12, డిసెంబర్ 2013, గురువారం

ధరణి


ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః
భూమాత 

            అమ్మ లందరికి అమ్మ.ముగ్గురమ్మల సాకార రూపం ధరణి . చర్మ చక్షువుకు కనిపించే తల్లిదండ్రులు,సూర్య
నారాయణ మూర్తి,భూమాత.శరీరానికి శారీరిక తల్లి,దండ్రులలాగే,జగత్తుకు కనిపించే[కనిపెంచే]తల్లి,దండ్రులు.అందు
 వల్లనే,మనం, నిద్రనుండి లేచిన వెంటనే,భూమిమీద కాలు మోపేముందు,అమ్మను'పాద స్పర్శంక్షమస్వమే'అని
ప్రార్ధిస్తాము.సూర్యోదయానికి ముందు లేచి ,సూర్యునికి కృతజ్ఞతతో ,నమస్కరిస్తాము. మనకు ప్రాణాధారమైన
ఆక్సిజన్ ,శ్రీమన్నారాయణుడైన సూర్యుని నుండి మాత్రమే మనకు లభిస్తుంది. అంటే పోషణ కర్త తండ్రి. కన్నతల్లి
పది మాసాలు మోస్తే ,పుడమి తల్లి పది ,పదులు ,వంద సంవత్సరాలు మోస్తుంది . ఒక్క జన్మకే కాదు ,ఎన్ని జన్మ
లైనా ,అన్ని యుగాల్లోను జగత్తుకు ,వీరే తల్లి దండ్రులు.పుడమి మీది, చరాచర జీవులన్నీ సూర్యుని ఆధారంగానే
జీవిస్తున్నాయి . మళ్లీ వీరియందే లయ మౌతున్నాయి.అందు వల్లనే, పితృ కర్మలో మొదటి తరం భూమికి 'వసు'
రూపం గాను ,దాని పై తరం ఆదిత్యుని యందు ,దాని పై తరం,బ్రహ్మ యందు లయమైనట్లు మనకు మంత్రాల
ద్వారా తెలుస్తుంది.

             శరీరానికున్న మూడు ఉపాధులలో, మనం భూమిని కారణ శరీరంతో పోల్చవచ్చు. జీవికి జన్మకు,కర్మాను
సారం లభించే ఏ శరీరం అయినా కారణ శరీరం మీద ఆధార పడుతుంది.శరీరం ఏదైనా అజ్ఞానమే కారణం. అందువల్ల
నిద్రలోజీవులన్నీ ఉండేది కారణ శరీరంలో మాత్రమే. కానీ తిరిగి జాగ్రదవస్థకు కావలసిన శక్తి మాత్రం,గుణాతీతమైన ,
మాయా స్వరూపమే అయిన,అమ్మ స్వరూపమైన నిద్రనుండి[chargeఅయినట్లు] శక్తిని పొంది ,తిరిగి దానిని తన
గమ్యానికి చేరడానికి మనకు పరమేశ్వరుడు అనుగ్రహించినా,దారి తెలియని పాంధుని వలె మనం,సంసారారణ్యంలో
తిరుగాడు తున్నాము.దారి చూపే దైవరూపం గురు స్వరూపం. వారి చేతిలోని దీపమే జ్ఞానం. వెలుగుకు ఉపాధి
బేధం లేదు. అన్నినెయ్యి,నూనె ,కిరోసిన్,ఇలా ఏ దీపమైనా వెలుగు సమానం. మనం దీపానికున్న బాహ్య ఉపాధి,
బేధాలను,అలాగే దానిని మనకు చూపే గురు స్వరూప ఉపాధి బేధాలను ,చూస్తున్నాము గానీ,నిజానికి వారు
చూపే వెలుగుకు ,ఈ కారణాలను తెరలాగా కళ్ళకడ్డుగా పెట్టుకుని,ఏమీ కనిపించడం లేదని,గురువుపై నింద మోపు
తాము. కానీ ఈ తెరను మాత్రం గురువు గానీ,దైవంగానీ అంత సులభంగా తొలగించరు. వారికి దయలేక కాదు.
ఎన్నోజన్మలలో వారు ఈ విషయంలో సహాయం చేస్తూనే వస్తున్నారు.కానీ మనం దాన్ని గుర్తు పట్టకుండావారిని
కించపరిచే విధానాలను అవలింబిస్తూనే ఉన్నాము. వారి చేతిలో ఉన్న దీపానికి ఆధారం శాస్త్రం. దాని సూచన
మేరకు ఇలా ఉండండి, అని వారు చెప్పినా,వేరేవారేవరికో వారి గురువు అలా చెప్పలేదని,పైకి చెప్పక పోయినా
సందేహం ఎప్పుడు ఏర్పడిందో,అప్పుడే మళ్లీ మీరు ,మీకే తెర వేసుకుంటున్నారు. అందువలన సాధనలో పురో-
భివృద్ధి కుంటుతూ ఉంటుంది. ఎవరెవరి కర్మల ద్వారా వారికి తగిన ఉపాధి పొందినట్లే,వేరైన సాధనా మార్గాలకు
అంతే అవసరం ఉంటుంది. దీనిని గుర్తించి, మారుమాట లేకుండా ,గురు ఉపదేసానుసారం జీవించ వలసిందే.
అమ్మ ఒడి నుండి ఎప్పుడూ పరబ్రహ్మ స్వరూపంగా వెలిగే మార్గం ఇదొక్కటే.

