6, జులై 2016, బుధవారం

వరాలు ,శాపాలు .

      వరాలు ,శాపాలు .
మనం పొందే సుకృత ఫలాన్ని ,వరమని ,దుష్కృత ఫలాన్ని శాపమని ప్రస్తుత జన్మలో పొందుతాము . ఇది అనివార్యము .
అలానే ఇబ్బందులు కలిగినపుడు జాతకాన్ని పరిశీలించి ,వాటికి పరిహారాన్ని చేయించుకోవడం పరిపాటి. కాలసర్ప దోషాలు 
పితృ దోషాలు ,ఇలా రకరకాలు ,వాటి పరిహారాలు అందరికి తెలిసినదే . వంశంలో తరతరాలు ఆస్తిలా అనుభవించే దోషాలు
ఉంటాయి . ముందు తారాలలో జరిగిన పొరపాట్లకు ,తరువాతి తరంలో ఇబ్బందులు తప్పవు . దీనికి ఉదాహరణయే
భగీరథ చరిత్ర .దీనికి భగీరధుడు ఎందుకు తపించాలి ?హాయిగా జీవితాన్ని అనుభవించ లేకనా ?దీన్ని కృతజ్ఞత అంటారు .
 రాబోయే తరాలపట్ల దయ . అందువల్లనే కదా రాముడు ఆ వంశంలో కలిగాడు . మన విషయాలకు వస్తే ,నాస్తిక వాదం
పేరుతోనో ,అశ్రద్ధ చేతనో ,నా కర్మ ఇంతే అనే నిరాశతోనో ,జీవితాన్ని అలానే గడిపెయ్యవచ్చు . కానీ ఎప్పుడో పెద్దలు చేసిన
దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం . అనేదానిలోని సాధక బాధకాలు ఒకసారి చూద్దాం . సర్వసాక్షి అయిన పరమాత్మ
అంతరంగం నుండి అన్ని పాపపుణ్యాలు లెక్క కట్టి నూతన జన్మను ఇస్తాడు . జనన మరణాల మధ్యన స్వర్గ నరకాలలో
కర్మ తూకంలో సరి సమానమైనపుడు ,తిరిగి మానవజన్మ సాధ్యం . తండ్రి తననే పుత్రునిగా పొందుతాడనేది శాస్త్రం .
అలా వంశంలో పూర్వము తాను చేసిన కర్మకు తానే బాధ్యత వహిస్తూ మళ్ళీ అదే వంశంలో జన్మిస్తాడు వ్యక్తి . అందువలన
తనకర్మకు తానే కర్త కనుక సర్వులూ సరి అయిన ప్రాయశ్చిత్తాన్ని గ్రహించి ,పూర్వులను ,తమ తరాన్ని ,రాబోయే తరాలను
రక్షించుకోవాలి . ప్రాయశ్చిత్తానికి తగిన శరీరం పొందినందుకు భగవంతునికి ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా సరిపోదు .