15, డిసెంబర్ 2016, గురువారం

చాతుర్వర్ణం

చాతుర్వర్ణం
భగవద్గిత చెప్పిన 'చాతుర్వర్ణం మయా ప్రోక్తం'అన్నది భగవంతుడు . అయన చెప్పాడని వినాలని
చెప్పలేదు . శ్రేయో ,ప్రేయో మార్గాలు చూపించి ,ఎటైనా వెళ్ళవచ్చు అన్నాడు . ఒక తండ్రి మంచి ,
చెడు తెలియజేసి కూడా ,మంచిని గురించి మరోసారి హెచ్చరిక చేస్తాడు ,పిల్లల భవిష్యత్తు బాగుండాలని . అది ఒక తరం వరకు అర్ధంఔతుంది . కానీ కొడుకు దానిలో కొంత భాగాన్ని పట్టించుకోడు . అతను తాను పట్టుకున్నది కొంత చెప్తాడు . అలా అలా పోగా మిగిలింది కొన్ని
తరాల తరువాత ఎంత మిగులుతుంది . మొదటివారు చెప్పిన విషయం ఇప్పటి తరానికి అంతా అయోమయం .  LKG చదివే పిల్లలు పెద్ద చదువు చదువుతున్న వారిని
వారి సబ్జెక్టు గురించి ఎంత చెపితే అర్ధం చేసుకోగలరు . అది వారి పట్ల చిన్నచూపు కాదు , వేళాకోళము కాదు . అర్ధం చేసుకోడానికి తగినంత కృషి ,సమయము కావాలి అని చెప్పినా పిల్లలు
వినరు . ఒక చిన్న విషయానికే మనం చెప్పలేము సమాధానం . ఎంతో గహనమై ,జనన మరణ
చక్రాన్ని తప్పించే మార్గం ధర్మం .ధర్మాచరణ అంటే తరగతుల వారీగా క్లాసులకి వెళ్లి చదువుకోవాలి
అని చెప్పడం స్కూల్ యాజమాన్యం తప్పు అన్నట్లు ఉంది . ఏ తరగతి వారైనా పాస్ కావచ్చు .
పాస్ అవడానికి అన్ని క్లాసులకు అవకాశం ఉంది . స్కూల్ ఫస్ట్ ,ఏ క్లాసుకైనా రావచ్చు . దీనికి
ఫలానా క్లాస్ అనే నిబంధన లేదు . ఆలా ఒకరికి వస్తే స్కూల్లో అందరూ యాజమాన్యాన్ని మాకెందుకు రాలేదు అంటే సమాధానం ?ఇటువంటివే ఈ ప్రశ్నలన్నీ . పెద్దలు చెప్పిన మార్గంలో
ప్రయాణం చేసి గమ్యం సమానమని తెలియాలి . ఢిల్లీకి దేశం నాలుగు మూలల నుంచి ఉన్న మార్గాల్లో ప్రయాణించే వారికి తగిలే స్టేషన్లు వేరు . కానీ గమ్యం ఒకటే . బాగా అధ్యయనం చేస్తే
సమాధానాలు పొందవచ్చు . కానిదంతా కాపీ పేస్ట్ . ఎందుకూ పనికిరాదు .
ఎవరైనా ఒక ఆఫిసు లో అన్ని స్థాయిల ఉద్యోగులను నియమిస్తారు . దీనిలో యాజమాన్యానికి
తగిన వారు అవసరం . నోటిఫికేషన్ ఇచ్చారు.  కుప్పలు ,తెప్పలుగా అప్లికేషన్లు వచ్చాయి . దీనిలో
క్రీంది స్థాయి ఉద్యోగులు మీ నోటిఫికేషన్ తప్పు ,పై స్థాయి ఉద్యోగులకు అంత జీతం ,మిగిలిన వారికి
తక్కువ ఇస్తే ఉరుకోము అంటే అది న్యాయ పరమైన తప్పా ?సృష్టిలో ఉన్న తారతమ్యాలకు ,కర్మ
కారణం భగవంతుడు కాదు . అహం ,మమ అనేవి విడిచిన క్షణం ,జీవుడు దేవుడే . దీనికి వర్ణ వ్యవస్థ అడ్డురాదు. రాత్రి నిద్రలో ఎవరైనా బాస్ అని కలకనవచ్చు . ఎవరూ అడ్డు పడరు . కానీ ఇలలో కష్ట పడితేనే సాధ్యం .అదికూడా బాల్యం నుంచే . ప్రతి పాఠం ,ప్రతి క్లాస్ ఉపయోగ పడేదే . అప్పుడు
చదవక ,ఎవరో చదవకుండా ,అంబానీ అయ్యాడు అని ,చదువు ఎగ్గొట్టి ,రోడ్లు ఊడిచే ఉద్యోగానికి
కూడా'Q'లో నుంచున్నవారిని గమనించాలి . ఎవరిది తప్పు ?పెద్దలు చెప్పేదానిని వక్రంగా చిత్రించి ,
వాదించడం సులువే . పాటించి చక్కని గమ్యం చేరాలి . ఒకే తెలుపు భ్రమణంలో ,సప్త వర్ణాలైనట్లే ,ఒకే పరతత్వం సృష్టి చక్రంలో వివిధంగా భాసిస్తోంది . 
కులము అని చెప్పగానే భుజాలు తడుముకునే వారు ఎక్కువైపోయారు . కులము అంటే సమూహము . మనం తీసుకునే కులము కాదు భగవంతుడు చెప్పినది . గమ్యాలు వేరుగా జీవించిన జీవులు వారి గమ్యాలను చేరడానికి ,మళ్ళీ ,పునర్జన్మ పొందుతారు . వారి సంస్కారాల
అనుగుణంగా చెప్పబడినవే కులాలు . ఈ జన్మలో నేను వేదాలు చదివితే ,బ్రాహ్మణ్ణి ,వ్యాపారం చేస్తే
వైస్యుణ్ణి ,సైన్యంలో చేరితే ,లేదా రాజకీయాల్లో ఉంటేనే ,క్షత్రియుణ్ణి , శ్రమ చేసినంత మాత్రాన సూద్రుణ్ణి అనికాదు . గుణ ,కర్మ విభాగయో . ఇది సూత్రం . పూర్వ జన్మలో ఏ గుణాన్ని ఆశ్రయించి
కర్మ చేయబడిందో ,దాన్నిబట్టి ,ఇపుడు జన్మ ప్రాప్తమైనది . ఇపుడు ఆ గుణాన్ని గమనించి ,తమో గుణం నుండి రజో గుణానికి ,దానినుండి సత్వానికి ప్రయాణించాలి . ఏ విధమైన కట్టుబాటుకు లొంగని ,మనసు ఎలాచెపితే అలా తనకు నచ్చినట్లు ప్రవర్తించేదే తమోగుణం . ఈగుణాన్ని ఆశ్రయించిన జనులు , సూద్రుల ఇంట జనించి ,తమలోని లోపాన్ని తమజన్మ ద్వారా గ్రహించి ఉత్తమమైన లక్షణాలను గ్రహించినా ,వారి ఆశ్రమ కులవృత్తులను స్వీకరించి ,ఎవరితోను కులాల గురించి తర్కించక ,పరమాత్మను చేరినవారు మనకు తెలుసు . కుండలు చేసినంత మాత్రాన తుకారాం కించ పడలేదు . రాజు వచ్చినా ,గురు తుల్యుడైన బ్రాహ్మణ్ణి చూసినా తల వంచను అనలేదు . అప్పటి సామజిక స్థితి గతులలో ఎలా వారి పెద్దలు నడిచారో అలానే నడిచి పరమాత్మను చేరాడు . ముఖ్యంగా కుల విభాగము పరమాత్మను చేరే సోపానం అని గమనించాలి .
దీన్ని సామాజికాంశం అనుకోవడం తప్పు . పరమాత్మను చేరడానికి తనుఉన్న చోటినుంచి ప్రయాణం మొదలు పెట్టాలి . దీనికి మాత్రమే కులాచారాలు ప్రవర్తిస్తాయి .బేధం చూస్తూ ఉంటే
సమయం వ్యర్థం అవుతుంది . నిజానికి విశ్వామిత్రుని కంటే పెద్ద ఉదాహరణ దీనికి లేదు . వసిష్ఠుని
నుండి పొందిన గాయత్రి మంత్రం ,ఇపుడు విశ్వామిత్రుని ద్వారా అతనినే ఋషిగా చెప్తున్నది .
క్షత్రియునిగా ,రాముడైనా ,గొల్లవాడైనా కృష్ణుణ్ణి ,పూజించని బ్రాహ్మడు మనకు కనిపించడు . కానీ
అవతార మూర్తులైనా ,వారి కాలంలోని బ్రాహ్మణులను ,గురువులను ,రామ ,కృష్ణులు కూడా గౌరవించి ,దీవెనలు పొందారు . సారాంశంగా వాదనలకు దిగక సాధన సాగించి ,గమ్యం చేరాలి . వారి గమ్యానికి తుకారాం ,నామదేవుడు ,సక్కుబాయి ,మీరా నామాన్ని జపించారు . కానీ అలాగే
సంధ్యావందనాది నిత్యకర్మలు విడిచి ,బ్రాహ్మణ సమాజం నామం చేస్తే చాలు అని పరమాత్మ వాణి
కాదు . ఎవరికి శాస్త్రం ఏ విహిత కర్మను నిర్దేశించిందో అదే వారు చేయాలి . సకాల సంధ్యావందనాది
క్రియలు మాని ,ఏ బ్రాహ్మడు తరించడు . ఎంత వేదాంతం విన్నా, తన నిత్యకర్మ తప్పదు .అది
మానాలంటే సన్యసించక తప్పదు . గృహస్థాశ్రమంలో ఉండి కర్మను త్యజించినవారు ,మరల జన్మకు
ఉపాసన కోల్పోయి ,మళ్ళీ ఉపనయన సంస్కారార్హత లేనియింట జన్మిస్తారు . కానీ ఇప్పుడు ఉపనయనార్హత లేనివారు ,వేదాలు వల్లించాలనే తపనతో వారి ధర్మాన్ని విడిచి పరధర్మాన్ని ఆశ్రయించిన వారవుతారు . కనుక శాస్త్రవిహిత కర్మను గౌరవించడం కర్తవ్యం .

