26, ఏప్రిల్ 2016, మంగళవారం

మాయ

మాయ . ఉన్నది లేనట్లు ,లేనిది ఉన్నట్లు కలిగే భ్రాంతి . చక్కనైన ఉదాహరణ కలే . ఆ సమయంలో అది లేదని ఎవరూ అనలేరు . అమ్మవారిని  ,మాయ అని కూడా అంటారు .జ్ఞాన స్వరూపిణి ,ముక్తి ప్రదాత కూడా . ఎలా విడదీయాలి ఈ
చిక్కుముడి ?నేను అని భావిస్తున్న శరీర భావన ,నిజానికి తనకు సంబంధం లేనిది . పరాయి సొత్తును తమ సొత్తుగా
ప్రకటించినపుడు ,దాని యజమాని ఎందుకు అంగీకరిస్తాడు ?నిజానికి సృష్టి అంతా అర్ధనారీశ్వరమే . శరీరం శివుడు ,శక్తి
అమ్మవారు . దీన్ని మరచి ,శరీరం తనదంటూ ,దాని వ్యవహారాలు తనవంటూ ,కర్మ వలయంలో చిక్కి ,జీవుడు
తనను తానే బంధించుకున్నాడు . పైగా భగవంతుని దృష్టిలో తరతమ బేధాలున్నాయని ,సృష్టిలోని బేధాలను వేలెత్తి
చూపుతారు . దీనికి కారణం తను వహించిన కర్తృత్వం అని ఎన్నడూ భావించడు . పరమాత్మ కృపతో సాధన సాగితే ,
సృష్టిని పరమాత్మ క్రీడగా భావించి ,అన్ని శరీరాలను పరమాత్మగా భావించి ,తనపాత్రను ఏమరపాటు లేక ,తొట్రుపడక
జీవించినపుడు మాత్రమే ,మాయవరణం తొలిగి ,అమ్మవారు ముక్తి ప్రదాతగా అనుగ్రహిస్తారు . అమ్మవారి సృష్టిలోని ఏ కణం
తనది అన్నా మయావరణం వీడదు .