25, అక్టోబర్ 2016, మంగళవారం

ధర్మం

ధర్మం .
ధర్మం అంటే లక్షణం . గాలికి కదలడం లక్షణం . నీటికి ప్రవహించడం లక్షణం . ఇవి వీటి ధర్మాలు . పరమాత్మనుండి కదిలిన సృష్టికి అతని లక్షణాలే కలిగి ఉండడం ధర్మం . సర్వే సర్వత్రా ఉండడం వలన అంతా తానే ,అంతా తనదే .ఇది ప్రధమలక్షణం . ఇది అందరూ కలిగివున్నారు . ముందుగా ఈ లక్షణాలు శరీరానికి ముడిపెట్టకూడదు . ఇదే మనకు జ్ఞానులలో కనపడే మొదటి లక్షణం . ఎంతోమంది జ్ఞానులు విదేశీయుల దాడులలో 'మీరేమి చెయ్యలేరు . పొతే పోయేది నా శరీరమే' అని జవాబిచ్చారు .మనకి ప్రపంచం కనిపించడం అనేది పంచేంద్రియ విషయమే . నిద్రలో అది ఉన్నా తెలియదు .  అజ్ఞాన కారణంగా . కానీ అజ్ఞాన కారణంగా నిద్రలో లేనట్లే ,అద్వైత జ్ఞాన కారణంగా జ్ఞానులకు ,ఊహా మాత్రంగా గాని , కలలాగా కానీ దీని అస్తిత్వం ఉంది . అందుచేత ధర్మం అనేవిషయాన్ని అర్ధం చేసుకోడానికి ,పరమాత్మ పంచ భూత ప్రకృతిగా ఉన్నాడు అని అనుకుందాము . అందరూ పాడుతున్న అన్నమయ్య పాట ,అందరికి ,నేల ,నీరు ,గాలి సమానమని చెపుతున్నది .నిద్రలో లేని బేధం మెలకువలో ఉంది . నిద్రలో ఏమి తెలియనీయని అజ్ఞానం , మెలకువలో  శరీరధ్యాసను కానుకగా ఇస్తున్నది . దీనినే మాయ అని శాస్త్రం అంటుంది . పంచభూతాలు ,కొన్నిసమీకరణలతో ఏర్పడిన శరీరం ,పంచ భూతాలే కదా . అది వాటితోనే పోషించబడుతుంది .తిరిగి వాటిలోనే కలిసి పోతుంది దీనిలో తనది ఏముంది ?
    ఇదే ప్రధమసూత్రం హిందూ ధర్మానిది . ఇది అద్వైతం . దీనికి నేను ఉన్నాను అని జోడిస్తే ద్వైతం . ద్వైతం ఉంటే రెండవది ఉండడం వలన ఉన్నదాన్ని భాగించి సర్దుకోవలసి ఉంటుంది . దీనినే పరిధి అంటారు . ఇలా పరమాత్మ నేను , నాది అని విభాగించ బడినట్లు కనిపిస్తున్నది ,మెలకువ .నిద్రలో విభజనం లేకున్నా అద్వయ ప్రభావం వలన విశ్రాంతి ఉంది .అజ్ఞానం వలన తెలియమి ఉంది . ఇంతకీ అద్వైతమే విశ్రాంతి . అది అందనంతవరకు అశాంతి .అందుకునే పధ్ధతి ధర్మం . మెలకువ ద్వైతం కావడం వలన పరిధి ప్రారంభం అవుతుంది .ఇదే ప్రపంచం ,నాది అని సూచించ బడుతుంది అంతా తానేనన్న అనుభవం అంతా తనదే అనే భావాన్ని మనిషిలో 'నేను'అనేది కలిగి ఉంటుంది . దీని కోసం ప్రపంచంలో తాపత్రయ పడుతుంది 'నేను'. దీన్ని మాత్రమే శాస్త్రం నిరసిస్తుంది . సముద్రం  తాను కలిగి ఉన్న అలలను తానే పొందాలనుకునే తపన లాంటిదే ఇది . దీన్ని జ్ఞానంతో తొలగించుకోమని హితవు పలికేదే హిందూ ధర్మం . ఇంకా చాలా చర్చించుకుందాము .

