18, అక్టోబర్ 2015, ఆదివారం

శ్రీ మాత్రే నమః

శ్రీ మాత్రే నమః 
 
           సకల సృష్టి పరమాత్మ స్వరూపమే . సృష్టికి ముందు ,యందు ,విందు కూడా పరమాత్మలోనివే . ముందు భూతకాలం . యందు ,వర్తమానం . సమర్పణగా కూడా విందు పరమాత్మకే . నన్ను నీలో కలుపుకో, ఇదే మోక్షం .
సద్రూపం  మాత్రమే ఆధారం . అంటే ఉనికి అనేదే పై మూడింటికి ఆధారం . దీన్ని విడిచి జీవితం లేదు . 
      ఇదే  మనకు, వేద మతం  ఇచ్చిన కుటుంబ వ్యవస్థ . దీన్ని విడిస్తే నేల విడిచి సాము చేసినట్లే . పరమాత్మ నిండి 
ఉండకపోతే సృష్టి నిలబడడం అసాధ్యం . అలానే శరీరం పడిపోయే వరకు తల్లి దండ్రులతో ఉండడం ,మన జీవన శైలిగా 
మనకు అందించారు పెద్దలు . సాధక బాధకాలు ఎన్ని ఉన్నా ఈ విషయంపై అవగాహన చాలా అవసరం .
      ఒకే శరీరంలో విడి విడి భాగాలూ కలిసి ఉన్నాయి . అన్నీ వేరే వేరే పనులు నిర్వహిస్తూ మనకు ఈ విషయాన్నే 
తెలియజేస్తున్నాయి . ఉనికి శివుడు ,చైతన్యం అమ్మవారు ,శరీరం వినాయకుడు , జీవుడు కుమారస్వామి . అందరూ 
ఉన్న ఉమ్మడి కుటుంబం ఈ శరీరం ,పిల్లలు వచ్చారని సచ్చితానంద స్వరూప ఘన పరమాత్మ ,శరీరాన్ని జీవుడిని 
విడిచి పోలేదు . సరిగ్గా గుర్తు పట్టాలి . శ్రీ శివ కుటుంబిన్యై నమః .  
 
 


16, అక్టోబర్ 2015, శుక్రవారం

శ్రీ మహిష మర్దిన్యై నమః .

శ్రీ మహిష మర్దిన్యై నమః . 
       మనిషి లోనే ,మహిషము ,మర్దిని ఇద్దరూ ఉన్నారు . బాల్యం వరకు పిల్లలను భగవత్ స్వరూపులుగా తలుస్తాము . అంటే  మహిష మర్దినిగా ,గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా  దిద్దే సమయమనేదే అంతరార్ధం . ఈపని చేసినపుడు ,ఇంట్లో 
పెద్దలు ,సరిగ్గా చేసావు, అంటారో ఆపని మాత్రమే చేసేలా వారిని తీర్చి దిద్దడమే ,బాల పూజ . ఇది ఈ సమయంలో 
మాత్రమే సాధ్యం .బాల్యం అనేదానికి ఆడ ,మగ అనే బేధం కాదు . ఎవరి వ్యక్తిత్వాలు వారు మలచుకోవడం ఇద్దరికీ  
అవసరమే . తల్లి దండ్రులుకాని ,పెద్దలు కానీ చూస్తే ఏమైనా అంటారు ,అనే భావం ఉన్న ఏ పని వారు చెయ్యకుండా
వారిని దిద్ద గలిగితే ,బాలలను మహిష మర్దనులుగా మారుస్తున్నట్లే . అంటే ధర్మాన్ని తనపరంగా ఎవరూ ప్రశ్నించే
అవసరం లేకుండానే ,జీవన శైలిగా మారుతుంది .
     దీనికి ముఖ్య సూత్రం బాధ్యత తెలిసేలా చెయ్యడం . ఖచ్చితంగా వారి పనులు చేస్తూ, ఇంటికి అవసరమైన పనులలో
ప్రవేశ పెడుతున్నామా అనేది ముఖ్య సూచన. ఇద్దరమూ సంపాదిస్తున్నాము ,లేదా చాలా స్థితిమంతులము .పిల్లల చేత
పనిచేయించాల్సిన అవసరం లేదు ,అనుకున్నప్పుడు ,పిల్లలకు పరిచయం చేస్తున్నది మాత్రం మహిష ప్రవృత్తినే . సరి అయిన ప్రవర్తన లేకుండా ,వారిని వారే పొగుడుకుంటూ ,పక్కవారిని చులకన చేస్తూ ,సమయాన్ని వృధాగా గడుపుతూ
తమ చేతకానితనానికి ,మిగిలినవారిని బాధ్యులనుచేస్తూ ,ఎదిగే బాల్యం మహిషాసురుల్నే తాయారు చేస్తుంది . సమాజానికి వారినే అందిస్తుంది . పెద్దవరాయక పెర్సనల్ మానేజ్మెంట్ కాదు ,పిల్లలుగా బాధ్యత గుర్తుపట్టినవారు
తమలోని ,అప్రాకృత ,విషమ శైలిని ,తమంత తామే గుర్తుపట్టి ప్రతి క్షణం ,హక్కు కాదు ,బాధ్యత మాత్రమే ముఖ్యం ,
అని నమ్మి,వారిలోని మహిషిని మర్దించ గలరు . హక్కులు ,బాధ్యతలను  వహించిన వారికే స్వంతం . ఇది ప్రకృతి
నియమం . ఎవరిని ఎంత హింసించినా ,ప్రకృతి నియమాలు మారవు . నియమాలను గౌరవించి ,తమను దిద్దుకోవడమే
ధర్మం ,ఇలా జీవించేవారి చేతిలో ,వారిలోనే దాగిఉన్న మహిషం మీద విజయం తధ్యం .