2, డిసెంబర్ 2016, శుక్రవారం

అహం-ఇదం

అహం-ఇదం .
ఈరెండే ప్రతి బంధకాలు జీవుడు ,ఈశ్వరుడు అయ్యేందుకు . ఇదే ఇరుముడి , అయ్యప్పకైనా . తలనీలాలు ,ముడుపు వెంకటేశ్వరునికైనా . శరీర పర్యంత స్వాభిమానం అహం . దాని పరిధి అంతా ఇదం . బాహ్యంలో కనిపిస్తున్న ,వ్యావహారిక నామరూపాలన్నీ శరీరం వెలుపలివి . బాహ్యాన్ని విడిచి ,తనలో వాటి స్థానం ఆలోచిస్తే ,అవి ఒట్టి ఊహ మాత్రమే . ఏవి లోపలికి ప్రవేశించ లేవు . కానీ అవే మన భగవదత్తమైన సమయాన్ని ,సాధనకు పనికిరాకుండా చేసి మానవ జన్మను వృధా చేస్తున్నాయి . ఒకక్షణమైనా ఏమిటి అనే ప్రశ్న రాకుండా మూసుకుపోయిన అజ్ఞానమే ,ఆవరణ . ఆవరణ వరకు వెళ్లకుండా అడ్డుపడేది ,విక్షేపం . విక్షేపం విడిచి పెట్టాలంటే 'ఇదం' అనే నామరూపాలు ,తనలో ఉన్న తన దగ్గరికే వెళ్లనీయని ,ముళ్లకంచె . దీన్ని దాటాలి . కానీ ఎక్కడా గాయం కాకూడదు మనసుకు . చిన్న కుండీలోని గులాబీ తుంచినంత సులువు కాదు ,బలిష్టంగా మారిన గులాబీ చెట్టు మధ్యలో ఉన్న గులాబీ కోయడం లాంటిదే ఇది . ముందు చుట్టూ కొమ్మల్ని ,తలో వైపుకు లాగి కట్టాలి . కానీ అవి కట్టుబడక విడిపోతూనే ఉంటాయి . అత్యంత సావధానం
అవసరం . అలానే అసలు బయటి ప్రపంచంలోని వస్తువులు ,వ్యక్తులు ,అంతరంగంలోకి ఎలా ప్రవేశించగలరు అని మధన చేయాలి , కానీ కొద్ది నిమిషాలుకూడా మనసు నిలబడదు . దీన్ని దాటలేని నిరాశను జయించలేని స్థితిలో భగవంతుడే దిక్కు అనుకోని వారుండరు . వారే ముందు ఆర్తులు ,తరువాతి జిజ్ఞాసువులు . వీరికి ప్రపంచ విషయాల పట్ల లేని ఆర్తి పరమాత్ముని చేరే విషయంలో ఉంటుంది . వీరిది స్వచ్ఛమైన భక్తి . ఇది రానంతవరకు భక్తుడు అని చెప్పడం అసమంజసం .ఇలా భక్తులైన వారి స్థితిలో,గృహస్థాశ్రమ నియమాలను ఉల్లంఘించలేని బేలతనం , కానీ పరమాత్మను చేరాలనే తాపత్రయం ఉక్కిరి బిక్కిరి చేస్తాయి . ఇక్కడ సహకరించేదే ముడుపు .
అంటే తనది అనుకుంటున్న దానినుంచి ఎలా మనసుకు బయటకు రావాలో సహకరించమనే అభ్యర్ధన ,ముడుపులో ఉంది . ఇది అన్ని కొమ్మలు బాగా అన్ని పక్కలకు కట్టేయడం . ఇది విక్షేపానికి పడే తాపత్రయం . గులాబీని కొయ్యడం ,ఆవరణను తొలగించడమే . గులాబీ క్రింది ముళ్ళు ఉండనే ఉన్నాయి .పువ్వు కనిపిస్తుంటే గుర్తు పట్టడం సులువే. కానీ అహం అనే ఆవరణ , తెల్లవారక ముందు కోసే గులాబీ .దీనికి వెలుగు చూపే దీపం గురు స్వరూపం . ఇది భగవంతుని కరుణ వల్లనే లభ్యం. దీనికి సహకరించే అంగం మానసిక సన్యాసం . ఇదే తలనీలాల ప్రయోజనం . మనం బాహ్యంగా చెయ్యలేని సన్యాసాన్ని సూచిస్తుందిది. ఈస్థితిలో మాత్రమే గురువు సహకరించ గలరు . వస్తువును చూపడానికి . కానీ ప్రయత్నం ఎవరికి వారిదే . దీపం పువ్వును మాత్రమే చూపగలదు . దీక్షగా దగ్గరికి వెళ్లి చూడాలి . దూరంగా ఉండగా సాధ్యపడదు . ఇప్పుడు గులాబీ స్థానంలో అమ్మను చూద్దాం . ఎందుకంటే పువ్వు లాంటి జడం కాదు పరమాత్మ . ఎంత పనిలో ఉన్నా ఏడుస్తూ ,నిస్సహాయంగా చూస్తున్న పిల్లవాడిని లాలించే తల్లి పరమాత్మ .ఇప్పుడు ఉదాహరణ మార్చడానికి కారణం చూద్దాం.
కర్మ పరిధిలోని జన్మ కారణం ,కర్తృత్వం . ఈ అభిమానం వలన ఏర్పడిన నేను ,నాది అనే భావాల నుండి తనను తాను ఉద్ధరించుకోవలసిన బాధ్యత కూడా తనదే.దీనికి ప్రధమంగా శాస్త్ర సహాయంతో పెద్దల సహాయంతో ,తన విధి ,నిషేధాలను తెలిసి దేనికీ వ్యగ్రత పొందక ,అతిని పొందక ,భగవత్ప్రీతిగా కర్మ ఆచరిస్తూ,అర్ధార్ధి ,ఆర్తుడు , జిజ్ఞాసువుగా ప్రయత్నం చేయాలి. ఏమిచేయలేని నిస్సత్తువ,గమ్యం చేరే మొదటితీరం . ఇక్కడ గురువు ,దైవము సహకరిస్తారు . శివోహం .

