23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

హిందూ ఆచార పరమార్ధాలు

   హిందూ  ఆచార పరమార్ధాలు.
హిందూ ధర్మ పరిధిని కాపాడుతూ ,ధర్మ పతాకాన్ని ఎగురవేసే బాధ్యత ,ఎక్కువగా స్త్రీలమీద ఆధార పడింది .
అమ్మగా అబ్బాయిలకు ,అమ్మాయిలకు కూడా వారి ధర్మాలను కాపాడుకునేలా చేసే బాధ్యత తల్లిదే . ఎందువల్లనంటే మగవారిని బయట పనులకు పంపి ,ఇంటి బాధ్యతను ఇల్లాలికి ,మన ధర్మం అప్పజెప్పింది . నాజూకుగా ఉండే పువ్వులను ఎండలో ఉంచము కదా . ప్రస్తుతానికి నేను వ్రాయబోయే విషయానికి ఇది చాలు .
 అన్నిటికి తాత్వికార్ధం మాత్రమే వ్రాస్తున్నాను .
1. స్త్రీ కంటే వయసులో పెద్దవారికి ఇచ్చి కన్యా దానం చెయ్యాలి . ఎందుకు ?
శక్తి స్త్రీ . అది కలిగినవాడు శివుడు . సృష్టిలో స్త్రీ శక్తికి ,పురుషుడు శివునికి సంకేతం . నిరాకార చైతన్య శివుని నుండి కదలి సృష్టిలో స్త్రీగా ప్రకృతి వచ్చింది . అంటే ఆద్యుడు పురుషుడు . అందువలన వయసులో కొంత పెద్ద అనేది గ్రహించాలి . కనుక ఆడ పిల్లలకు బొట్టు పెడతారు . అంటే ఆమె పుడుతూనే సుమంగళి . అందుకే ఒకవేళ ,[అమంగళము ప్రతిహత మగుగాక ]భర్తని కోల్పోతే కుంకుమ పెట్టుకోరు . కానీ ఎంతమంది సువాసినులు కుంకుమ
ధరిస్తున్నారో వారికి వందనాలు . ఎర్ర స్టిక్కర్లు కాదు .
2. సువాసినిలు పూజలు ,నోములు నోచినపుడు కూడా కాళ్లకు పసుపు రాసుకోరు.ఎవరికీ రాయరు . చేతికి
ఇస్తున్నారు .ఎందుకు ఆలా చెయ్యకూడదు ?
తమను తాము గౌరిగా నమ్మి, సుమంగళిని వాయనానికి ,పిలవడం అనేది వ్రతాలలో భాగం . పార్వతిగా నోములు . వ్రతాలు అన్నింటిని గౌరి దేవి మనకు పరిచయం చేసింది . అంటే ఆమె కన్యాదానం చేయబడినది . మనకు విష్ణువు
పార్వతి ,పరమేశ్వర కళ్యాణం చేస్తున్న ఫోటోలు చూస్తూనే ఉంటాము . అంటే అమ్మవారికి పుట్టిల్లు ,అన్నగాని , తమ్ముడు కానీ విష్ణు రూపుడే . పీత [పసుపు]రంగు వస్త్రాలను విష్ణువు ధరిస్తాడు . అంతే కాదు ,ధర్మానికి ప్రతీక
అయిన నంది యొక్క కొమ్ము ,భూమి మీద పసుపు కొమ్ముగా మారిందని ఐతిహ్యం . బృహస్పతి కూడా పసుపు
వర్ణం గుర్తు . అంటే ధర్మ రక్షణ చేసే స్త్రీలకు గురు అనుగ్రహం కలుగుతుంది .ఇది మాంగల్య బలానికి ఎంతో అవసరం  తాత్పర్యం ,పుట్టింటినుంచి తన అనుబంధానికి గుర్తుగా అమ్మాయి ,పసుపు ,కుంకుమ తీసుకు వస్తుంది . అంతే కాదు ఇక్కడికి [అత్తవారింటికి]  వచ్చాక సింహద్వారానికి  రాస్తుంది . అనుబంధాలు అక్కడ వరకేనని తాను దానం చేయబడి ,ఈ ఇంటికే వన్నె తెస్తాననే భావం ,అందులో ఉంది . దీనికి ఎవరికి వారు కట్టుబడి ఉన్నామా ?అని
ఆత్మ విమర్శ చేసుకోవాలి . విషయానికి వస్తే ,పసుపుతో తయారైన తోపు ఎఱుపు కుంకుమ ,ఐదవతనానికి గుర్తు .
సరే ,సుమంగళి అయిన స్త్రీ ,శివ శక్తుల కలయిక అయిన శ్రీ చక్ర బిందు రూపిణి . గౌరీ పరదేవత . రాహు గ్రహ అధి
దేవత .అంతే కాదు అమ్మవారిని చూచినపుడు ముఖపద్మం నుండి పాదాలవరకు చూడాలి . విష్ణువు లలితా ప్రతి రూపముగాను ,శివుడు ,విష్ణువు అర్ధ నారీశ్వరుడైన ,హరిహర మూర్తిగాను మనకు తెలుసు . విష్ణువును చూచి నపుడు పాదాలనుండి ,కిరీటం వరకు చూడడం పరిపాటి . అర్ధ నారీశ్వరుడైన పరమాత్మ సృష్టిలో,స్త్రీ ,పుం
రూపాలతో ప్రకాశించినపుడు ,ఆకాశ రూపంలో అంతటా ఉన్న విష్ణువే స్థితి కారుడై ,ప్రకాశిస్తున్నాడు . అంటే
విష్ణు రూపం వర్తమానం కనుక ,సృష్టిగా కనిపిస్తున్న ప్రకృతికి ,శివుని నుండి లీలగా ప్రపంచ రూపంలో కనిపిస్తున్న
విష్ణు ,గౌరీ రూపాలకు ,ఒకేసారి నమస్కరిస్తూ ,నుదుట బొట్టుపెట్టి అమ్మవారిని ,మెడకు గంధం వ్రాసి శివుని ,
అలానే పాదాలకు పసుపురాసి విష్ణువును పూజిస్తున్నామన్నమాట . ఇంత అర్ధవంతమైనది ,మనసంప్రదాయం .









