15, డిసెంబర్ 2016, గురువారం

చాతుర్వర్ణం

చాతుర్వర్ణం
భగవద్గిత చెప్పిన 'చాతుర్వర్ణం మయా ప్రోక్తం'అన్నది భగవంతుడు . అయన చెప్పాడని వినాలని
చెప్పలేదు . శ్రేయో ,ప్రేయో మార్గాలు చూపించి ,ఎటైనా వెళ్ళవచ్చు అన్నాడు . ఒక తండ్రి మంచి ,
చెడు తెలియజేసి కూడా ,మంచిని గురించి మరోసారి హెచ్చరిక చేస్తాడు ,పిల్లల భవిష్యత్తు బాగుండాలని . అది ఒక తరం వరకు అర్ధంఔతుంది . కానీ కొడుకు దానిలో కొంత భాగాన్ని పట్టించుకోడు . అతను తాను పట్టుకున్నది కొంత చెప్తాడు . అలా అలా పోగా మిగిలింది కొన్ని
తరాల తరువాత ఎంత మిగులుతుంది . మొదటివారు చెప్పిన విషయం ఇప్పటి తరానికి అంతా అయోమయం .  LKG చదివే పిల్లలు పెద్ద చదువు చదువుతున్న వారిని
వారి సబ్జెక్టు గురించి ఎంత చెపితే అర్ధం చేసుకోగలరు . అది వారి పట్ల చిన్నచూపు కాదు , వేళాకోళము కాదు . అర్ధం చేసుకోడానికి తగినంత కృషి ,సమయము కావాలి అని చెప్పినా పిల్లలు
వినరు . ఒక చిన్న విషయానికే మనం చెప్పలేము సమాధానం . ఎంతో గహనమై ,జనన మరణ
చక్రాన్ని తప్పించే మార్గం ధర్మం .ధర్మాచరణ అంటే తరగతుల వారీగా క్లాసులకి వెళ్లి చదువుకోవాలి
అని చెప్పడం స్కూల్ యాజమాన్యం తప్పు అన్నట్లు ఉంది . ఏ తరగతి వారైనా పాస్ కావచ్చు .
పాస్ అవడానికి అన్ని క్లాసులకు అవకాశం ఉంది . స్కూల్ ఫస్ట్ ,ఏ క్లాసుకైనా రావచ్చు . దీనికి
ఫలానా క్లాస్ అనే నిబంధన లేదు . ఆలా ఒకరికి వస్తే స్కూల్లో అందరూ యాజమాన్యాన్ని మాకెందుకు రాలేదు అంటే సమాధానం ?ఇటువంటివే ఈ ప్రశ్నలన్నీ . పెద్దలు చెప్పిన మార్గంలో
ప్రయాణం చేసి గమ్యం సమానమని తెలియాలి . ఢిల్లీకి దేశం నాలుగు మూలల నుంచి ఉన్న మార్గాల్లో ప్రయాణించే వారికి తగిలే స్టేషన్లు వేరు . కానీ గమ్యం ఒకటే . బాగా అధ్యయనం చేస్తే
సమాధానాలు పొందవచ్చు . కానిదంతా కాపీ పేస్ట్ . ఎందుకూ పనికిరాదు .
ఎవరైనా ఒక ఆఫిసు లో అన్ని స్థాయిల ఉద్యోగులను నియమిస్తారు . దీనిలో యాజమాన్యానికి
తగిన వారు అవసరం . నోటిఫికేషన్ ఇచ్చారు.  కుప్పలు ,తెప్పలుగా అప్లికేషన్లు వచ్చాయి . దీనిలో
క్రీంది స్థాయి ఉద్యోగులు మీ నోటిఫికేషన్ తప్పు ,పై స్థాయి ఉద్యోగులకు అంత జీతం ,మిగిలిన వారికి
తక్కువ ఇస్తే ఉరుకోము అంటే అది న్యాయ పరమైన తప్పా ?సృష్టిలో ఉన్న తారతమ్యాలకు ,కర్మ
కారణం భగవంతుడు కాదు . అహం ,మమ అనేవి విడిచిన క్షణం ,జీవుడు దేవుడే . దీనికి వర్ణ వ్యవస్థ అడ్డురాదు. రాత్రి నిద్రలో ఎవరైనా బాస్ అని కలకనవచ్చు . ఎవరూ అడ్డు పడరు . కానీ ఇలలో కష్ట పడితేనే సాధ్యం .అదికూడా బాల్యం నుంచే . ప్రతి పాఠం ,ప్రతి క్లాస్ ఉపయోగ పడేదే . అప్పుడు
చదవక ,ఎవరో చదవకుండా ,అంబానీ అయ్యాడు అని ,చదువు ఎగ్గొట్టి ,రోడ్లు ఊడిచే ఉద్యోగానికి
కూడా'Q'లో నుంచున్నవారిని గమనించాలి . ఎవరిది తప్పు ?పెద్దలు చెప్పేదానిని వక్రంగా చిత్రించి ,
వాదించడం సులువే . పాటించి చక్కని గమ్యం చేరాలి . ఒకే తెలుపు భ్రమణంలో ,సప్త వర్ణాలైనట్లే ,ఒకే పరతత్వం సృష్టి చక్రంలో వివిధంగా భాసిస్తోంది . 