18, నవంబర్ 2016, శుక్రవారం

మార్పు

మార్పు .
తనను తాను మార్చుకుని ,తన కుటుంబం ఉన్నత ప్రమాణాలతో జీవించాలనే కోరిక , మార్పుకు
శ్రీకారం . ఎంతసేపు ఆర్ధిక పురోగతి అనేది తప్ప వేరే విలువలు అవసరం లేని వారికి ఈ మాటల వల్ల ఏ ప్రయోజనము లేదు . చాలా శ్రద్ధతో ఒకపని చేస్తూ జీవన శైలిగా మార్చుకోడం వలన ,DNA మారుతుందని సైన్స్ చెబుతుంది . ఇలా తమ జీవితాన్ని ఉత్తమ సంస్కారాలతో జీవించి ,ముందు
తరాలకోసం బంగారు భవిష్యత్తును పెద్దలు అందించారు మనకు . కానీ వీలు కావడం లేదని ,ఈ రోజుల్లో ఇలా ఉండక్కరలేదని తమను తాము సమర్ధించుకుంటూ ,పిల్లలను సమర్ధిస్తూ ఏది
కోల్పోతున్నామనేది ఎవరూ గమనించడం లేదు . ఇప్పుడు కూడా ఎంత ప్రతిభ ఉన్నా తల్లి ,తండ్రి
కుటుంబ నేపధ్యాన్ని గౌరవిస్తున్న వారికీ ,కొదువ లేదు .కానీ పూర్వముతో పోలిస్తే తక్కువని చెప్పాలి. ఇలా గౌరవాన్ని కాపాడుకోడానికి ఆర్ధికం కన్నా ,హార్దికం సహకరిస్తుంది .ఇలా జీవిస్తున్న వారిని చూచి
నపుడు ,మిగిలిన వారికి ఆశ్చర్యం గాను ,కొద్దిగా దాన్ని మనం సాధించలేక పోయామనే అసంతృప్తి
సహజం . దీనికి తోడు,వారి అదృష్టం అనే సాకు వాడుకోవడమూ సహజమే .
  కానీ వారి కృషిని గుర్తిస్తే అహం ఊరుకోదు .నిజానికి వారి గురించి సరిగా అంచనా వేయక పోవడమే దీనికి కారణం . సాధారణంగా వీరు పెద్దగా ఎవరి విషయాలలో జోక్యం చేసుకోరు . ఎవరిని అలా తమ విషయంలో జోక్యం చేసుకోడానికి ఒప్పుకోరు .ఊరందరిదీ ఒక దారి ఉలిపి కట్టె దొక దారి అని వీరి గురించి అనడం వింటుంటాం . ఎందువలన వీరి వైఖరి ఇలా ఉంటుంది అంటే ,పెద్దలవలన
వారు ఏర్పరచిన విధానాలకు ,విఘాతం కలగకుండా ఉండాలంటే ,వేరే వారి విమర్శలకు తావు
ఉండకూడదు .దీనికి ముందుగా వీరి పెద్దలు కూడా మిత్రత్వానికి పరిధులు విధించుకుని ,అపుడు
వారిపిల్లలు కూడా ,అనవసర పరిచయాలు పెంచుకోకుండా జాగ్రత్త చూపుతారు . ఇది మిగిలినవారి దృష్టిలో ,అహం భావం అయినా కావచ్చు ,లేదా చేతకాని తనమైనా కావచ్చు . కానీ ఒంటరి పోరాటానికి తన జీవన సహచరి యొక్క ఆవశ్యకత అనుపమాన మైనది . దాన్ని అర్ధం చేసుకునే
తీరు విలక్షణ మైనది . దీనికి ప్రధమ పుష్పం ,గృహిణి తన పుట్టింటివారిని ,పొగడక ,అత్తింటివారు ఆత్మ బంధువులైతేనే ,ప్రయాణం ,పూలపై నడుస్తుంది . ఎప్పుడూ అత్తింటివారిని ,తనవారితో
పోలుస్తూ,వీరిని ఎందుకూ పనికిరాని వారుగా భర్తకు నిరూపించే ,ఇల్లాలు ఎప్పటికీ ముందు చెప్పిన , జీవన శైలిని ఆహ్వానించలేదు .ఇది అంతర్మధనం . వారితోనే కలిసి ఉండేవారూ ఉన్నారు ,విడిగా ఉండి ,కలిసినప్పుడు అసలు ఇటువంటి పిల్లలు ఎవరికైనా ఉంటారా అనేలా ఉండేవారు ఉన్నారు .
మొదటి వారిలో ,ఎప్పుడూ భర్తకి మానసిక స్థిమితం ఉండదు . అంతా వాళ్ళ నాలికమీద నడిచినట్లు ఉండాలి . లోపల పూర్తి అసంతృప్తి . ఈ యింట్లో పిల్లలు కూడా ఎంతో అణకువగా కనిపిస్తారు . కానీ వారి స్నేహితులే వారికి ఆత్మ బంధువులు . తల్లి దండ్రులు ఏమి చూపిస్తున్నారో అదే వారికి వీరు
తిరిగి ఇస్తారు . పిల్లల్ని తూలనాడడమే తప్ప సమస్య పరిష్కారమవదు . వీరిలో డ్రగ్ ఎడిక్ట్స్ , కులాంతర ,మతాంతర వివాహాలు కనిపిస్తాయి .కానీ  అంతరంగం అత్తవారి స్వంతం చేయగలిగిన
సంస్కారం ఉన్న ఇల్లాలు దీన్ని అధిగమించి పిల్లల్ని వారి సంస్కారాలకు వారసులను చెయ్యగలదు.  
దీనికి సత్యం అనేదాని ఆధారం కావాలి . తన భర్తకు ఇష్టమైన కుటుంబం తనకు ఇష్టమయ్యేలా
మారాలి తాను ,అందుకే గోత్రం మార్పు . తన పుట్టింటివారిని సమర్ధించే భర్తని కోరుకుంటే , నటనే
మిగులుతుంది . అమ్మమ్మని ఆరాధించే మనుమలు బామ్మకి భవిష్యత్తులో సంభవిస్తారు .మనమే
బాటలో పయనిస్తే పిల్లలు ,భార్య మాటవింటూ , వారసులౌతారు .
   రెండో వారు ,ఎలాస్టిక్ ఎంతవరకు లాగి ఉంచితే అంతవరకు అలా జాగ్రత్తగా ఉంటుంది . వదిలితే
ఏమార్పూ ఉండదు . ఇంటికి అత్తగారు ,మామగారు ,లేదా ఆడపడుచు ,భర్త సోదర వర్గం ,లేదా
వారి తరుఫు బంధువులు . ఇలా ఎవరు వచ్చినా అంతా వారే ప్రపంచం అన్నట్టు . వెళ్ళగానే రిలాక్స్ .
మనసులో ,మాటలో ,ఫోన్ లో ,స్కైప్ లో ఎప్పుడూ పుట్టిల్లు . పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఎలా తల్లికి
తాళం వెయ్యాలో బాగా తెలుసు . వాళ్ళకి కావలసినది ఏదైనా ,తల్లి తండ్రులు ,ఒళ్ళు మరచి చేసేలా
చెయ్యగల ధీరులు . ఎప్పుడూ పెళ్లి తరువాత కలిసి ఉండరు . మనుమలు అమ్మమ్మ కబుర్లు చెప్తూ
ఉంటారు . తల్లి తండ్రుల అవసరాలకు వృద్ధాశ్రమాలు ఎలానూ ఉన్నాయి .
     ఈ రెండూ దాటి అత్తవారిల్లు పరమాత్మ ఇచ్చిన వరం అనిభావించి ,భర్త ద్వారా వీరి గురించి
మంచిని మాత్రమే విని ,ఏదైనా అసంతృప్తి తల్లి తండ్రుల పట్ల భర్త కలిగి ఉన్నా అత్త మామల పరి
స్థితిలో అంతకన్నా వారేమీ చెయ్యలేరని అతనికి కూడా చెప్పి ,వారికి అండగా ఆలోచించి ఇంటిని
స్వర్గంగా మార్చడం ,తన తల్లి తండ్రుల నిస్వార్ధ చింతనతో ఇల్లాలు చెయ్యగలదు . ఇలా ఉన్న
అమ్మాయి ,తల్లి తండ్రులకు ,అంతా వారి అమ్మాయి ప్రయోజకత్వం అనే దురభిప్రాయం ,కలగడం
అనివార్యం . ఇపుడు మన కథలోకి ప్రవేశిద్దాం . ఇలా ఒక ఇల్లు ఉంటే ఆ అత్తగారు ,మామగారు ,
పూజలు,ఆచారాలు పాటించే వారై ఉంటారు .ముందు తరాలు ఆరాధన ,పరంపర కలిగి ,సంఘంలో
అందరూ గౌరవించే స్థాయిలో ఉంటారు . దీన్నే పరువుగల కుటుంబం అంటారు . పిల్లలు ఆచార
వ్యవహార శైలి కలిగి వినయంతో ఉంటారు . అటువంటి అల్లుడికి అమ్మాయిని ఇవ్వడం వీరి అదృష్టం.
కానీ ఇక్కడే వ్యవహారం తిరగబడుతుంది . అల్లుడు బొత్తిగా అమాయకుడని ,తల్లి దండ్రులు ఎంత చెపితే అంత అని ,పిల్లకి సుఖం లేదని ఆఇంటిని అతలాకుతలం చెయ్యడానికి రెడీ . అదే విధంగా
తమ కొడుకు ఉంటే చాలా గొప్ప . తమలా పెంచగలవారు ఉండరు . ఈధోరణికి బలైపోయిన
కుటుంబాలు కోకొల్లలు . ఇంతకీ తర తరాలుగా వస్తున్న పూజ ,వ్యవహారశైలి కాపాడుకున్న అత్తగారు
ఈ సమరాన్ని దాటగలదు . అంటే ఇంచుమించు 30 సం/ ఇష్టపడి కాపాడుకున్న విలువలు ,వారిని
కాపాడి ,కోడలికి అన్నీ అర్ధం అయ్యేలా చెప్పే సామర్ధ్యాన్ని ఇస్తాయి .అంటే వారి DNA మారి ,పిల్లల్ని
సంరక్షించుకునేలా చేసింది . మూలమైన విషయం ఏమిటంటే ,పెద్దల ఆచార ,సంప్రదాయాలు
విడువక పాటించే వారికి ,ఎన్నో జన్మల సాధనాపరులైన వారు ,వారి ఇంట జన్మించి,చిరకీర్తులై
చిరంజీవులౌతారు .

14, నవంబర్ 2016, సోమవారం

దైవభక్తి-దేశభక్తి .

 దైవభక్తి-దేశభక్తి .
తన కుటుంబం వరకు పరిమితమైన అర్ధ,కామాలను,పరమాత్మునికి వినిపించి ,తగిన పూజ,జప
హోమాది క్రతువులతో ,ఈ జన్మకు ,పైజన్మలకు భౌతిక వస్తు,మానసిక సంతృప్తి కొరకు చేసేవన్నీ ,
రజోగుణ లక్షిత లక్షణాలు . జ్ఞాన భక్తిలో పంచభౌతిక పరిమితి దాటినప్పటికీ ,తన ముక్తి ,దానికి
తగిన ధ్యాన ,ధారణాది క్రియలు సహజం . సాత్వికమైనా ఇది కూడా స్వార్దాన్ని సూచిస్తుంది .
సన్యాసులకి ఆశ్రమాలెందుకు అని చాలామంది అడుగుతారు . కానీ ప్రపంచాన్ని పరమాత్మగా
గ్రహించినవారు,లీలగా ఆప్రపంచానికి తగిన వ్యావృత్తులను స్వీకరించి చరిస్తారు . ఇటువంటి
కోవకు చెందినవే శ్రీ శంకర పీఠాలు.అలానే ఎటువంటి ఆశ లేక ,కేవలం జన హితమే కోరే వారు
ఎవరైనా ఉంటే వారు కూడా ఈ కోవకు చెందినవారే . వీరిది దేశ  భక్తి. సర్వము విష్ణు మయమే .

25, అక్టోబర్ 2016, మంగళవారం

ధర్మం

ధర్మం .
ధర్మం అంటే లక్షణం . గాలికి కదలడం లక్షణం . నీటికి ప్రవహించడం లక్షణం . ఇవి వీటి ధర్మాలు . పరమాత్మనుండి కదిలిన సృష్టికి అతని లక్షణాలే కలిగి ఉండడం ధర్మం . సర్వే సర్వత్రా ఉండడం వలన అంతా తానే ,అంతా తనదే .ఇది ప్రధమలక్షణం . ఇది అందరూ కలిగివున్నారు . ముందుగా ఈ లక్షణాలు శరీరానికి ముడిపెట్టకూడదు . ఇదే మనకు జ్ఞానులలో కనపడే మొదటి లక్షణం . ఎంతోమంది జ్ఞానులు విదేశీయుల దాడులలో 'మీరేమి చెయ్యలేరు . పొతే పోయేది నా శరీరమే' అని జవాబిచ్చారు .మనకి ప్రపంచం కనిపించడం అనేది పంచేంద్రియ విషయమే . నిద్రలో అది ఉన్నా తెలియదు .  అజ్ఞాన కారణంగా . కానీ అజ్ఞాన కారణంగా నిద్రలో లేనట్లే ,అద్వైత జ్ఞాన కారణంగా జ్ఞానులకు ,ఊహా మాత్రంగా గాని , కలలాగా కానీ దీని అస్తిత్వం ఉంది . అందుచేత ధర్మం అనేవిషయాన్ని అర్ధం చేసుకోడానికి ,పరమాత్మ పంచ భూత ప్రకృతిగా ఉన్నాడు అని అనుకుందాము . అందరూ పాడుతున్న అన్నమయ్య పాట ,అందరికి ,నేల ,నీరు ,గాలి సమానమని చెపుతున్నది .నిద్రలో లేని బేధం మెలకువలో ఉంది . నిద్రలో ఏమి తెలియనీయని అజ్ఞానం , మెలకువలో  శరీరధ్యాసను కానుకగా ఇస్తున్నది . దీనినే మాయ అని శాస్త్రం అంటుంది . పంచభూతాలు ,కొన్నిసమీకరణలతో ఏర్పడిన శరీరం ,పంచ భూతాలే కదా . అది వాటితోనే పోషించబడుతుంది .తిరిగి వాటిలోనే కలిసి పోతుంది దీనిలో తనది ఏముంది ?
    ఇదే ప్రధమసూత్రం హిందూ ధర్మానిది . ఇది అద్వైతం . దీనికి నేను ఉన్నాను అని జోడిస్తే ద్వైతం . ద్వైతం ఉంటే రెండవది ఉండడం వలన ఉన్నదాన్ని భాగించి సర్దుకోవలసి ఉంటుంది . దీనినే పరిధి అంటారు . ఇలా పరమాత్మ నేను , నాది అని విభాగించ బడినట్లు కనిపిస్తున్నది ,మెలకువ .నిద్రలో విభజనం లేకున్నా అద్వయ ప్రభావం వలన విశ్రాంతి ఉంది .అజ్ఞానం వలన తెలియమి ఉంది . ఇంతకీ అద్వైతమే విశ్రాంతి . అది అందనంతవరకు అశాంతి .అందుకునే పధ్ధతి ధర్మం . మెలకువ ద్వైతం కావడం వలన పరిధి ప్రారంభం అవుతుంది .ఇదే ప్రపంచం ,నాది అని సూచించ బడుతుంది అంతా తానేనన్న అనుభవం అంతా తనదే అనే భావాన్ని మనిషిలో 'నేను'అనేది కలిగి ఉంటుంది . దీని కోసం ప్రపంచంలో తాపత్రయ పడుతుంది 'నేను'. దీన్ని మాత్రమే శాస్త్రం నిరసిస్తుంది . సముద్రం  తాను కలిగి ఉన్న అలలను తానే పొందాలనుకునే తపన లాంటిదే ఇది . దీన్ని జ్ఞానంతో తొలగించుకోమని హితవు పలికేదే హిందూ ధర్మం . ఇంకా చాలా చర్చించుకుందాము .