19, సెప్టెంబర్ 2016, సోమవారం

దృశ్యం

దృశ్యం .
దృశ్యం అనేది మనసుమీద చాలా ప్రతిభావంతంగా పనిచేస్తుంది .అలా సమాజం మీద చాలా ప్రభావం చూపింది
సినిమా .దీనివలన సంఘంలో ఎక్కువగా నాశనమైనది హిందువుల ఆచార ,సంప్రదాయాలే . దేవాలయాలు ,
కుటుంబాలు ,వారసత్వ పూజా విధానాలు ,ఎంతో ఉన్నతమైన తల్లి ,తండ్రుల న్యాయ సమ్మతమైన హక్కు ఐన
పిల్లల వివాహ విషయాలు అన్నీ,దౌర్భాగ్యపు అవలక్షణాలు సినిమా వలన అంటే ఆశ్చర్యం ఏమిలేదు . ముఖ్యంగా
బ్రాహ్మణ సమాజం తన విలువలను ,వినోదం అనే చిన్న కారణంతో పోగుట్టుకుని ,అందరిచేత దూషించ బడుతొంది .
ప్రతివారికి అవసరమైన పూజ ,జప ,యజ్ఞ కార్యక్రమాలకు వీరిని ఉపయోగించు కుంటున్న సమాజం ,వినోదానికి
బలి అయిన వీరిని చిన్నచూపు చూస్తున్నది . ఎన్నో పురోహిత కుటుంబాలు తమ వృత్తిని కాదని పిల్లలను ఉద్యోగాలకు ఎప్పుడో అర్పించారు . కానీ కంప్యూటరైజేషన్ తో ఆగని వృద్ధి నెమ్మదిగా ,రొబోటిజం వైపు అడుగులు
వేస్తోంది . ఉద్యోగాలు తగ్గే పరిస్థితి ఇప్పటికే ఎక్కువగా కనిపిస్తోంది . అదే సమయంలో పూజ ,జప, దాన,యజ్ఞ
కార్యకలాపాలు పెరుగుతున్నాయి . కానీ రెండు ,మూడు తరాలుగా వేదాన్ని వదిలినవారు ,పిల్లలను మళ్ళీ అటు
వైపు మళ్లి0చ గలరా ?పిల్లలే వారిని, మీరు నేర్చుకోలేదు కదా అంటే సమాధానం లేదు . ఈ పరిస్థితులకు కారణం
సినిమా కాదా ?yes or no ?

15, సెప్టెంబర్ 2016, గురువారం

హిందూధర్మం

హిందూధర్మం ఎంతో సనాతనమై కోట్ల సంవత్సరాలుగా నిలిచి ఉన్నట్లు మనకు నిదర్శనాలున్నాయి . రాముని కాలంనాటి ఆనవాళ్లనిబట్టి చూచినా అర్థంచేసుకోవచ్చు . త్రేతాయుగం నమ్మితే ముందు సత్యయుగం ,హరిశ్చంద్ర
చరిత్ర ,భగీరథ చరిత్ర ,అంతరంగంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ,అని అలానే నిర్గుణ ,నిరాకార చైతన్య పరబ్రహ్మ
స్వరూపమైన తనను శివోహం అని గ్రహించినా ,ఆచరణ దశలో సత్య ధర్మాలను ఆలంబనగా జీవితాన్ని నడిపిన
తపస్సంపన్నుల కనుసన్నలలో  ఊపిరి పోసుకున్న చరిత్ర ,నాగరికత, పెద్దలు అందరూ చెపుతున్నట్లుగా జీవించే విధానం పేరు హిందూ ధర్మం .ఎంతో విస్తరించిన మహా వృక్షం నీడలో సేదతీరే సమాజం హిందువులది . ఎవరికైనా
సమృద్ధి ,సహజత్వం ,చూసినపుడు కలిగే ఈర్ష్య ,ద్వేషాలే హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు . ఇవే
మనకు పూర్వయుగాల్లో దశావతారాలను రప్పించిన రాక్షస ప్రవృత్తులు . కలిలో వివిధ మతాలుగా ,నాగరికతల
రూపంలో ఇప్పుడు కూడా అంతే ప్రభావం చూపిస్తున్నాయి . పులిని చూసి నక్క వాత అనేవే ఇతర మతాలు . కానీ
నక్కని చూసి పులి ఊళ లా ఉంది పరిస్థితి . ఎంతో కష్టపడి పెద్దలు అందించిన జీవిత విధానం వదులుకొని ,వెళ్లి
ఆకులు కట్టుకున్న ఆటవిక జాతుల నుంచి నేర్చుకునే కుహనా సంస్కారాలకు పెద్ద పీట వేసి ,వాళ్ళముందు
మేము కూడా చావుడప్పు వాయించగలం అని ,మృదంగ విద్వాంసుడు చెప్పినట్లు తయారయింది సమాజం .