కులము అని చెప్పగానే భుజాలు తడుముకునే వారు ఎక్కువైపోయారు . కులము అంటే సమూహము . మనం తీసుకునే కులము కాదు భగవంతుడు చెప్పినది . గమ్యాలు వేరుగా జీవించిన జీవులు వారి గమ్యాలను చేరడానికి ,మళ్ళీ ,పునర్జన్మ పొందుతారు . వారి సంస్కారాల
అనుగుణంగా చెప్పబడినవే కులాలు . ఈ జన్మలో నేను వేదాలు చదివితే ,బ్రాహ్మణ్ణి ,వ్యాపారం చేస్తే
వైస్యుణ్ణి ,సైన్యంలో చేరితే ,లేదా రాజకీయాల్లో ఉంటేనే ,క్షత్రియుణ్ణి , శ్రమ చేసినంత మాత్రాన సూద్రుణ్ణి అనికాదు . గుణ ,కర్మ విభాగయో . ఇది సూత్రం . పూర్వ జన్మలో ఏ గుణాన్ని ఆశ్రయించి
కర్మ చేయబడిందో ,దాన్నిబట్టి ,ఇపుడు జన్మ ప్రాప్తమైనది . ఇపుడు ఆ గుణాన్ని గమనించి ,తమో గుణం నుండి రజో గుణానికి ,దానినుండి సత్వానికి ప్రయాణించాలి . ఏ విధమైన కట్టుబాటుకు లొంగని ,మనసు ఎలాచెపితే అలా తనకు నచ్చినట్లు ప్రవర్తించేదే తమోగుణం . ఈగుణాన్ని ఆశ్రయించిన జనులు , సూద్రుల ఇంట జనించి ,తమలోని లోపాన్ని తమజన్మ ద్వారా గ్రహించి ఉత్తమమైన లక్షణాలను గ్రహించినా ,వారి ఆశ్రమ కులవృత్తులను స్వీకరించి ,ఎవరితోను కులాల గురించి తర్కించక ,పరమాత్మను చేరినవారు మనకు తెలుసు . కుండలు చేసినంత మాత్రాన తుకారాం కించ పడలేదు . రాజు వచ్చినా ,గురు తుల్యుడైన బ్రాహ్మణ్ణి చూసినా తల వంచను అనలేదు . అప్పటి సామజిక స్థితి గతులలో ఎలా వారి పెద్దలు నడిచారో అలానే నడిచి పరమాత్మను చేరాడు . ముఖ్యంగా కుల విభాగము పరమాత్మను చేరే సోపానం అని గమనించాలి .
దీన్ని సామాజికాంశం అనుకోవడం తప్పు . పరమాత్మను చేరడానికి తనుఉన్న చోటినుంచి ప్రయాణం మొదలు పెట్టాలి . దీనికి మాత్రమే కులాచారాలు ప్రవర్తిస్తాయి .బేధం చూస్తూ ఉంటే
సమయం వ్యర్థం అవుతుంది . నిజానికి విశ్వామిత్రుని కంటే పెద్ద ఉదాహరణ దీనికి లేదు . వసిష్ఠుని
నుండి పొందిన గాయత్రి మంత్రం ,ఇపుడు విశ్వామిత్రుని ద్వారా అతనినే ఋషిగా చెప్తున్నది .
క్షత్రియునిగా ,రాముడైనా ,గొల్లవాడైనా కృష్ణుణ్ణి ,పూజించని బ్రాహ్మడు మనకు కనిపించడు . కానీ
అవతార మూర్తులైనా ,వారి కాలంలోని బ్రాహ్మణులను ,గురువులను ,రామ ,కృష్ణులు కూడా గౌరవించి ,దీవెనలు పొందారు . సారాంశంగా వాదనలకు దిగక సాధన సాగించి ,గమ్యం చేరాలి . వారి గమ్యానికి తుకారాం ,నామదేవుడు ,సక్కుబాయి ,మీరా నామాన్ని జపించారు . కానీ అలాగే
సంధ్యావందనాది నిత్యకర్మలు విడిచి ,బ్రాహ్మణ సమాజం నామం చేస్తే చాలు అని పరమాత్మ వాణి
కాదు . ఎవరికి శాస్త్రం ఏ విహిత కర్మను నిర్దేశించిందో అదే వారు చేయాలి . సకాల సంధ్యావందనాది
క్రియలు మాని ,ఏ బ్రాహ్మడు తరించడు . ఎంత వేదాంతం విన్నా, తన నిత్యకర్మ తప్పదు .అది
మానాలంటే సన్యసించక తప్పదు . గృహస్థాశ్రమంలో ఉండి కర్మను త్యజించినవారు ,మరల జన్మకు
ఉపాసన కోల్పోయి ,మళ్ళీ ఉపనయన సంస్కారార్హత లేనియింట జన్మిస్తారు . కానీ ఇప్పుడు ఉపనయనార్హత లేనివారు ,వేదాలు వల్లించాలనే తపనతో వారి ధర్మాన్ని విడిచి పరధర్మాన్ని ఆశ్రయించిన వారవుతారు . కనుక శాస్త్రవిహిత కర్మను గౌరవించడం కర్తవ్యం .