3, అక్టోబర్ 2016, సోమవారం

శ్రీమాత్రే నమః .

శ్రీమాత్రే నమః .
సాధన ,సంస్కారాన్ని  బట్టి ఉంటుంది . సాధకులుగా పిల్లలు తయారవాలంటే మంచి సంస్కారాలు పెద్దలు ఆచరించి
అందించాలి . అత్యంత ముఖ్య విషయం ఏమిటంటే అందరికి మంచి విషయాలు తెలుసు . కానీ ఆచరణలో లోపం వల్ల పిల్లలకు అందడం లేదు . కాలం అందరిని పెద్దవారిని చేస్తోంది . కానీ విజ్ఞత మాత్రం తల్లి ,తండ్రులు వారు పొంది ,
పిల్లలో పెంచి పెద్ద చేయాలి . తాము అన్య కారణాల వలన పొందక పోయినా ,మీ బాధ్యతగా మీరు ధర్మాన్ని వహించి
పిల్లలకు మార్గదర్శనం చేయాలి . అలా పిల్లల్ని పెంచితే ,కనీసం ముందు తరాలకు ధర్మ భ్రష్టత రాదు . దీని వలన
వంశంలోని, పూర్వపు 7తరలవారి ఆశీర్వాదంతో మళ్ళీ వంశం ఉఛ్ఛ స్థితికి వస్తుంది . ఆర్ధికంగా బలంగా ఉన్న
సమయంలోనే ,ఆచార ,సంప్రదాయాలు ,వ్యవహరించే తీరు ,కట్టు ,బొట్టు ఇలా అన్ని విషయాలలో పెద్దలు ,పిల్లల్ని
ప్రభావితం చేయాలి . ఇలా ధర్మాచరణకు నడుం కడితే ,అది మనను ,మనకు తెలియకుండానే సాధకులను చేస్తుంది
  సాధన యొక్క పరాకాష్ఠ ,లోపల అగ్ని వలె వాసనలను దహించి ,ఆత్మ గురువును చేరుస్తుంది . అంటే నిజమైన
జిజ్ఞాస భగవంతుని ఉనికి పట్ల కలుగుతుంది . ఇదే ఎక్కువగా ఉపయోగపడే ఆత్మగురువు లక్షణం . శిష్యుడు
సమిధలతో గురువును చేరడం ఇదే . తనలోని వాసనల తడి పూర్తిగా ఆరినపుడు ,ఒక్క తత్వమసి అనే గురు వాక్యం ,వ్యాఖ్యానం అవసరం లేనంతగా ,అగ్నిని శిష్యునిలోని సమిధలను  ఆత్మ యజ్ఞంలో పొగరాకుండా ,యజ్ఞ ఫలాన్ని
అందేలా చేస్తుంది . ఆయజ్ఞ ఫలమే ,అహం బ్రహ్మాస్మి . 