3, అక్టోబర్ 2016, సోమవారం

శ్రీమాత్రే నమః .

శ్రీమాత్రే నమః .
సాధన ,సంస్కారాన్ని  బట్టి ఉంటుంది . సాధకులుగా పిల్లలు తయారవాలంటే మంచి సంస్కారాలు పెద్దలు ఆచరించి
అందించాలి . అత్యంత ముఖ్య విషయం ఏమిటంటే అందరికి మంచి విషయాలు తెలుసు . కానీ ఆచరణలో లోపం వల్ల పిల్లలకు అందడం లేదు . కాలం అందరిని పెద్దవారిని చేస్తోంది . కానీ విజ్ఞత మాత్రం తల్లి ,తండ్రులు వారు పొంది ,
పిల్లలో పెంచి పెద్ద చేయాలి . తాము అన్య కారణాల వలన పొందక పోయినా ,మీ బాధ్యతగా మీరు ధర్మాన్ని వహించి
పిల్లలకు మార్గదర్శనం చేయాలి . అలా పిల్లల్ని పెంచితే ,కనీసం ముందు తరాలకు ధర్మ భ్రష్టత రాదు . దీని వలన
వంశంలోని, పూర్వపు 7తరలవారి ఆశీర్వాదంతో మళ్ళీ వంశం ఉఛ్ఛ స్థితికి వస్తుంది . ఆర్ధికంగా బలంగా ఉన్న
సమయంలోనే ,ఆచార ,సంప్రదాయాలు ,వ్యవహరించే తీరు ,కట్టు ,బొట్టు ఇలా అన్ని విషయాలలో పెద్దలు ,పిల్లల్ని
ప్రభావితం చేయాలి . ఇలా ధర్మాచరణకు నడుం కడితే ,అది మనను ,మనకు తెలియకుండానే సాధకులను చేస్తుంది
  సాధన యొక్క పరాకాష్ఠ ,లోపల అగ్ని వలె వాసనలను దహించి ,ఆత్మ గురువును చేరుస్తుంది . అంటే నిజమైన
జిజ్ఞాస భగవంతుని ఉనికి పట్ల కలుగుతుంది . ఇదే ఎక్కువగా ఉపయోగపడే ఆత్మగురువు లక్షణం . శిష్యుడు
సమిధలతో గురువును చేరడం ఇదే . తనలోని వాసనల తడి పూర్తిగా ఆరినపుడు ,ఒక్క తత్వమసి అనే గురు వాక్యం ,వ్యాఖ్యానం అవసరం లేనంతగా ,అగ్నిని శిష్యునిలోని సమిధలను  ఆత్మ యజ్ఞంలో పొగరాకుండా ,యజ్ఞ ఫలాన్ని
అందేలా చేస్తుంది . ఆయజ్ఞ ఫలమే ,అహం బ్రహ్మాస్మి . 

2, అక్టోబర్ 2016, ఆదివారం

శ్రీ మాత్రే నమః

శ్రీ మాత్రే నమః .
ప్రతి సంవత్సరము ,శరన్నవరాత్రులలో అమ్మవారిని ఎంత శక్తి ఉన్నా ,ఎంతో శ్రద్ధతో అందరూ సేవిస్తారు . దురిత
నివారణ అమ్మవారి అనుగ్రహం . దురితాలలో ఎవరూ జ్ఞానాన్ని సముపార్జించ లేరు . అందువలన ఈ నవరాత్రులు
దురితాన్ని దూరం చేస్తే ,శరత్తులోని నీటిలా మనసు తేలికపడి ,జ్ఞానం వైపు చూడడానికి సాహసం చేస్తుంది . వసంత నవరాత్రులు ,సరస్వతీ అనుగ్రహంతో ,ధర్మం ఏమిటి ?ఎలా నడుచుకోవాలి, అనే దిశా నిర్దేశం చేసే ,వ్యాపక పరబ్రహ్మ
తత్వమైన రామతత్వాన్ని ప్రకటిస్తూ, జ్ఞాన రూపంలో అమ్మఅనుగ్రహం లభిస్తుంది . కానీ ప్రకటంగా రామ నవమి
వేడుకలకు ప్రాధాన్యం . జ్ఞానం యొక్క ప్రకట రూపం ధర్మం . దురితాలతో పోరాటం అలసట కలిగిస్తుంది . సేద తీరాలంటే ధర్మాన్ని ఆలంబన చేసుకోవలసిందే .
   పరమార్ధంలో బయట మనకు కనిపించే దుఃఖాలు పోగొట్టడమనే అర్ధం ఉన్నా ,నిజమైన అమ్మ యుద్ధం దేనితో
అనే ప్రశ్న చాలా అవసరం . ఎన్నో శరన్నవరాత్రులు ,వసంత నవరాత్రులు చూశాక ,ఎప్పుడూ ఈ పోరాటం మనలో
ఆగడం లేదనేది మనం గమనించ వచ్చు.మనను గెలిపించాలని అమ్మ ఆరాటం అర్ధం ఏమిటి ? చీడ పట్టిన చేనును 
రైతు జీవ కారుణ్యం ,ఆ జీవులు మనలాంటివే అంటే ,ఆజ్ఞానం [అజ్ఞానం]రైతుకు ఎంతవరకు మంచిది ?దీన్ని
సమానత్వం అనే పేరుతొ ఎంతవరకు సహించాలి ?దీన్నే శాస్త్రంలో అసుర లక్షణం ,మంచి లక్షణాల మీద చేసే
యుద్ధంగా గ్రహిస్తే ,దీన్ని రైతుకున్న పక్షపాత ద్రుష్టి అనడం ఎంతవరకు సమంజసం ?
   సర్వత్రా వ్యాపకమైన పరమాత్మ ఎవరి పట్ల అధిక ప్రేమను కాక ,మంచి లక్షణాల [ధర్మం]పట్ల ఉన్న బాధ్యత వల్ల
సక్రమ మార్గాన్ని మనకు పరిచయం కలిగించాడనికి ,నిరాకరమైన మౌన వ్యాఖ్యను ,శబ్దరూపమైన వేదరాశిగా , అందుకోలేని  వారికి ఇతిహాస ,పురాణ రూపంగా అందించాడు ,తపించిన మునుల ద్వారా . అలా మనకు అందిన
పూజలో,నిరాకరమైన మనసు ,పరమాత్మలో లయిస్తే ,ఉన్నది పరబ్రహ్మమే . అమ్మవారు చేస్తున్న యుద్ధం ఏమిటి
అంటే ,లీలగా కనిపిస్తున్న ఈ ప్రపంచ అంతా సాలీడు అల్లిన గూడులా అంతా , పరమాత్మ నుండే వచ్చింది . అందు లోనే ఉంది . మళ్ళీ పరమాత్మలో లయమౌతుంది .ఇది అందరికీ తెలిసిన సామాన్య సత్యం . కానీ ఎప్పుడూ దీన్ని
పట్టించుకోకుండా ,తను ,తన  కష్టాలు ,నష్టాలు ,వీటిని తీర్చడానికే పరిమితమైన పరమాత్మ . కలుగుతున్న సుఖ
భ్రాంతికి , తన ప్రతాపంతో తాను సాధించిన విజయాలకు కర్తననే అహం . ఇలా సాగే జీవుని ప్రయాణంలో ,సమయం
లోపల సామాన్య సత్యాన్ని తలకెక్కించాలనే తాపత్రయం అమ్మవారిది . దీనికే ఇంత యుద్ధం . ఉన్న పరమాత్మదే
సృష్టి లోని ప్రతి అణువు . అది నాది అంటే అమ్మ ఊరుకోదు . కర్తను నేను అంటే ఎలా ?శరీరంలో శక్తి అమ్మవారిది.
సృష్టి రూపంలో ఈశ్వరుని , ఆయన శక్తిగా సంపదను గుర్తించే వరకు ఆమె యుద్ధం ఆగదు . ఈ జ్ఞానం కలిగే వరకు
ధర్మ యుద్ధం చేసి ,ఆత్మా రాముడై జీవుడు వెలగాలి .

