర్తు . తమోగుణం విడిచి ,కృషితో , జ్ఞానాన్ని కలిగి ,ఆ వెలుగులో సకల కార్యాలు నిర్వహిస్తూ పరమాత్మను చేరమని ,దారి చూపే వెలుగే ఉగాది .
     అందువలన మనకు ఉగాదికి ,దుర్గా స్వరూపిణిగా ,ప్రతి ఊరిలోను పొలిమేర కాచే తల్లిగా ,భావించి ,ఉత్సవాలు
చెయ్యడం జరుగుతూ ఉంటుంది . అంతరార్ధం గ్రహిస్తే ,అన్ని వేళలా తల్లి ,ఎవరి దృష్టి పడకుండా పిల్లలను కాపాడినట్లు
పాడి ,పంటలను కాపాడుతుందని ,ఉత్సవాలను ,పెద్దలు ,శాసించారు .వ్యక్తిగా చూసినా ,గ్రామ దేవత అనుగ్రహంతో, సమాజపు క్రూర దృష్టి నుండి ,ప్రతివారిని రక్షించేది అమ్మ ,అనుగ్రహమే .
   ఉగాది మర్నాటి నుండి వసంత నవరాత్రులు మొదలవుతాయి . అమ్మను దుర్గగా శరన్నవరాత్రులలో పూజిస్తే ,వసంత నవరాత్రులు ,శ్రీరామ నవమి ఉత్సవాలుగా జరుపుకోవడం మనకు తెలిసిందే . దుష్ట శిక్షణకు దుర్గా దేవి ఉగ్రత్వం అవసరమైనట్లే ,శిష్టరక్షణకు సంయమనంతో కూడిన ధర్మ రక్షణ అంతే అవసరం.దుష్టత్వాన్ని భంజనం చెయ్యడానికి,రాత్రి   రూపమైన దక్షిణాయణంలో దుర్గ ఆరాధనం చెయ్యడం ఆచారంలో కనిపిస్తున్నది . అలానే ధర్మానికి పట్టం కట్టే వసంత నవరాత్రులు ,శ్రీరామ జన్మదిన ,సీతా వివాహాలను జరపడం పరంపరగా వస్తున్నది . బయటి ప్రపంచంతో వ్యవహారానికి దుష్ట నియంత్రణకు కొంత కోపము ,ఉగ్రత్వము తప్పనిసరి . తమ పిల్లలే అయినా సవరించ వలసినప్పుడు దండన తప్పదు.అంతరంగ ఉన్నతికి ,ధర్మం యొక్క జననం తప్పదు .అదే రామ జననం . అదే ఉత్తరాయణం .తనలోని పది ఇంద్రియాలనే రావణాసురుడు ,మనసనే సీతమ్మను అనుక్షణం ఎత్తుకుపోతూనే ఉంటాడు.దీనిపై విజయమే రామరాజ్య స్థాపన.పదివేల సంవత్సరాలు రాముడు రాజ్యం పరిపాలించాడని అంటారు . అంటే రావణాసురుడి వ్యవహారమంతా చాలా చిన్నది .అలానే ఇంద్రియజయం ,చిత్తశుద్ధితో చాలా చిన్నది . కానీ ఎప్పుడూ జాగ్రత్త అవసరం .
         అందుకు శ్రీ ఆచార్య శంకరులు తప్పక రావలసిందే వైశాఖ పంచమికి . సాధన కూడా గ్రీష్మంలా సాగాలి .  భగవంతునితో సామీప్యాన్నిచ్చే ,తొలి ఏకాదశిగా తనలోతాను మనన మనే యోగ నిద్రలో ములగాలి .వ్యాసుని దయతో అధ్యయనం సాగి ,శ్రవణం దిశగా పరమాత్మ ఉపదేశాన్ని అంతరంగంలో వినాలి . సృష్టికి ముందు అంటే తనకు ప్రపంచం పరిచయానికి ముందు అర్ధనారీశ్వరం . భూతకాలం ,భవిష్యత్తు వీటిలో తనను ,తన శక్తిని వేరుగా చూపడం వీలుకాదు .అది ఏకం .వర్తమానం మాత్రమే తన శక్తి ప్రకటించ గలదు .అదే వర్తమాన స్వరూపమైన లక్షీ నారాయణ రూపం . స్వరూప   నిష్టలో ,యోగనిద్రా స్థితిలో ఆత్మాను సంధానం చేస్తూ ,తన వ్యవహారాలను సక్రమంగా నడిపేదే నిజమైన లక్ష్మీ కృప .
