18, అక్టోబర్ 2015, ఆదివారం

శ్రీ మాత్రే నమః

శ్రీ మాత్రే నమః 
 
           సకల సృష్టి పరమాత్మ స్వరూపమే . సృష్టికి ముందు ,యందు ,విందు కూడా పరమాత్మలోనివే . ముందు భూతకాలం . యందు ,వర్తమానం . సమర్పణగా కూడా విందు పరమాత్మకే . నన్ను నీలో కలుపుకో, ఇదే మోక్షం .
సద్రూపం  మాత్రమే ఆధారం . అంటే ఉనికి అనేదే పై మూడింటికి ఆధారం . దీన్ని విడిచి జీవితం లేదు . 
      ఇదే  మనకు, వేద మతం  ఇచ్చిన కుటుంబ వ్యవస్థ . దీన్ని విడిస్తే నేల విడిచి సాము చేసినట్లే . పరమాత్మ నిండి 
ఉండకపోతే సృష్టి నిలబడడం అసాధ్యం . అలానే శరీరం పడిపోయే వరకు తల్లి దండ్రులతో ఉండడం ,మన జీవన శైలిగా 
మనకు అందించారు పెద్దలు . సాధక బాధకాలు ఎన్ని ఉన్నా ఈ విషయంపై అవగాహన చాలా అవసరం .
      ఒకే శరీరంలో విడి విడి భాగాలూ కలిసి ఉన్నాయి . అన్నీ వేరే వేరే పనులు నిర్వహిస్తూ మనకు ఈ విషయాన్నే 
తెలియజేస్తున్నాయి . ఉనికి శివుడు ,చైతన్యం అమ్మవారు ,శరీరం వినాయకుడు , జీవుడు కుమారస్వామి . అందరూ 
ఉన్న ఉమ్మడి కుటుంబం ఈ శరీరం ,పిల్లలు వచ్చారని సచ్చితానంద స్వరూప ఘన పరమాత్మ ,శరీరాన్ని జీవుడిని 
విడిచి పోలేదు . సరిగ్గా గుర్తు పట్టాలి . శ్రీ శివ కుటుంబిన్యై నమః .