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

హిందూ ఆచార పరమార్ధాలు

   హిందూ  ఆచార పరమార్ధాలు.
హిందూ ధర్మ పరిధిని కాపాడుతూ ,ధర్మ పతాకాన్ని ఎగురవేసే బాధ్యత ,ఎక్కువగా స్త్రీలమీద ఆధార పడింది .
అమ్మగా అబ్బాయిలకు ,అమ్మాయిలకు కూడా వారి ధర్మాలను కాపాడుకునేలా చేసే బాధ్యత తల్లిదే . ఎందువల్లనంటే మగవారిని బయట పనులకు పంపి ,ఇంటి బాధ్యతను ఇల్లాలికి ,మన ధర్మం అప్పజెప్పింది . నాజూకుగా ఉండే పువ్వులను ఎండలో ఉంచము కదా . ప్రస్తుతానికి నేను వ్రాయబోయే విషయానికి ఇది చాలు .
 అన్నిటికి తాత్వికార్ధం మాత్రమే వ్రాస్తున్నాను .
1. స్త్రీ కంటే వయసులో పెద్దవారికి ఇచ్చి కన్యా దానం చెయ్యాలి . ఎందుకు ?
శక్తి స్త్రీ . అది కలిగినవాడు శివుడు . సృష్టిలో స్త్రీ శక్తికి ,పురుషుడు శివునికి సంకేతం . నిరాకార చైతన్య శివుని నుండి కదలి సృష్టిలో స్త్రీగా ప్రకృతి వచ్చింది . అంటే ఆద్యుడు పురుషుడు . అందువలన వయసులో కొంత పెద్ద అనేది గ్రహించాలి . కనుక ఆడ పిల్లలకు బొట్టు పెడతారు . అంటే ఆమె పుడుతూనే సుమంగళి . అందుకే ఒకవేళ ,[అమంగళము ప్రతిహత మగుగాక ]భర్తని కోల్పోతే కుంకుమ పెట్టుకోరు . కానీ ఎంతమంది సువాసినులు కుంకుమ
ధరిస్తున్నారో వారికి వందనాలు . ఎర్ర స్టిక్కర్లు కాదు .
2. సువాసినిలు పూజలు ,నోములు నోచినపుడు కూడా కాళ్లకు పసుపు రాసుకోరు.ఎవరికీ రాయరు . చేతికి
ఇస్తున్నారు .ఎందుకు ఆలా చెయ్యకూడదు ?
తమను తాము గౌరిగా నమ్మి, సుమంగళిని వాయనానికి ,పిలవడం అనేది వ్రతాలలో భాగం . పార్వతిగా నోములు . వ్రతాలు అన్నింటిని గౌరి దేవి మనకు పరిచయం చేసింది . అంటే ఆమె కన్యాదానం చేయబడినది . మనకు విష్ణువు
పార్వతి ,పరమేశ్వర కళ్యాణం చేస్తున్న ఫోటోలు చూస్తూనే ఉంటాము . అంటే అమ్మవారికి పుట్టిల్లు ,అన్నగాని , తమ్ముడు కానీ విష్ణు రూపుడే . పీత [పసుపు]రంగు వస్త్రాలను విష్ణువు ధరిస్తాడు . అంతే కాదు ,ధర్మానికి ప్రతీక
అయిన నంది యొక్క కొమ్ము ,భూమి మీద పసుపు కొమ్ముగా మారిందని ఐతిహ్యం . బృహస్పతి కూడా పసుపు
వర్ణం గుర్తు . అంటే ధర్మ రక్షణ చేసే స్త్రీలకు గురు అనుగ్రహం కలుగుతుంది .ఇది మాంగల్య బలానికి ఎంతో అవసరం  తాత్పర్యం ,పుట్టింటినుంచి తన అనుబంధానికి గుర్తుగా అమ్మాయి ,పసుపు ,కుంకుమ తీసుకు వస్తుంది . అంతే కాదు ఇక్కడికి [అత్తవారింటికి]  వచ్చాక సింహద్వారానికి  రాస్తుంది . అనుబంధాలు అక్కడ వరకేనని తాను దానం చేయబడి ,ఈ ఇంటికే వన్నె తెస్తాననే భావం ,అందులో ఉంది . దీనికి ఎవరికి వారు కట్టుబడి ఉన్నామా ?అని
ఆత్మ విమర్శ చేసుకోవాలి . విషయానికి వస్తే ,పసుపుతో తయారైన తోపు ఎఱుపు కుంకుమ ,ఐదవతనానికి గుర్తు .
సరే ,సుమంగళి అయిన స్త్రీ ,శివ శక్తుల కలయిక అయిన శ్రీ చక్ర బిందు రూపిణి . గౌరీ పరదేవత . రాహు గ్రహ అధి
దేవత .అంతే కాదు అమ్మవారిని చూచినపుడు ముఖపద్మం నుండి పాదాలవరకు చూడాలి . విష్ణువు లలితా ప్రతి రూపముగాను ,శివుడు ,విష్ణువు అర్ధ నారీశ్వరుడైన ,హరిహర మూర్తిగాను మనకు తెలుసు . విష్ణువును చూచి నపుడు పాదాలనుండి ,కిరీటం వరకు చూడడం పరిపాటి . అర్ధ నారీశ్వరుడైన పరమాత్మ సృష్టిలో,స్త్రీ ,పుం
రూపాలతో ప్రకాశించినపుడు ,ఆకాశ రూపంలో అంతటా ఉన్న విష్ణువే స్థితి కారుడై ,ప్రకాశిస్తున్నాడు . అంటే
విష్ణు రూపం వర్తమానం కనుక ,సృష్టిగా కనిపిస్తున్న ప్రకృతికి ,శివుని నుండి లీలగా ప్రపంచ రూపంలో కనిపిస్తున్న
విష్ణు ,గౌరీ రూపాలకు ,ఒకేసారి నమస్కరిస్తూ ,నుదుట బొట్టుపెట్టి అమ్మవారిని ,మెడకు గంధం వ్రాసి శివుని ,
అలానే పాదాలకు పసుపురాసి విష్ణువును పూజిస్తున్నామన్నమాట . ఇంత అర్ధవంతమైనది ,మనసంప్రదాయం .









19, సెప్టెంబర్ 2016, సోమవారం

దృశ్యం

దృశ్యం .
దృశ్యం అనేది మనసుమీద చాలా ప్రతిభావంతంగా పనిచేస్తుంది .అలా సమాజం మీద చాలా ప్రభావం చూపింది
సినిమా .దీనివలన సంఘంలో ఎక్కువగా నాశనమైనది హిందువుల ఆచార ,సంప్రదాయాలే . దేవాలయాలు ,
కుటుంబాలు ,వారసత్వ పూజా విధానాలు ,ఎంతో ఉన్నతమైన తల్లి ,తండ్రుల న్యాయ సమ్మతమైన హక్కు ఐన
పిల్లల వివాహ విషయాలు అన్నీ,దౌర్భాగ్యపు అవలక్షణాలు సినిమా వలన అంటే ఆశ్చర్యం ఏమిలేదు . ముఖ్యంగా
బ్రాహ్మణ సమాజం తన విలువలను ,వినోదం అనే చిన్న కారణంతో పోగుట్టుకుని ,అందరిచేత దూషించ బడుతొంది .
ప్రతివారికి అవసరమైన పూజ ,జప ,యజ్ఞ కార్యక్రమాలకు వీరిని ఉపయోగించు కుంటున్న సమాజం ,వినోదానికి
బలి అయిన వీరిని చిన్నచూపు చూస్తున్నది . ఎన్నో పురోహిత కుటుంబాలు తమ వృత్తిని కాదని పిల్లలను ఉద్యోగాలకు ఎప్పుడో అర్పించారు . కానీ కంప్యూటరైజేషన్ తో ఆగని వృద్ధి నెమ్మదిగా ,రొబోటిజం వైపు అడుగులు
వేస్తోంది . ఉద్యోగాలు తగ్గే పరిస్థితి ఇప్పటికే ఎక్కువగా కనిపిస్తోంది . అదే సమయంలో పూజ ,జప, దాన,యజ్ఞ
కార్యకలాపాలు పెరుగుతున్నాయి . కానీ రెండు ,మూడు తరాలుగా వేదాన్ని వదిలినవారు ,పిల్లలను మళ్ళీ అటు
వైపు మళ్లి0చ గలరా ?పిల్లలే వారిని, మీరు నేర్చుకోలేదు కదా అంటే సమాధానం లేదు . ఈ పరిస్థితులకు కారణం
సినిమా కాదా ?yes or no ?

15, సెప్టెంబర్ 2016, గురువారం

హిందూధర్మం

హిందూధర్మం ఎంతో సనాతనమై కోట్ల సంవత్సరాలుగా నిలిచి ఉన్నట్లు మనకు నిదర్శనాలున్నాయి . రాముని కాలంనాటి ఆనవాళ్లనిబట్టి చూచినా అర్థంచేసుకోవచ్చు . త్రేతాయుగం నమ్మితే ముందు సత్యయుగం ,హరిశ్చంద్ర
చరిత్ర ,భగీరథ చరిత్ర ,అంతరంగంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ,అని అలానే నిర్గుణ ,నిరాకార చైతన్య పరబ్రహ్మ
స్వరూపమైన తనను శివోహం అని గ్రహించినా ,ఆచరణ దశలో సత్య ధర్మాలను ఆలంబనగా జీవితాన్ని నడిపిన
తపస్సంపన్నుల కనుసన్నలలో  ఊపిరి పోసుకున్న చరిత్ర ,నాగరికత, పెద్దలు అందరూ చెపుతున్నట్లుగా జీవించే విధానం పేరు హిందూ ధర్మం .ఎంతో విస్తరించిన మహా వృక్షం నీడలో సేదతీరే సమాజం హిందువులది . ఎవరికైనా
సమృద్ధి ,సహజత్వం ,చూసినపుడు కలిగే ఈర్ష్య ,ద్వేషాలే హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు . ఇవే
మనకు పూర్వయుగాల్లో దశావతారాలను రప్పించిన రాక్షస ప్రవృత్తులు . కలిలో వివిధ మతాలుగా ,నాగరికతల
రూపంలో ఇప్పుడు కూడా అంతే ప్రభావం చూపిస్తున్నాయి . పులిని చూసి నక్క వాత అనేవే ఇతర మతాలు . కానీ
నక్కని చూసి పులి ఊళ లా ఉంది పరిస్థితి . ఎంతో కష్టపడి పెద్దలు అందించిన జీవిత విధానం వదులుకొని ,వెళ్లి
ఆకులు కట్టుకున్న ఆటవిక జాతుల నుంచి నేర్చుకునే కుహనా సంస్కారాలకు పెద్ద పీట వేసి ,వాళ్ళముందు
మేము కూడా చావుడప్పు వాయించగలం అని ,మృదంగ విద్వాంసుడు చెప్పినట్లు తయారయింది సమాజం .  

20, ఆగస్టు 2016, శనివారం

నామరూపాలు

నామరూపాలు
ఒక చిత్రకారుడు తనచిత్రాలలో 6చిత్రాలు ,కామ ,క్రోధ ,లోభ ,మోహ ,మద ,మాత్సర్యాలనే భావాలకు అనుగుణంగా అద్భుత చిత్రాలను గీశాడనుకుందాము . మనసు వాటిలో లయించినపుడు అంతే భావ స్ఫురణ కలిగి ఉండవచ్చు . కానీ
మనసు బహిర్గతమైనప్పుడు ,వీటి నిజానిజాలు గుర్తించే ప్రయత్నం చేస్తే ,నిజానికి కాగితము ,రంగులు తప్ప అన్యమేమీ
లేదు .కాగితమనే ఉనికి [existence]మీద ,గుణాలనే రంగులతో భ్రమింపజేస్తున్న సృష్టిని పరిశీలించి ,గ్రహిస్తే ఉన్నది ,నామ
రూపాలుగా వ్యక్తంఔతున్నది ,పంచభూతాత్మక ప్రకృతియే . మనసు నామరూపాలలో లయించినంత సేపు ఇది నిజమనే
అనిపిస్తుంది.కానీ గురుకృపతో జ్ఞానం ప్రకాశించినపుడు ,పరమాత్మ జ్ఞానం [ఉనికి]త్రమేప్రకాశించి,ప్రకృతిరూపమైన నామ       రూపాలు మభ్య పెట్టలేవు.చిన్న పిల్లవాడు కాగితం మీది బొమ్మను చూసి భయపడి నపుడు,పదే పదే భయపడినపుడు
తండ్రి చిత్రకారుని వలె ,కాగితాన్ని రంగులను చూపి అతని భయాన్ని పోగొడతాడు . కానీ ఇది కొంచెం పరిణతి చెందిన
వారికే ప్రయాజనం . బాగా చిన్న పిల్లలు పరిణతి లేనివారు దీన్ని అర్ధం చేసుకోలేనపుడు ,వారికి నచ్చేలా ,వేరే బొమ్మను
ఇచ్చి బుజ్జగించ వలసిందే . అవే వివిధ సాధనా మార్గాలు .
 