         జాగ్రత్తగా సాధన సాగితే ,హయగ్రీవ తత్వమైన గురు రూపం ,హృదయంలో ఆవిష్కృతమై ,యజ్ఞోపవీత రూపమైన బ్రహ్మ స్వరూపం అవగాహనకు అందడానికి ,సంధ్యా వందనమనే నిగూఢ తత్వం పరిచయ మౌతుంది . రెండు సంకల్పాల నడుమ సంధ్య,ధర్మాధర్మాలు ,సత్యాసత్యాలు ,ఇలా అన్ని ద్వందాలకు  ఆధారంగా ఉన్న పరతత్వం ,తన పాదాలను చూపుతూ ,ఆధారం పరబ్రహ్మ తత్వంగా వరద హస్తంతో పరిచయం చేస్తూ, శంఖ , చక్రాలు అవసరం లేదంటూ[జనన మరణ చక్రభ్రమణం లేదంటూ ,అంతరంగ శత్రువులపై శంఖాన్ని పూరించ వలసిన అవసరం లేదంటూ ]ఈ ప్రాపంచిక విషయాలు ఎప్పటికీ నిన్ను మభ్య  పెట్టలేవంటూ కటి హస్తాన్నిమనసుకు బాసటగా చూపి , 'వేంకటేశుడిగా 'సహస్రార కమలంలో వేంచేస్తాడు ,శ్రావణ పౌర్ణమికి శ్రవణా నక్షత్రంలో .తన సంపూర్ణ శక్తితో సాధనే,తిరుపతిలో [మూలాధారం ]అలివేలు మంగకు ,నిత్యమూ  తిరుమలలో స్వామి వారితో కళ్యాణం .వర్తమానం అనేది నిజానికి కాలాతీత స్థితి . భూత ,భవిష్యత్తు అనే రెంటినీ అధిగమించినపుడు ఉన్న స్వస్థితి ,మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం .
          కానీ ఇది జీవాత్మ ,పరమాత్మను ఏకం చేసిన క్షణం . సంసారం సముద్రంలా భయపెట్టకుండా వెంకటేశ్వరుని కృపతో కటి లోతు ఉన్న,చిన్న వాగులా కనిపిస్తున్నా ,ఏమరుపాటు తగదు .సృష్టిలో శరీరం కదులుతున్నంత వరకు ప్రమాదం ,ఇంద్రియాల రూపంలో మనసును కైవసం చేసుకోవచ్చు.ఇప్పుడు వసుదేవుని కాళ్ళు పట్టుకుని మనలో అప్పుడే ఉదయించిన మనలోని చిన్న కృష్ణుని ,మళ్లీ కంసుని బారిన పడకుండా ,నంద ,యశోదల వద్దకు చేర్చమని,దేవకిలాఅర్ధించకతప్పదు.లోపలి అనుభవం వల్ల ఎంతో ఆనందం,నందుడు ,పరమాత్మకున్న యశస్సును మరువక ఉండేది యశోద.వీరి నుండి ఏమాత్రం పక్కకు కదిలినా ,కంసుడు [అహం ]పంపిన పూతన ,సృష్టిని ఆస్వాదించే దిశగా ప్రోత్సహించ వచ్చు . సృష్టి అంతా పరమాత్మ లీలగా గుర్తించి ,పూతన నుండి రక్షించుకోవాలి . పరమాత్మ కృష్ణావతారం గ్రహించినపుడు వీరిని వధించి ఒక లీలగా దీన్ని మనకు ఉపదేశిస్తున్నారు. మనసులోని వృత్తులు ,వ్రుతాసురునిలా ,గమ్యం నుండి ఎత్తుకు పోవచ్చు .
     అనుక్షణం ,అప్రమత్తంగా లేకుంటే ,జ్ఞానం పేరుతో తమో గుణ లక్షణమైన నిష్క్రియత్వం వైపు మనసును వెళ్ళనీకుండా , గమనించమనే హెచ్చరిక ,శకటాసుర వధ . ఎప్పుడైనా న్యాయాన్యాయాలు ,ధర్మాధర్మాలు అంటూ మనసును [కొంగ]బకాసురుడు పట్టుకు పోవచ్చు . తస్మాత్ జాగ్రత . ఇలా కృష్ణావతారం ఎన్నో విషయాలకు అన్వయం అవుతుంది . ఇదే శ్రీ కృష్ణ జన్మాష్టమి .