           కారణ శరీరం, స్వరూపమైన నిద్రనుండి శక్తి పొందినట్లు ,జీవులన్నీ భూమాత నుండి ఆహారం పొంది ,శక్తిని
పొందుతున్నాయి. ఓంకార స్వరూపం లోని 'అ ఉ మ'లో మ అనేది కారణ శరీరాన్ని సూచిస్తుంది. ఉ అనేది సూక్ష్మ
శరీరాన్ని సూచిస్తుంది. అ అనేది స్థూల శరీరాన్ని సూచిస్తుంది. అర్ధ మాత్ర పరిపూర్ణ గురు స్వరూపమే. దీని
సహాయం లేకుంటే అసంపూర్ణమే. విలువ తెలిసిన క్షణం ,తెర తొలగుతుంది.

        కృతజ్ఞత. దీనిని పాటించడమే గొప్ప సాధన. దీని మరో రూపమే భక్తి. ఎప్పుడూ కృతజ్ఞతా భావాన్ని మీరక
చరించడమే,శ్రద్ధ. ఎన్నో వికల్పాలు మనసును కుదిపినా,మాతృ దేవోభవ,పితృదేవోభవ,ఆచార్య దేవోభవ,అనే
సూత్రాలు, ఇంకా హిందు సమాజంలో మిగిలి ఉన్నందు వల్లనే ,తనపై పడే ఎన్నో దురాచారాలను,దుర్మార్గాలను
ఈసమాజం తట్టుకుని నిలబడుతున్నది. ఇపుడున్న ఈ విపరీత ధోరణులను ,అధిగమిం చాలంటే ఒక్కటే సాధన
అవసరం. అదే కృతజ్ఞతా ఆవిష్కారం. పెద్దలు వారి ప్రతి అనుభవాన్ని,పిల్లలకు కృతజ్ఞత తెలిసేలా,చెయ్యగలిగితే,
అది మనం ఈ సమాజానికి తెలిపే గొప్పకృతజ్ఞతా సూచక మౌతుంది.

         శ్రీ రాముడు ధర్మావతారమై నడయాడినందున,భూమిపై నరునిగా ,మాతృ గర్భం నుండి ఆవిర్భవించి,నరుని
వలెనే కష్ట,నష్టాలను,ధర్మానికి వికల్పం కలగకుండా అధిగమించి,మానవ జీవిత విధానాన్ని ఆవిష్కరించి,ఆదర్శ
మూర్తిగా నిలచిన వైనం మనకు తెలిసిందే.సీతమ్మ తల్లి మాత్రం అయోనిజయై,ఆధ్యాత్మిక పరమైన ఎన్నోఅంశాలను
తన ఆవిర్భావంతోమనకు అందించింది.జీవి కర్మానుసారం,భూమిపై నరునిగావచ్చినాజీవులనుఆవరించే మాయకు
కర్మ బంధం లేకపోవడాన్ని,అమ్మ అయోనిజయై తెలియ చేస్తున్నది. ధర్మాన్ని ఆలంబనగా జీవించేవారికి ఎంతో
సహకారాన్నిస్తుంది. అహంకార వశవర్తి అయిన దశాననునికి [దశేమ్ ద్రియాలు ,బుద్ధి ప్రచోదనంతో కాక,అహము,
మనసును అనుసరించి చరించే వానికి]మృత్యువై ,దైవ శాసనాన్ని నిరూపిస్తుంది. బుద్ధి ప్రచోదనంతో పరమాత్మను
తమ హృదయంలో,ఆవిష్కరించే బుద్ధిశాలికి,మార్గ దర్శనం చేస్తుంది.మాయగా దశాననుకి,మార్గదర్శిగా ఆంజ
నేయునికి,తానే పరబ్రహ్మగా తెలిసినా ,తనలో తాను రమించినా,బాహ్యాచరణలో,కించిత్తు కూడా ధర్మ విరుద్ధంకాని
 జీవనశైలి కలిగిన ,మానవునికి మోక్ష లక్ష్మిగా అనుగ్రహిస్తుంది.

        ఈమె భూ పుత్రిగా తనను తాను ఆవిష్కరించు కున్నది. కారణ శరీరమే మాయకు,పుట్టినిల్లు. కానీ జానకిగా
జనకుని తండ్రిగా స్వీకరించిందేకాని వారికేమి కాదు.ఒక శరీర పర్యంతంగా ఇలా నిరూపించినా,సాధారణ ప్రపంచంలో
మనకంటికి ,కనిపించే దిశగా ఆలోచిస్తే,ఆడపిల్లలు పృధ్వీ రూపమైన తల్లి నుండి ఉద్భవించినా,కన్యదానంతో మెట్టినింటికి
పరిమితమై,తల్లిదండ్రుల గౌరవానికి భంగం వాటిల్లకుండా,ఈ అమ్మాయిని ఎంతబాగా పెంచారనే కీర్తిని ఇవ్వగలరు. మెట్టినింట్లో భర్తను,దశాననునిగా గాని,దశరధ రామునిగా కానీ,నిరూపించడం మనకు తెలిసిందే. సగ భాగమిచ్చిన భర్తకు,మాయగా పరిభ్రమింపజేసినా,తనపై తాను పట్టు సాధించి,ధర్మార్ధ కామ,మోక్షాలకు కారణమైన,సహ ధర్మచారిణిగా,తాను తరిస్తూ,అత్త ,మామ,భర్తలకు సహకారాన్నిచ్చి,కోతుల్లా ఉన్న పిల్లల మనసులకు,మార్గదర్శనం చేసి తరించేలా, ఆడపిల్లలు పుట్టినింట్లో,దిద్దబడతారని ఆశిద్దాం.