15, ఆగస్టు 2016, సోమవారం

అద్వైతం

అద్వైతం
           త్రిపురసుందరి . నటరాజ నర్తనానికి సాక్షి . పరమాత్మను నామరూపాత్మకంగా [సోపాధికంగా]తెలుసుకుని , త్రిపురాలయందు భగవత్ సాక్షాత్కారాన్ని గ్రహించి సాక్షిగా రమించే అమ్మ తీరు సాకార ధ్యానం . శక్తిని చైతన్యం అని దర్శించి , ఆ కదలికల లాస్యాన్ని అంతరంలో గ్రహించి ,చలించని ధృతిలో తనలో తాను మునిగిన మోని ,నిరాకార ధ్యాని .
ధ్యాని శివుడు ,ధ్యానం శక్తి . సాకార ,నిరాకార ధ్యానాల రెండింటా ధ్యాని శివుడు ,ధ్యానం శక్తి . శరీరం శివుడు ,శక్తి స్త్రీ . శరీరంలో శక్తి దాగి ఉంది . శరీరం ద్వారా మాత్రమే వ్యక్త మోతుంది . భారతీయ సంప్రదాయం ఈ విషయాన్నే స్త్రీ గోప్యతను 
పాటిస్తుందని తెలియజేస్తుంది . అంతేకాని స్త్రీని ఎక్కడా తక్కువ అని పేర్కొనలేదు .
          ఉనికి నామరూపాత్మక ప్రపంచంగాను ,చైతన్యం శక్తిగాను ,ఆనందం  మనస్సుగాను అర్ధం చేసుకుంటే ,సత్చితానందం
యొక్క సృష్టి రూపం ప్రపంచం  . సత్చితానంద బింబరూపానికి ,సృష్టి ప్రతిబింబం . ఏ ఒక్కరికి తాను ఉన్నాను అనడానికి అద్దం అవసరం లేదు .తన ఉనికికి   బింబ లక్షణాలు అన్వయించి జీవించడం ధర్మం.ప్రతిబింబ లక్షణాలతో అన్వయించడం  అధర్మం.నిరాకారమైన శివస్వరూపానికి ,సాకార విష్ణు రూపం ,ప్రారంభం .అంటే అనంతం, నామరూపాలతో వ్యక్తమైంది.అందు
వల్లనే దశావతారాది కృత్యాలు విష్ణుపరంగా వచ్చినవే.శివుడు విష్ణు కళ్యాణం చేసి నట్లు కనపడదు . విష్ణువు పార్వతి   పరమేశ్వర   కళ్యాణం చేసినది అందరికి తెలుసు .స్వస్థితిలో ఉండడమే పార్వతీ పరమేశ్వర కళ్యాణం . వీరికి శక్తి కావాలి అనే వాంఛ ఉండదు . ప్రతిబింబం తానుగా భావించినపుడు మాత్రమే ,తాను శరీర పర్యంత జీవి నని ,తన శక్తి పరిమితమైనది అని భావించి ,పరమాత్మ యొక్క నిరాకార తత్వం సాపేక్షమైనది కాదు కనుక ,శక్తి కొరకు తనకు నచ్చిన దైవరూపంతో ,తపస్సు చేసి ,అనంత శక్తిని కోరుకుంటాడు . కానీ ఇది ప్రతిబింబ జ్ఞానం కావడం వలన పరిధులు తప్పవు . కోరిక ప్రతిబింబ లక్షణం .   

3, ఆగస్టు 2016, బుధవారం

లక్ష్మి

లక్ష్మి 
   సమయము లక్ష్మీ స్వరూపము . కాలస్వరూపిణి ఆది లక్ష్మి . శుద్ధమైన మనసు[చంద్రుడు] మాత్రమే నిరాకరమైన సమయాన్ని గుర్తు పడుతుంది .అందువలన లక్ష్మి చంద్ర సోదరి .  సంకల్ప వికల్పాలు లేని సమయాన్ని లక్ష్మీ స్వరూపం అని గుర్తుపట్టిన ముని జనుల సమూహాలతో ఆవృతమైన జ్ఞాన స్వరూపిణి ,వేదాలచే స్తుతింపబడిన మోక్ష ప్రదాయిని . మోక్షము అద్వితీయమైన వర్తమానమే . ఇది ఎక్కడ ,ఎవరికి లేదు ?ఇది విష్ణు శక్తి . శ్రీ మహాలక్ష్మి . ఇంద్రియ ,మనో ,బుద్ధులు 
ఈ విషయాన్ని తెలిసి వర్తమాన క్షణాన్ని మౌనం అని గ్రహించి ఆక్షణంలో రమించేదే మోక్షం . ఇదే ధ్యానం .
       ఈ సమయాన్ని ఇంద్రియ మనో బుద్ధులు తమ ఆధీనం చేసుకుని విహరించేదే విష్ణుమాయ .కానీ కర్తవ్య కర్మ కొరకు కదలక తప్పదు . పని చేసే ఆ సమయంలో మాత్రమే దానికి సంబంధించిన వ్యవహారం కలిగి ,వేరొక పనిలో, మొదటి పని యొక్క ఆలోచనలు లేకుండా ఉండడమే ఏకాగ్రత .ఎన్ని జన్మల సంచితమైనా ఈ విధమైన ఏకాగ్రతను భంగంచెయ్యలేదు . వర్తమానంలో ఉండడం వలన , చైతన్యరూపమైన పరమాత్మ సన్నిధిలో ,పురాకృత కర్మ తన ప్రభావాన్ని కోల్పోతుంది .పురుష 
ప్రయత్నం అని పెద్దలు సూచించినది ఇదే . తన ప్రయత్నంతో ఇలాచేసే ఈ ప్రయత్నం భగవత్కృపతో సాధనగా మారడం 
ఎంతో సహజం . ధ్యానం సహజంగా కుదురుతుంది . భౌతిక ప్రపంచంలో చరించే దశలో ఏకాగ్రత సాధన . పని ఆగిన క్షణం 
శుద్ధమైన మనసు , నిరాకార సమయంలో మునగడమే ధ్యానం . అక్కడ ఉన్నది చైతన్యం యొక్క మూలం ,ఖాళీ కాదు .
మోక్షలక్ష్మి ,ఆది లక్ష్మి .
     ధాన్యలక్ష్మి-2
      ప్రపంచంలో చరించే దశలో మంచి ,చెడుల సంఘర్షణ సహజం .ఇది క్షిర సాగర మధనమే . మనసును మంచికి
ప్రేరేపించి కార్యసాధన చేయాలి . దీనినే దేవతల గెలుపు అన్నారు . దేవతలంటే ఇష్టమని ,రాక్షసులంటే అయిష్టమనే అర్ధం కాదు . పిల్లల దుష్ప్రవర్తన ఎవరూ సహించరు . అలానే మనసు చేసే మాయలో చెడుకి సహకరించక ,మంచిని ఎంచుకుని
సాగడం దేవతల గెలుపు . ఈ సాధన వలన సమయం అనుకూలిస్తుంది . అంటే లక్ష్మి కృప కలుగుతుంది .సాధన పరంగా
దీన్ని అర్ధం చేసుకోవాలే కానీ ,ఆర్ధిక పరంగా ఆలోచించి నిరాశ పడకూడదు . జన్మ పరంపరలనుండి దాటించే కృప కన్నా
ఐశ్వర్యమేముంది ?సమయమనే సముద్రంలో వ్యాపించి వసిస్తున్న మహాలక్ష్మి ,మనకు సర్వ సమృద్ధిని కలిగించే ధాన్యలక్ష్మి.
నిజానికి ,చిన్నప్పుడు బుద్ధిగా సమయాన్ని వినియోగించి సాగించిన అధ్యయనమే ,తరువాత ఆర్ధిక సమృద్ధిగా అంది వస్తుంది . అంటే సమయమే సమృద్ధి . అందుకే అమ్మ ధాన్యలక్ష్మి .
  ధైర్యలక్ష్మి -3
   ఎప్పుడైతే సమయపాలన విలువ తెలుస్తుందో , అపుడే మనో ప్రపంచం దాడి చేస్తున్న విషయం అర్ధం అవుతుంది . దీన్ని
గమనించి శ్రద్ధతో విష్ణు పాదాలయందు ద్రుష్టి నిలిపితే ,భవసాగరం భయపెట్టలేదు . విష్ణుపాదాలను పూజిస్తున్న లక్ష్మి కృప
కలుగుతుంది . విష్ణు పాదాలు ,అవి సూచిస్తున్నది , అహం యొక్క ఆధారభూతమైన చైతన్యాన్నే . రెండు పాదాలుగా
మనకు పరిచయమైన ద్వైత దర్శనలోని ,ఒకరే[అద్వైతం] కలిగిఉన్న రెండు పాదాలు. ఉన్న చైతన్యమే ,దృశ్యమానమైతే ,రెండు . చరించే ధర్మం ఒక పాదం . చెరించే దశలో కూడా తనలో స్థిరంగా తెలిసే చైతన్యం రెండోపాదం . ఎపుడూ వర్తమానంలో ఉండడంవలన కొత్తగా కర్మ ఏర్పడదు . వర్తమాన క్షణంలో ఎవరికీ అహం అనేది శరీర పర్యంతంగా భ్రమ
పెట్టదు . ఎందుకంటే రెండో వస్తువు ఉన్నపుడే పోలిక ,భ్రా0తి కలుగుతాయి . వర్తమాన క్షణంలో రెండోది లేదు . ఈదశలో పురాకృత పాపము అని తెలియబడుతున్నది కూడా ,మాయగా తెలియబడుతూ ,తన సత్తాను కోల్పోయి ,పాపక్షయం
అవుతుంది . భవ భయహారిణి ,పాపవిమోచని ,శ్రీ ధైర్యలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది .
సశేషం








