19, సెప్టెంబర్ 2016, సోమవారం

దృశ్యం

దృశ్యం .
దృశ్యం అనేది మనసుమీద చాలా ప్రతిభావంతంగా పనిచేస్తుంది .అలా సమాజం మీద చాలా ప్రభావం చూపింది
సినిమా .దీనివలన సంఘంలో ఎక్కువగా నాశనమైనది హిందువుల ఆచార ,సంప్రదాయాలే . దేవాలయాలు ,
కుటుంబాలు ,వారసత్వ పూజా విధానాలు ,ఎంతో ఉన్నతమైన తల్లి ,తండ్రుల న్యాయ సమ్మతమైన హక్కు ఐన
పిల్లల వివాహ విషయాలు అన్నీ,దౌర్భాగ్యపు అవలక్షణాలు సినిమా వలన అంటే ఆశ్చర్యం ఏమిలేదు . ముఖ్యంగా
బ్రాహ్మణ సమాజం తన విలువలను ,వినోదం అనే చిన్న కారణంతో పోగుట్టుకుని ,అందరిచేత దూషించ బడుతొంది .
ప్రతివారికి అవసరమైన పూజ ,జప ,యజ్ఞ కార్యక్రమాలకు వీరిని ఉపయోగించు కుంటున్న సమాజం ,వినోదానికి
బలి అయిన వీరిని చిన్నచూపు చూస్తున్నది . ఎన్నో పురోహిత కుటుంబాలు తమ వృత్తిని కాదని పిల్లలను ఉద్యోగాలకు ఎప్పుడో అర్పించారు . కానీ కంప్యూటరైజేషన్ తో ఆగని వృద్ధి నెమ్మదిగా ,రొబోటిజం వైపు అడుగులు
వేస్తోంది . ఉద్యోగాలు తగ్గే పరిస్థితి ఇప్పటికే ఎక్కువగా కనిపిస్తోంది . అదే సమయంలో పూజ ,జప, దాన,యజ్ఞ
కార్యకలాపాలు పెరుగుతున్నాయి . కానీ రెండు ,మూడు తరాలుగా వేదాన్ని వదిలినవారు ,పిల్లలను మళ్ళీ అటు
వైపు మళ్లి0చ గలరా ?పిల్లలే వారిని, మీరు నేర్చుకోలేదు కదా అంటే సమాధానం లేదు . ఈ పరిస్థితులకు కారణం
సినిమా కాదా ?yes or no ?