          అందువల్ల పొలిమేరను ధర్మం అనే , కంచె వేసి కాపాడుకోక తప్పదు .అదే కదులుతున్న కాలంలో పోలేరమ్మ పూజ .భద్రంగా కాపాడుకున్న పదం ,ఓంకార రూపమైన విఘ్నాధిపతిగా కాపాడి ,అనంత పద్మనాభునితో  అనంతమైన పరతత్వంలో జాగరూకత నిస్తుంది.శరన్నవరాత్రులలో అమ్మ యొక్క అనుగ్రహం అన్ని లౌకిక శక్తులు ఏకమైనా,సాధకుని రక్షిస్తుంది.భూమి నుండి వచ్చిన శరీరం తననే నరకాసుర వధతో ,మోక్ష లక్ష్మి అనుగ్రహిస్తుంది . కర్తృత్వం విడిచి ,కార్తీకం పరమాత్మను సేవించమని ఆదేశిస్తుంది .
           ఇది చాలా జాగ్రత్తగా గమనించ వలసిన విషయం . సాధారణంగా ఇప్పటి కాలంలో అన్ని చోట్ల వినిపించే పదం అంతటా పరమాత్మ ఉన్నాడు,తనలోనుఉన్నాడు ,కనుక దేవాలయంతో పని లేదు .అజ్ఞానం వలన ,కుండలో ప్రతి బింబాన్నే సూర్యుడనుకునే తీరు స్పష్టంగా తెలుస్తున్నది . ఇది బాల్యావస్థ . జ్ఞాని అలా కనిపిస్తున్నా నిజం తెలిసినవాడు . అనుభవ జ్ఞానం లేనివారు బాల్యావస్థను,జ్ఞానవస్థకు అన్వయించడం బాధాకరం .అందుకే జీవాత్మ పరిధిలో ఉన్న సాధకుడు , గురువును ,ఆశ్రయించవలసిందే .మధురలో కరాగారంలోని చిన్ని కృష్ణుడు వసుదేవుడు చేరిస్తేనే ,నంద వ్రజం చేరాడు .
      పరమాత్మ ఆదేశిస్తున్న విధంగా లీలగా చెప్తున్న విషయాలను జాగ్రత్తగా అన్వయించి ,గమనించాలి . జీవాత్మ అనే పరిధిలోని వ్యక్తి ,కారాగారంలో బంధింప బడిన వానితో సమానం . మోహమనే తాళ్ళతో అన్ని సంబంధాలను పెనవేసి కట్టుకుని,దేన్నీ విడిచి పెట్టలేని దీనుడు.ప్రపంచాన్ని,పంచ భుతాత్మకంగా ఎరుగక ,ఎప్పుడూ అంతరంగంలోనికి ప్రవేశించక ,  అన్ని వైపులా వినిపిస్తున్న ,బ్రహ్మ మొక్కటే అనేదాన్ని తనకు తాను అన్వయించు కొని ,శాస్త్రాన్ని ,అది ఆదేశించిన జీవన విధానాన్ని విడిచి ,ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరిందన్న చందంగా ,దేవాలయం అనేది ,పనిలేని వాళ్ళు వెళ్ళే కేంద్రంగా భావించే వారికి కొదవలేదు .తాము జ్ఞానులు కనుక వీటి అవసరం లేదు అనుకునేవారి సంఖ్య పెరిగింది .
       నిజానికి శాస్త్ర ప్రకారం నిర్మించిన ఆలయాల్లో ,స్వయం వ్యక్త ఆలయాల్లో ఉన్న శక్తి ,సాధారణ ఇంద్రియాలు తెలుసుకో లేవు . తపస్సుతో పునీతమైన మనస్సుకు అందే శాంతి మాత్రమే ,ఇందుకు నిదర్శనం . ఎన్నో అద్భుతాలు కూడా ఎన్నోసార్లు కనువిప్పు కలిగిస్తాయి .చిన్నదైన జీవత్వం ,దైవత్వాన్ని గుర్తించి తన మోహ శృంఖల విముక్తం చెయ్యమని ప్రార్ధించే గుడులు ,భగవత్ కృపకు తార్కాణాలు . ఇంటిలోని పూజా మందిరం ,శాస్త్ర సమ్మతంగా ,ప్రాణ ప్రతిష్ఠ జరిపిన ఆలయం వలె,పురాకృత కర్మను కూడా ధిక్కరించి ,భగవత్ శక్తిని ప్రసరించ లేదు . కానీ ఆ శక్తి ,ఆలయంలోని విగ్రహ రూపుడైన పరమాత్మకు ఉంది .దీనికి  పూర్వ కర్మల పాప ఫలం ఇపుడు పరమాత్మను పొందే సాధనకు అవరోధం కలిగించ కుండా ,చెరువులోని నాచును పక్కకితోసి వస్తు దర్శనం చేసే వీలు కల్పిస్తుంది . సద్వస్తువు పరమాత్మ మాత్రమే . దీన్ని సాధనా సంపత్తిలో చేర్చుకోవాలి .