11, జులై 2016, సోమవారం

నామరూపాలు

 
 నామరూపాలు 
       నామరూపాలు,ఖేదాన్ని కాక మోదాన్ని ప్రసాదించే విద్య మోక్షవిద్య . సర్వమ్ విష్ణు మయం జగత్ . కనుక 
నామరూపాలు కూడా విష్ణు రూపమే . భగవంతునిచేత రూపొందించబడిన విగ్రహాలే నామరూపాలు . వాటికి పరంపరా 
ప్రాప్తిత కర్మల ఫలాలతో కలిపి చూడక ,చైతన్యవంతమైన విగ్రహాన్ని మాత్రమే చూసి చేసే సేవ ,మాధవసేవ . దీనివలన 
క్రమంగా నామరూపాలు చైతన్యమనే ఎరుక బలపడుతుంది . దీనికి మానవ సేవ పేరుతో చందాల అవసరం లేదు . తాను 
ప్రపంచంలో తనుకాక ఎవరితో మెలిగినా అదే స్పృహ కలిగి ఉండాలి . దీనివల్ల క్షమాది షట్క సంపత్తి ఏర్పడుతుంది . దీనివలన మానవ సంబంధాలు బలపడతాయే కానీ చెదిరిపోవు . అంతే కానీ ,నామరూపాలతో ప్రాప్తిత కర్మను కలిపి చూడడం వలన కామక్రోధాది దుర్లక్షణాలు కలుగుతాయి . కానీ కర్మతో ముడిపడిన అనుబంధాలు ధర్మబద్ధంగా అనుసంధానం చేసినపుడు మాత్రమే జీవనం సార్ధకత పొందుతుంది .
          నామరూపాలు ,ధ్యాన సమయంలో తన ఉనికిలో నిలువనివ్వక ,మనో సామ్రాజ్యం ఆహ్వానిస్తుంది . ఎప్పుడూ
ఖాళీ లేకుండా పరుగులు తీసే అలవాటు వల్ల ,ధ్యానం అనగానే ఆ తీరికని వాడుకోడానికి మనస్సు ఎంతో ఉత్సాహంగా
తన ప్రతిభను ప్రదర్శించి ,మాయలేడిలా భ్రమ పెడుతుంది . సీతలా శరీర పర్యంతంగా తనను భావించే అహం ,లేడివెనుకే
చైతన్యాన్ని పంపుతుంది . మిగిలినది అందరి ఎరుకలోని ,ధ్యానం అనే స్ఫురణ జారిపోవడమే జరుగుతుంది .దీనికి తోడుగా ధర్మ బద్ధమైన జీవన విధానం ,శరణాగతి ,ప్రపత్తి అనే మూడు ఆయుధాలతో ,దశానన చెరనుండి ,పరమాత్మ కృపతో
రామపత్నిగా ,రాజపత్నిగా మోక్షాన్ని జీవులు పొందవచ్చు .
      సీత ఎప్పుడు రామునిదే . అలానే సృష్టి ఎప్పుడూ పరమాత్మదే . సృష్టికి పూర్వము ,సృష్టిగాను ,సృష్టినుండి లయించిన తర్వాత కూడా . యిలా మూడుగా గాని ,జీవాత్మ పరమాత్మ యిలా రెండుగా గాని అనిపించడమే మాయ. దీనికి పెద్దలు
చూపిన ఉపమానము ,ఘట లేదా మఠ ఆకాశము . ఇవి తయారైనప్పుడు ఆకాశం ఏకమే . అవి అలా ఉన్నప్పుడూ ఆకాశమే ,కుండ విరిగినా ,మఠం కూలినా ఉన్నది ఆకాశమే . నిద్రలో ఉన్న వారికి వారు లేరనే అర్ధం లేదు . ఉన్నారు కానీ
తెలియడం లేదు . మెలకువలో తాను ఉన్నాననే స్పష్టత ఉన్నది . మెలకువ లోని స్పష్టత మాయతో కూడి ఉన్నది . దీన్ని మాయా ముక్తం చేయడం కర్తవ్యం . మాయలేడి వెంట వెళుతున్న చైతన్యం మనకు దొరకదు . అందుకే ధ్యానం . దీన్నే
ఆలోచనకు సాక్షిగా ఉండడం అంటారు . దీనికి తనలో విషయాన్ని తెలుసుకోవాలనే తపన ముఖ్యం . రోజులో ఎన్ని సార్లయినా ,ఎవరు ఆలోచిస్తున్నారు ?వింటున్నారు?చూస్తున్నారు ?అని మనసుని నిలిపితే ,మోనమే సమాధానం .
కానీ తెలుసుకుంటున్న వారుగా అక్కడ ఉన్నారు . మోనానికి అర్ధం ఉండడం . అదే ఉనికి . కానీ ఉన్నది శరీర పర్యంత
వ్యక్తి కాదు . పరమాత్మ . అక్కడే ఉంటే పరమాత్మ . దేహంతో తాదాత్మ్యం చెంది చెప్పినా ,విన్నా ,ఏం చేసినా జివి .
దీన్నే మోన వ్యాఖ్య అంటారు . మోనంలో ఉన్న చైతన్యం పరమాత్మ మాత్రమే . ఆలోచన మొదలైన క్షణం సృష్టి . సృష్టి
లేకున్నా ఉనికి ఉన్నది . కానీ ఉనికి లేక సృష్టి లేదు .దీన్ని శంకరాచార్యులవారు కోహం అని ప్రశ్నించారు . దీన్నే
రమణులు ఎవరు నేను ?అన్నారు .
   









       

6, జులై 2016, బుధవారం

వరాలు ,శాపాలు .

      వరాలు ,శాపాలు .
మనం పొందే సుకృత ఫలాన్ని ,వరమని ,దుష్కృత ఫలాన్ని శాపమని ప్రస్తుత జన్మలో పొందుతాము . ఇది అనివార్యము .
అలానే ఇబ్బందులు కలిగినపుడు జాతకాన్ని పరిశీలించి ,వాటికి పరిహారాన్ని చేయించుకోవడం పరిపాటి. కాలసర్ప దోషాలు 
పితృ దోషాలు ,ఇలా రకరకాలు ,వాటి పరిహారాలు అందరికి తెలిసినదే . వంశంలో తరతరాలు ఆస్తిలా అనుభవించే దోషాలు
ఉంటాయి . ముందు తారాలలో జరిగిన పొరపాట్లకు ,తరువాతి తరంలో ఇబ్బందులు తప్పవు . దీనికి ఉదాహరణయే
భగీరథ చరిత్ర .దీనికి భగీరధుడు ఎందుకు తపించాలి ?హాయిగా జీవితాన్ని అనుభవించ లేకనా ?దీన్ని కృతజ్ఞత అంటారు .
 రాబోయే తరాలపట్ల దయ . అందువల్లనే కదా రాముడు ఆ వంశంలో కలిగాడు . మన విషయాలకు వస్తే ,నాస్తిక వాదం
పేరుతోనో ,అశ్రద్ధ చేతనో ,నా కర్మ ఇంతే అనే నిరాశతోనో ,జీవితాన్ని అలానే గడిపెయ్యవచ్చు . కానీ ఎప్పుడో పెద్దలు చేసిన
దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం . అనేదానిలోని సాధక బాధకాలు ఒకసారి చూద్దాం . సర్వసాక్షి అయిన పరమాత్మ
అంతరంగం నుండి అన్ని పాపపుణ్యాలు లెక్క కట్టి నూతన జన్మను ఇస్తాడు . జనన మరణాల మధ్యన స్వర్గ నరకాలలో
కర్మ తూకంలో సరి సమానమైనపుడు ,తిరిగి మానవజన్మ సాధ్యం . తండ్రి తననే పుత్రునిగా పొందుతాడనేది శాస్త్రం .
అలా వంశంలో పూర్వము తాను చేసిన కర్మకు తానే బాధ్యత వహిస్తూ మళ్ళీ అదే వంశంలో జన్మిస్తాడు వ్యక్తి . అందువలన
తనకర్మకు తానే కర్త కనుక సర్వులూ సరి అయిన ప్రాయశ్చిత్తాన్ని గ్రహించి ,పూర్వులను ,తమ తరాన్ని ,రాబోయే తరాలను
రక్షించుకోవాలి . ప్రాయశ్చిత్తానికి తగిన శరీరం పొందినందుకు భగవంతునికి ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా సరిపోదు .

29, జూన్ 2016, బుధవారం

పరంపర

                                                       పరంపర
అమ్మ నేర్పితే అన్నం తినడం వచ్చిమ్ది . అదే బాటలో అన్నీ చెప్తేనే వచ్చాయి . భౌతిక విషయాలకే ఇది అవసరమైతే భగవంతుని చేర్చడానికి గురువు ఎంత బాధ్యత వహిస్తారు ?అదే పరంపర . అందరూ చెప్తున్న షిర్డీ సాయి ,ఎల్లప్పుడూ 'అల్లా మాలిక్'అన్నారేకాని ,రామ ,కృష్ణ అనలేదు . దేవత నామాన్ని కూడా ఉచ్చరించని వారికి ,హిందువులు గుడి కట్టడం శోచనీయం . మీ పూజ మీరు చేసుకొండి అన్నారు .కానీ ఆయనకు గుడి కట్టమనలేదు . భగవన్నామం చెయ్యండి అన్నారుకాని ,తన నామజపం చెయ్యమనలేదు .ఏనాడూ విగ్రహారాధన చెయ్యలేదు . విగ్రహారాధన చెయ్యని వారికి గుడిలో పూజలేమిటి ? నిజానికి వారి అనుయాయులు 'అల్లా మాలిక్ 'అనాలి అంత గౌరవం ఉంటే గుడి కట్టేకన్నా పాతమసీదులు బాగుచేసుకుని అల్లా మాలిక్ అనాలి .
        ఆచార ,సంప్రదాయాలు పాటించ వలసిన అవసరం లేదని ,సంధ్యావందనాది క్రియలకు దూరమై, భగవదత్తమైన సంప్రదాయానికి తిలోదకాలిచ్చే వారికి ,బాసట మాత్రమే సాయి భక్తి . దీని వలన అనాచారం పెరిగి సర్వమూ సంకరమైనది . ఎన్నో రూపాలతో తన దరికి ఎవరినీ రానీయక, శ్రేష్ఠ మైన అర్హునికి మాత్రమే ఉపదేశం చేశారు దత్తులు .పరశురామునికి శ్రీవిద్యని ఇచ్చి ఉపాసనా ఫలంగా మాత్రమే పరబ్రహ్మతత్వాన్ని వారికి ప్రతిపాదించారు . శ్రద్ధతో శ్రాద్ధ క్రియలు జరిపే ఇంట జన్మ స్వీకరించి తమ తమ ఆచార వ్యవహారాలు తప్పక పాటించమని సూచించారు . కొన్ని మహిమలు చేసినంతమాత్రాన వారిని దేవతలుగా మనవారు ఎన్నడూ గ్రహించ లేదు . సాధన దశలో ప్రాప్తిమ్చే సిద్ధితో ,మందిని పోగుచెయ్యడం అనుష్ఠానానికి వ్యతిరేకం . ఆచరణ అవసరంలేని వేదాంతం , సన్యాసికి మాత్రమే . సన్యాసం ధర్మాలు గృహస్తును పాటించమని ఎవరూ అనరు . గృహస్తు అంటే తనవిధిని పాటించ వలసినదే .విధి ,నిషేధాలు అవసరం లేని విషయం ప్రపంచంలో లేనే లేదు . శృతి సమ్మత జీవన శైలి పరంపరా ప్రాప్తంగా అందరూ జన్మతో కలిగి ఉంటారు . దానినే ధర్మం అని గురువు తెలియజెయ్యాలె తప్ప క్రొత్త విధానాలు ప్రవేశపెట్టి తికమక పెట్టడమే తప్ప ,అన్యంగా వేరే ఏమి లేదు .షిర్డీ సాయిని దత్తాంశగా భావిస్తున్నారు.
          శ్రీ దత్తులు 24 ప్రకృతి పరమైన అంశాలనుండి తాను నేర్చుకున్న విషయాలను తెలియజేసారు తప్ప ,ఎవరిని తమగురువుగా ప్రకటించలేదు .ముందుగా అనుకున్నట్లు శ్రీ దత్తులు ,ఎవరికి ఎంతవరకు అవసరమో అంతే అందేలా ఎన్నో విచిత్రాలు చేశారు . అందులో భాగంగా నామరూపాలకు అతీతంగా గురు తత్వాన్ని గుర్తు పట్టి సూచన గ్రహించాలి కానీ గుడులుకట్టి ,సినిమా ట్యూన్ భక్తి పాటలతో ఎవ్వరూ ఏదీ సాధించేది లేదు . గురువుచూపిన మార్గాన్ని నడవాలే కానీ గురువుకు గుడికట్టి ,సొంత నామావళితో పూజ కాదు . నారదుడు వాల్మీకికి రామనామాన్ని ,అలానే ధ్రువునికి నారాయణ నామాన్ని ఉపదేశిస్తే ,వాళ్ళు ఉపదేశించిన నామాన్ని జపించారే తప్ప నారద నామాన్ని కాదు .నమస్కరించ వచ్చు కానీ గురు బ్రహ్మా ... కానీ, గుడులు అవసరం లేదు . మీ పెద్దలు నడిచిన దారిలో నడవమన్న గురు వాక్యాన్ని విస్మరించి గుళ్ళు కడితే,తోటమాలి తోటపని మాని యజమాని పేరు జపించినట్లు ఉంటుంది. దీనికి మనవాళ్ళు పెట్టిన పేరే విష్ణుమాయ .





