23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

హిందూ ఆచార పరమార్ధాలు

   హిందూ  ఆచార పరమార్ధాలు.
హిందూ ధర్మ పరిధిని కాపాడుతూ ,ధర్మ పతాకాన్ని ఎగురవేసే బాధ్యత ,ఎక్కువగా స్త్రీలమీద ఆధార పడింది .
అమ్మగా అబ్బాయిలకు ,అమ్మాయిలకు కూడా వారి ధర్మాలను కాపాడుకునేలా చేసే బాధ్యత తల్లిదే . ఎందువల్లనంటే మగవారిని బయట పనులకు పంపి ,ఇంటి బాధ్యతను ఇల్లాలికి ,మన ధర్మం అప్పజెప్పింది . నాజూకుగా ఉండే పువ్వులను ఎండలో ఉంచము కదా . ప్రస్తుతానికి నేను వ్రాయబోయే విషయానికి ఇది చాలు .
 అన్నిటికి తాత్వికార్ధం మాత్రమే వ్రాస్తున్నాను .
1. స్త్రీ కంటే వయసులో పెద్దవారికి ఇచ్చి కన్యా దానం చెయ్యాలి . ఎందుకు ?
శక్తి స్త్రీ . అది కలిగినవాడు శివుడు . సృష్టిలో స్త్రీ శక్తికి ,పురుషుడు శివునికి సంకేతం . నిరాకార చైతన్య శివుని నుండి కదలి సృష్టిలో స్త్రీగా ప్రకృతి వచ్చింది . అంటే ఆద్యుడు పురుషుడు . అందువలన వయసులో కొంత పెద్ద అనేది గ్రహించాలి . కనుక ఆడ పిల్లలకు బొట్టు పెడతారు . అంటే ఆమె పుడుతూనే సుమంగళి . అందుకే ఒకవేళ ,[అమంగళము ప్రతిహత మగుగాక ]భర్తని కోల్పోతే కుంకుమ పెట్టుకోరు . కానీ ఎంతమంది సువాసినులు కుంకుమ
ధరిస్తున్నారో వారికి వందనాలు . ఎర్ర స్టిక్కర్లు కాదు .
2. సువాసినిలు పూజలు ,నోములు నోచినపుడు కూడా కాళ్లకు పసుపు రాసుకోరు.ఎవరికీ రాయరు . చేతికి
ఇస్తున్నారు .ఎందుకు ఆలా చెయ్యకూడదు ?
తమను తాము గౌరిగా నమ్మి, సుమంగళిని వాయనానికి ,పిలవడం అనేది వ్రతాలలో భాగం . పార్వతిగా నోములు . వ్రతాలు అన్నింటిని గౌరి దేవి మనకు పరిచయం చేసింది . అంటే ఆమె కన్యాదానం చేయబడినది . మనకు విష్ణువు
పార్వతి ,పరమేశ్వర కళ్యాణం చేస్తున్న ఫోటోలు చూస్తూనే ఉంటాము . అంటే అమ్మవారికి పుట్టిల్లు ,అన్నగాని , తమ్ముడు కానీ విష్ణు రూపుడే . పీత [పసుపు]రంగు వస్త్రాలను విష్ణువు ధరిస్తాడు . అంతే కాదు ,ధర్మానికి ప్రతీక
అయిన నంది యొక్క కొమ్ము ,భూమి మీద పసుపు కొమ్ముగా మారిందని ఐతిహ్యం . బృహస్పతి కూడా పసుపు
వర్ణం గుర్తు . అంటే ధర్మ రక్షణ చేసే స్త్రీలకు గురు అనుగ్రహం కలుగుతుంది .ఇది మాంగల్య బలానికి ఎంతో అవసరం  తాత్పర్యం ,పుట్టింటినుంచి తన అనుబంధానికి గుర్తుగా అమ్మాయి ,పసుపు ,కుంకుమ తీసుకు వస్తుంది . అంతే కాదు ఇక్కడికి [అత్తవారింటికి]  వచ్చాక సింహద్వారానికి  రాస్తుంది . అనుబంధాలు అక్కడ వరకేనని తాను దానం చేయబడి ,ఈ ఇంటికే వన్నె తెస్తాననే భావం ,అందులో ఉంది . దీనికి ఎవరికి వారు కట్టుబడి ఉన్నామా ?అని
ఆత్మ విమర్శ చేసుకోవాలి . విషయానికి వస్తే ,పసుపుతో తయారైన తోపు ఎఱుపు కుంకుమ ,ఐదవతనానికి గుర్తు .
సరే ,సుమంగళి అయిన స్త్రీ ,శివ శక్తుల కలయిక అయిన శ్రీ చక్ర బిందు రూపిణి . గౌరీ పరదేవత . రాహు గ్రహ అధి
దేవత .అంతే కాదు అమ్మవారిని చూచినపుడు ముఖపద్మం నుండి పాదాలవరకు చూడాలి . విష్ణువు లలితా ప్రతి రూపముగాను ,శివుడు ,విష్ణువు అర్ధ నారీశ్వరుడైన ,హరిహర మూర్తిగాను మనకు తెలుసు . విష్ణువును చూచి నపుడు పాదాలనుండి ,కిరీటం వరకు చూడడం పరిపాటి . అర్ధ నారీశ్వరుడైన పరమాత్మ సృష్టిలో,స్త్రీ ,పుం
రూపాలతో ప్రకాశించినపుడు ,ఆకాశ రూపంలో అంతటా ఉన్న విష్ణువే స్థితి కారుడై ,ప్రకాశిస్తున్నాడు . అంటే
విష్ణు రూపం వర్తమానం కనుక ,సృష్టిగా కనిపిస్తున్న ప్రకృతికి ,శివుని నుండి లీలగా ప్రపంచ రూపంలో కనిపిస్తున్న
విష్ణు ,గౌరీ రూపాలకు ,ఒకేసారి నమస్కరిస్తూ ,నుదుట బొట్టుపెట్టి అమ్మవారిని ,మెడకు గంధం వ్రాసి శివుని ,
అలానే పాదాలకు పసుపురాసి విష్ణువును పూజిస్తున్నామన్నమాట . ఇంత అర్ధవంతమైనది ,మనసంప్రదాయం .