    శరీర పర్యంతం,జ్ఞాని కూడా ,శాస్త్రోక్త కర్మను విడిచి , తెలియని వారిని వంచింపరాదని ,గీతాచార్యుని శాసనం .కానీ
అనుభవ జ్ఞానం లేకున్నా వంచించే వారిని ఏమనగలం ?కనుక శరీరం సహకరించినంతకాలం ,దేవాలయ సాంప్రదాయాలను గౌరవించడం కర్తవ్యం . ఇదే కార్తికేయుని కర్మ సిద్దాంతం ,కార్తికంలో .ఇలా చూస్తే సంవత్సర కాలం ,విష్ణువుకు ఒక రోజు అనిచూస్తే ఉత్తరాయణం ,పగలు . దక్షిణాయణం రాత్రి . రాత్రి లోని బ్రహ్మ ముహూర్త కాలమే కార్తీకం . ఈ సమయంలో చేసే భక్తి ,కర్మ ,జ్ఞాన మార్గాలు , బ్రాహ్మీ ముహూర్త ఫలాలను అందిస్తాయి .
      అందుకున్న ఫలాలు ,మార్గశీర్ష లోని , శ్రేయో మార్గాన్ని పరిచయం చేస్తాయి . సుబ్రహ్మణ్య షష్టి ,సృష్టి రహస్యాన్ని మనముందుంచి ,మార్గ దర్శనం చేస్తుంది . అందువల్లనే స్వామి దేవసేనాద్యక్షుడు . సంవత్సరంలోని ఆరు ఋతువులు ఆరు ముఖాలు . పన్నెండు చేతులే నెలలు .ఉత్తర ,దక్షిణా యణాలే పాదాలు . కదిలే కాల[ళ]రూపుడే స్వామి . ఇలా కాలం , స్వామి రూపంగా ఆరాధించే వారికి దేవసేన ఆయన శక్తిగా అనుగ్రహించి ,నిరంతరం ప్రాపంచిక జీవనంలో కొట్టుకు పోతున్న వారికి ,దైవీ గుణాలను అందించి ,శ్రేయో మార్గాన్ని వారు అనుసరించేలా అనుగ్రహిస్తుంది . కాలం చైతన్య రూపంగా చూసే వారికి సుబ్రహ్మణ్యుని అంతరంగ శక్తి శ్రీ వల్లిగా ఆశీర్వదిస్తుంది .
       అరుణోదయ సమయమే ధనుర్మాసం . సంధ్యా సమయపాలనగా ,గోమయంతో చేసే గొబ్బెమ్మలతో లక్ష్మీ ఆవాహనం . గృహంలో, లక్ష్మీ నారాయణులకు ,బాల భోగం . అంటే ,కట్టు పొంగలి ,చెక్కరపొంగలి ,దద్ద్యోజనా లను
నివేదించడం . అంటే ఉదయ సంధ్యా సమయంలో చేసే ఈ పూజ సూర్యనారాయణ పూజ .అందువల్లనే మార్గశిర లక్ష్మివారలు గురువు ధనస్సులో ప్రవేశించే మాసంలో వస్తాయి . గురు అనుగ్రహమే నిజానికి లక్ష్మీ కృప . గోదాదేవి , శ్రీరంగ శాయిని పూజించి స్వామిని చేరినది ,ధనుర్మాసంలోనే.  మందంగా ఉన్న కాలం ,కొత్త స్ఫూర్తితో మకరసంక్రమణ పుణ్య కాలంలో,సూర్యుని పూజించి,ప్రత్యక్ష లక్ష్మీ నారాయణ కృపకు పాత్రులను చేస్తుంది . ఇది మెలకువలో అంటే జాగ్రదావస్థలో స్వస్వరూప చైతన్య[సూర్యుడు] దర్శనానికి సూచనగా గ్రహించవచ్చు .
     ధనుస్సు గురువుకు సంబంధించిన రాశి . అంటే ధను సంక్రమణం గురూపదేశం పొందడం గాను ,మకరం శని యొక్క   రాశి . మకరం తనలోని తమస్సును దూరంచేసుకునే సాధనా సమయంగాను భావించి ,భోగి మంటలలో తన తమో గుణాన్ని అలానే అసంపూర్ణ మిధ్యా జ్ఞానాన్ని విడిచి ,సాధనకు ఉదయ సంధ్యను వినియోగించు కోవాలి . ఇదే పౌష్య లక్ష్మి అనుగ్రహం . ఇదే కృషితో ధాన్యలక్ష్మితో బాటు ,అంతరంగ జ్ఞాన లక్ష్మి కృపకు సాధనం .