4, మే 2016, బుధవారం

త్రిపుటి

     సృష్టిలోని ప్రతి విషయము త్రిపుటికి అనుసంధానమోతుంది . కర్మ ,భక్తి ,జ్ఞానము . చాలా విషయాలు ,పలు మాధ్యమాల్లో వింటూ జ్ఞాన పరిపూర్ణులైనట్లుగా భావించడం ఇప్పుడు అత్యంత సహజం . అందులో మొదటిగా భ్రమింప
చేస్తున్నది ,తమోగుణ రూపమైన అహం . తన శరీర పర్యంత వ్యాప్తిత ,చైతన్యం తన స్వంతమని ,తాను దానికి
యజమానిగా భావించి ,తనకు తానుగా పొందే భావం అహం . ఇది తమోగుణ లక్షణం .
     దీనికి అనుసంధానమైన వెర్రితలలు చూద్దాం . భగవద్గీతను ప్రమాణంగా చెబుతూ ,కోరిక లేకుండా పరమాత్మను
పూజించాలి . ఆశ్చర్యంగా ఉన్నా ఒక విషయాన్ని గ్రహించాలి . నిజానికి ఇది స్థితప్రజ్ఞ లక్షణం . దీన్ని సాధనాపరంగా
చూడకూడదు . ఇది చేరిన స్థితి . శరీరాభిమానం ఉన్నంత వరకు ,కోరిక ,బాధ ,అవమానం వేధిస్తాయి . వీటిని
పరమాత్మకు చెప్పకుండా ,పూజ ముగించి ఏ కోరికా లేకుండా ఉన్నానని తనకు తాను మభ్యపెట్టుకోవచ్చు . కానీ తన
విషయాలను ఆత్మీయులతో పంచుకోకుండా ఎవరూ ఉండరు . అంటే ఓదార్పు వారి నుండి ఆశించే కదా .తనది ధర్మమైనా అధర్మమైనా ,సమర్ధించి తనపక్షాన మాట్లాడేవారితోనే కదా చెప్పేది?అంటే పరమాత్మకన్నా అధికంగా తనకు వారు ముఖ్యులు . ఇది పూర్తిగా తమోగుణ లక్షణం . తన శక్తితో తాను పనులు చేస్తున్న అహం చేస్తున్న అట్టహాసం . [కర్మ]
    పూజలో తనముందు ఉన్నది విగ్రహరూపంలో ఉన్న నిరాకార ప్రత్యక్ష పరమాత్మగా సంభావించి ,తన కష్ట సుఖాలను
ఎంతో ఆర్తిగా పంచుకునేదే పూజ . తనకు పరమాత్మ తప్ప వేరే దిక్కేలేదు చెప్పడానికి . ఇది భక్తి . ఆయనకు ,వస్తు సముదాయంతో కానీ ,మానసికంగా కానీ సమర్పించే ఉపచారాలకన్నా ,తనే తప్ప వేరే లేదనే భక్తుని భావమే భగవంతుని
ప్రసన్నుణ్ణి చేస్తుంది . [భక్తి ]దీనికి గమ్యం జ్ఞాన సిద్ధి . పరమాత్మకన్నా తనకెవరూ లేరనే ఉపాసన అన్నిటికన్నా మిన్న .
ప్రతి సందేహము తీరుతుంది . అలసట తీరుతుంది . ఓర్పు ఏర్పడుతుంది . సహనం సహాయపడుతుంది . చివరగా సర్వే
సర్వత్ర పరమాత్మగా ప్రకటితమై ,చెప్పేవాడు మిగలక ,చెప్పేవి లేని స్థితి ,స్థిత ప్రజ్ఞత్వాన్నిస్తుంది . పరమేశ్వరార్పణమస్తు .




26, ఏప్రిల్ 2016, మంగళవారం

మాయ

మాయ . ఉన్నది లేనట్లు ,లేనిది ఉన్నట్లు కలిగే భ్రాంతి . చక్కనైన ఉదాహరణ కలే . ఆ సమయంలో అది లేదని ఎవరూ అనలేరు . అమ్మవారిని  ,మాయ అని కూడా అంటారు .జ్ఞాన స్వరూపిణి ,ముక్తి ప్రదాత కూడా . ఎలా విడదీయాలి ఈ
చిక్కుముడి ?నేను అని భావిస్తున్న శరీర భావన ,నిజానికి తనకు సంబంధం లేనిది . పరాయి సొత్తును తమ సొత్తుగా
ప్రకటించినపుడు ,దాని యజమాని ఎందుకు అంగీకరిస్తాడు ?నిజానికి సృష్టి అంతా అర్ధనారీశ్వరమే . శరీరం శివుడు ,శక్తి
అమ్మవారు . దీన్ని మరచి ,శరీరం తనదంటూ ,దాని వ్యవహారాలు తనవంటూ ,కర్మ వలయంలో చిక్కి ,జీవుడు
తనను తానే బంధించుకున్నాడు . పైగా భగవంతుని దృష్టిలో తరతమ బేధాలున్నాయని ,సృష్టిలోని బేధాలను వేలెత్తి
చూపుతారు . దీనికి కారణం తను వహించిన కర్తృత్వం అని ఎన్నడూ భావించడు . పరమాత్మ కృపతో సాధన సాగితే ,
సృష్టిని పరమాత్మ క్రీడగా భావించి ,అన్ని శరీరాలను పరమాత్మగా భావించి ,తనపాత్రను ఏమరపాటు లేక ,తొట్రుపడక
జీవించినపుడు మాత్రమే ,మాయవరణం తొలిగి ,అమ్మవారు ముక్తి ప్రదాతగా అనుగ్రహిస్తారు . అమ్మవారి సృష్టిలోని ఏ కణం
తనది అన్నా మయావరణం వీడదు .

28, ఫిబ్రవరి 2016, ఆదివారం

ప్రతిబింబం

   ప్రతి బింబ న్యాయం .
ప్రతిబింబం రెండు విధాలుగా మనకు సరి అయిన బింబ దర్శనానికి సహకరించదు . 1బింబం సరిగా లేనపుడు ,ఎలాగూ సరిగా కనిపించదు . 2అద్దం మురికిగా ఉన్నప్పుడు సరిగా ప్రతిఫలించదు . 1భౌతిక ప్రపంచ విషయాలు . తనను సరి చేసుకుని ప్రతిబింబ రూపమైన జగత్తును చూడాలి . 2పరమాత్మ విషయంలో బింబం ఎప్పుడూ మార్పు లేకుండా ఉంది .
అంతే నిష్కల్మషంగా అనుభవానికి అందాలంటే ,మనస్సనే అద్దాన్ని శుద్ధ సత్వాన్ని ఆశ్రయించి శుభ్ర పరచి ,బుద్ధి యోగంతో
పరమాత్మను సంధానం చెయ్యాలి .
   బుద్ధి యోగం .
 జగత్తు ,పరమాత్మగా సత్యం . ప్రపంచం బాహ్యంలో ఉన్నది . అప్పటి వరకు అది పరమాత్మ . కానీ అంతర ప్రపంచం
వస్తు ప్రపంచం కాదు . నిజానికి ఇది వీడియో ,ఆడియో తప్ప వేరుకాదు . కానీ దీనికి సత్యత్వాన్ని ఆపాదించి ,జన్మ
పరంపరను ఆహ్వానిస్తున్నాము . దీనికి సాక్షిగా చూచే వినే ,చైతన్యం స్పష్టంగా తెలుస్తున్నా గమనించక పడే అనర్ధమే
బంధం .

13, జనవరి 2016, బుధవారం

ధర్మపత్ని

ధర్మపత్ని . 
                భర్త స్వరూపం ధర్మం ,కాగా దాన్ని ధ్వజంలా నిలబెట్టే భారాన్ని వహించే ,సహధర్మచారిణి . అతడు ధర్మాన్ని విడువక ,అనుసరింప జేసేలా ,తన ప్రవర్తనకు తానే బాధ్యతను వహిస్తూ ,పిల్లలకు ,ధర్మమే ప్రాతిపదికగా 
ఆచరించి చూపే చుక్కాని ,ధర్మపత్ని .
 1. అయస్కాంతాన్ని అతుక్కుని ఇనుము తన ధర్మాన్ని పాటిస్తూ ,అయస్కాంత ధర్మాన్ని మనకు తెలిసేలా చేస్తున్నది . 
చూడడానికి అయస్కాంతం ఇనుప ముక్కలాగానే ఉంటుంది .కానీ ఇనుమును పట్టి ఉంచడం దానిధర్మం కాగా, సహకరించిన కారణంగా,అవ్యక్త స్వభావం ,వ్యక్త మైనది . అవ్యక్త ప్రపంచం వ్యక్త మైందిలా .ఇనుము అయస్కాంత రాపిడితో అయస్కాంత మైంది కానీ ,అయస్కాంతం ఏ నాడూ ఇనుపముక్కగా మారింది లేదు . ఇదే కుటుంబ వ్యవస్థ .దీన్ని పదార్ధ భావంతో 
విమర్శిస్తే ,మిగిలేది పదార్ధ భావమే ,కానీ యదార్ధం గ్రహించడం ,చైతన్య లక్షణం .