2, అక్టోబర్ 2016, ఆదివారం

శ్రీ మాత్రే నమః

శ్రీ మాత్రే నమః .
ప్రతి సంవత్సరము ,శరన్నవరాత్రులలో అమ్మవారిని ఎంత శక్తి ఉన్నా ,ఎంతో శ్రద్ధతో అందరూ సేవిస్తారు . దురిత
నివారణ అమ్మవారి అనుగ్రహం . దురితాలలో ఎవరూ జ్ఞానాన్ని సముపార్జించ లేరు . అందువలన ఈ నవరాత్రులు
దురితాన్ని దూరం చేస్తే ,శరత్తులోని నీటిలా మనసు తేలికపడి ,జ్ఞానం వైపు చూడడానికి సాహసం చేస్తుంది . వసంత నవరాత్రులు ,సరస్వతీ అనుగ్రహంతో ,ధర్మం ఏమిటి ?ఎలా నడుచుకోవాలి, అనే దిశా నిర్దేశం చేసే ,వ్యాపక పరబ్రహ్మ
తత్వమైన రామతత్వాన్ని ప్రకటిస్తూ, జ్ఞాన రూపంలో అమ్మఅనుగ్రహం లభిస్తుంది . కానీ ప్రకటంగా రామ నవమి
వేడుకలకు ప్రాధాన్యం . జ్ఞానం యొక్క ప్రకట రూపం ధర్మం . దురితాలతో పోరాటం అలసట కలిగిస్తుంది . సేద తీరాలంటే ధర్మాన్ని ఆలంబన చేసుకోవలసిందే .
   పరమార్ధంలో బయట మనకు కనిపించే దుఃఖాలు పోగొట్టడమనే అర్ధం ఉన్నా ,నిజమైన అమ్మ యుద్ధం దేనితో
అనే ప్రశ్న చాలా అవసరం . ఎన్నో శరన్నవరాత్రులు ,వసంత నవరాత్రులు చూశాక ,ఎప్పుడూ ఈ పోరాటం మనలో
ఆగడం లేదనేది మనం గమనించ వచ్చు.మనను గెలిపించాలని అమ్మ ఆరాటం అర్ధం ఏమిటి ? చీడ పట్టిన చేనును 
రైతు జీవ కారుణ్యం ,ఆ జీవులు మనలాంటివే అంటే ,ఆజ్ఞానం [అజ్ఞానం]రైతుకు ఎంతవరకు మంచిది ?దీన్ని
సమానత్వం అనే పేరుతొ ఎంతవరకు సహించాలి ?దీన్నే శాస్త్రంలో అసుర లక్షణం ,మంచి లక్షణాల మీద చేసే
యుద్ధంగా గ్రహిస్తే ,దీన్ని రైతుకున్న పక్షపాత ద్రుష్టి అనడం ఎంతవరకు సమంజసం ?
   సర్వత్రా వ్యాపకమైన పరమాత్మ ఎవరి పట్ల అధిక ప్రేమను కాక ,మంచి లక్షణాల [ధర్మం]పట్ల ఉన్న బాధ్యత వల్ల
సక్రమ మార్గాన్ని మనకు పరిచయం కలిగించాడనికి ,నిరాకరమైన మౌన వ్యాఖ్యను ,శబ్దరూపమైన వేదరాశిగా , అందుకోలేని  వారికి ఇతిహాస ,పురాణ రూపంగా అందించాడు ,తపించిన మునుల ద్వారా . అలా మనకు అందిన
పూజలో,నిరాకరమైన మనసు ,పరమాత్మలో లయిస్తే ,ఉన్నది పరబ్రహ్మమే . అమ్మవారు చేస్తున్న యుద్ధం ఏమిటి
అంటే ,లీలగా కనిపిస్తున్న ఈ ప్రపంచ అంతా సాలీడు అల్లిన గూడులా అంతా , పరమాత్మ నుండే వచ్చింది . అందు లోనే ఉంది . మళ్ళీ పరమాత్మలో లయమౌతుంది .ఇది అందరికీ తెలిసిన సామాన్య సత్యం . కానీ ఎప్పుడూ దీన్ని
పట్టించుకోకుండా ,తను ,తన  కష్టాలు ,నష్టాలు ,వీటిని తీర్చడానికే పరిమితమైన పరమాత్మ . కలుగుతున్న సుఖ
భ్రాంతికి , తన ప్రతాపంతో తాను సాధించిన విజయాలకు కర్తననే అహం . ఇలా సాగే జీవుని ప్రయాణంలో ,సమయం
లోపల సామాన్య సత్యాన్ని తలకెక్కించాలనే తాపత్రయం అమ్మవారిది . దీనికే ఇంత యుద్ధం . ఉన్న పరమాత్మదే
సృష్టి లోని ప్రతి అణువు . అది నాది అంటే అమ్మ ఊరుకోదు . కర్తను నేను అంటే ఎలా ?శరీరంలో శక్తి అమ్మవారిది.
సృష్టి రూపంలో ఈశ్వరుని , ఆయన శక్తిగా సంపదను గుర్తించే వరకు ఆమె యుద్ధం ఆగదు . ఈ జ్ఞానం కలిగే వరకు
ధర్మ యుద్ధం చేసి ,ఆత్మా రాముడై జీవుడు వెలగాలి .