2, అక్టోబర్ 2016, ఆదివారం

శ్రీ మాత్రే నమః

శ్రీ మాత్రే నమః .
ప్రతి సంవత్సరము ,శరన్నవరాత్రులలో అమ్మవారిని ఎంత శక్తి ఉన్నా ,ఎంతో శ్రద్ధతో అందరూ సేవిస్తారు . దురిత
నివారణ అమ్మవారి అనుగ్రహం . దురితాలలో ఎవరూ జ్ఞానాన్ని సముపార్జించ లేరు . అందువలన ఈ నవరాత్రులు
దురితాన్ని దూరం చేస్తే ,శరత్తులోని నీటిలా మనసు తేలికపడి ,జ్ఞానం వైపు చూడడానికి సాహసం చేస్తుంది . వసంత నవరాత్రులు ,సరస్వతీ అనుగ్రహంతో ,ధర్మం ఏమిటి ?ఎలా నడుచుకోవాలి, అనే దిశా నిర్దేశం చేసే ,వ్యాపక పరబ్రహ్మ
తత్వమైన రామతత్వాన్ని ప్రకటిస్తూ, జ్ఞాన రూపంలో అమ్మఅనుగ్రహం లభిస్తుంది . కానీ ప్రకటంగా రామ నవమి
వేడుకలకు ప్రాధాన్యం . జ్ఞానం యొక్క ప్రకట రూపం ధర్మం . దురితాలతో పోరాటం అలసట కలిగిస్తుంది . సేద తీరాలంటే ధర్మాన్ని ఆలంబన చేసుకోవలసిందే .
   పరమార్ధంలో బయట మనకు కనిపించే దుఃఖాలు పోగొట్టడమనే అర్ధం ఉన్నా ,నిజమైన అమ్మ యుద్ధం దేనితో
అనే ప్రశ్న చాలా అవసరం . ఎన్నో శరన్నవరాత్రులు ,వసంత నవరాత్రులు చూశాక ,ఎప్పుడూ ఈ పోరాటం మనలో
ఆగడం లేదనేది మనం గమనించ వచ్చు.మనను గెలిపించాలని అమ్మ ఆరాటం అర్ధం ఏమిటి ? చీడ పట్టిన చేనును 
రైతు జీవ కారుణ్యం ,ఆ జీవులు మనలాంటివే అంటే ,ఆజ్ఞానం [అజ్ఞానం]రైతుకు ఎంతవరకు మంచిది ?దీన్ని
సమానత్వం అనే పేరుతొ ఎంతవరకు సహించాలి ?దీన్నే శాస్త్రంలో అసుర లక్షణం ,మంచి లక్షణాల మీద చేసే
యుద్ధంగా గ్రహిస్తే ,దీన్ని రైతుకున్న పక్షపాత ద్రుష్టి అనడం ఎంతవరకు సమంజసం ?
   సర్వత్రా వ్యాపకమైన పరమాత్మ ఎవరి పట్ల అధిక ప్రేమను కాక ,మంచి లక్షణాల [ధర్మం]పట్ల ఉన్న బాధ్యత వల్ల
సక్రమ మార్గాన్ని మనకు పరిచయం కలిగించాడనికి ,నిరాకరమైన మౌన వ్యాఖ్యను ,శబ్దరూపమైన వేదరాశిగా , అందుకోలేని  వారికి ఇతిహాస ,పురాణ రూపంగా అందించాడు ,తపించిన మునుల ద్వారా . అలా మనకు అందిన
పూజలో,నిరాకరమైన మనసు ,పరమాత్మలో లయిస్తే ,ఉన్నది పరబ్రహ్మమే . అమ్మవారు చేస్తున్న యుద్ధం ఏమిటి
అంటే ,లీలగా కనిపిస్తున్న ఈ ప్రపంచ అంతా సాలీడు అల్లిన గూడులా అంతా , పరమాత్మ నుండే వచ్చింది . అందు లోనే ఉంది . మళ్ళీ పరమాత్మలో లయమౌతుంది .ఇది అందరికీ తెలిసిన సామాన్య సత్యం . కానీ ఎప్పుడూ దీన్ని
పట్టించుకోకుండా ,తను ,తన  కష్టాలు ,నష్టాలు ,వీటిని తీర్చడానికే పరిమితమైన పరమాత్మ . కలుగుతున్న సుఖ
భ్రాంతికి , తన ప్రతాపంతో తాను సాధించిన విజయాలకు కర్తననే అహం . ఇలా సాగే జీవుని ప్రయాణంలో ,సమయం
లోపల సామాన్య సత్యాన్ని తలకెక్కించాలనే తాపత్రయం అమ్మవారిది . దీనికే ఇంత యుద్ధం . ఉన్న పరమాత్మదే
సృష్టి లోని ప్రతి అణువు . అది నాది అంటే అమ్మ ఊరుకోదు . కర్తను నేను అంటే ఎలా ?శరీరంలో శక్తి అమ్మవారిది.
సృష్టి రూపంలో ఈశ్వరుని , ఆయన శక్తిగా సంపదను గుర్తించే వరకు ఆమె యుద్ధం ఆగదు . ఈ జ్ఞానం కలిగే వరకు
ధర్మ యుద్ధం చేసి ,ఆత్మా రాముడై జీవుడు వెలగాలి .