15, సెప్టెంబర్ 2016, గురువారం

హిందూధర్మం

హిందూధర్మం ఎంతో సనాతనమై కోట్ల సంవత్సరాలుగా నిలిచి ఉన్నట్లు మనకు నిదర్శనాలున్నాయి . రాముని కాలంనాటి ఆనవాళ్లనిబట్టి చూచినా అర్థంచేసుకోవచ్చు . త్రేతాయుగం నమ్మితే ముందు సత్యయుగం ,హరిశ్చంద్ర
చరిత్ర ,భగీరథ చరిత్ర ,అంతరంగంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ,అని అలానే నిర్గుణ ,నిరాకార చైతన్య పరబ్రహ్మ
స్వరూపమైన తనను శివోహం అని గ్రహించినా ,ఆచరణ దశలో సత్య ధర్మాలను ఆలంబనగా జీవితాన్ని నడిపిన
తపస్సంపన్నుల కనుసన్నలలో  ఊపిరి పోసుకున్న చరిత్ర ,నాగరికత, పెద్దలు అందరూ చెపుతున్నట్లుగా జీవించే విధానం పేరు హిందూ ధర్మం .ఎంతో విస్తరించిన మహా వృక్షం నీడలో సేదతీరే సమాజం హిందువులది . ఎవరికైనా
సమృద్ధి ,సహజత్వం ,చూసినపుడు కలిగే ఈర్ష్య ,ద్వేషాలే హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు . ఇవే
మనకు పూర్వయుగాల్లో దశావతారాలను రప్పించిన రాక్షస ప్రవృత్తులు . కలిలో వివిధ మతాలుగా ,నాగరికతల
రూపంలో ఇప్పుడు కూడా అంతే ప్రభావం చూపిస్తున్నాయి . పులిని చూసి నక్క వాత అనేవే ఇతర మతాలు . కానీ
నక్కని చూసి పులి ఊళ లా ఉంది పరిస్థితి . ఎంతో కష్టపడి పెద్దలు అందించిన జీవిత విధానం వదులుకొని ,వెళ్లి
ఆకులు కట్టుకున్న ఆటవిక జాతుల నుంచి నేర్చుకునే కుహనా సంస్కారాలకు పెద్ద పీట వేసి ,వాళ్ళముందు
మేము కూడా చావుడప్పు వాయించగలం అని ,మృదంగ విద్వాంసుడు చెప్పినట్లు తయారయింది సమాజం .