23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

శ్రీ వల్లభేశాయ నమః.శివాయ గురవే నమః.శ్రీ మాత్రే నమః.శ్రీ విష్ణు రూపాయ నమశివాయ.శ్రీ గురుగుహాయ షణ్ముఖాయ నమః.
గురువు పరసువేది లాంటి వారు.జీవి తన పాప కర్మలను పరమాత్మ సేవతో తొలగించుకున్నపుడు ,కర్తృత్వ భావం
తొలగి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలనే తపన ఏర్పడుతుంది. పాప ప్రభావం తగ్గితే, ఇనుముకు తుప్పు
లేకుండా చేసినపుడు అయస్కాతం చేత ఆకర్షించ బడినట్లు ,గురువు పట్ల శ్రద్ధ ఏర్పడుతుంది. అంతవరకూ గురువు
పక్కనే ఉన్నాఆయన కృపకు పాత్రుడు కాలేడు . ఎపుడు చిత్తశుద్ధి కలుగుతుందో , అపుడు తప్పక గురువు , పరమాత్మ యొక్క రూపమైన ,జీవ బ్రహ్మైక్యాన్ని తెలియజేసినపుడు ,జీవి అహం బ్రహ్మాస్మి అని జ్ఞానాన్ని కలిగి , క్రమంగా ఆత్మనిష్ఠను పొందుతాడు. పరశువేది ఇనుమును బంగారం చేసినట్లే ,గురువు స్వానుభవమైన అహం బ్రహస్మి అనే అనుభవాన్ని ,శిష్యునికి తత్వమసి మహావాక్యంగా అందిస్తారు. దీనితో జీవత్వ బ్రాంతి నశించి శిష్యుడు
ఈశావాస్యం ఇదం సర్వమ్ అని తనలోనే మునిగిపోతాడు.