స్వభావం.
ప్రతి మనిషిలోను స్పష్టంగా అందరిలో కనిపించే లక్షణాలు కొన్ని ఉంటాయి. ఇవి సహజమైన నిత్య సత్యమైన పరమాత్మ లక్షణాలు. అవి ఎప్పుడూ తాను ఉంటాననే నమ్మకం. అంతా తెలుసనే లక్షణం. ప్రకటితం కాకున్నా తనలో తనపట్ల సంతృప్తి.ఇవి సతిచ్చిదానంద లక్షణాలు.ఎప్పుడూ ఉండడం సత్ లక్షణం.తెలుసు అనేది చిత్, ఆనందం సంతృప్తి.ఇవి లేని మనిషి ఉండరు.కానీ వీటిని శరీర పర్యంతంగా భావించడమేఅవిద్య.అలానే పరబ్రహ్మ తత్వంలో, అహం ప్రజ్ఞ తెలిస్తే సృష్టి.ఇదే అద్వైతంలో ద్వైతం.స్పందించిన అహం తిరిగి స్వస్థితిని పొందాలనే సహజమైన కోరిక మోక్షం.ఇది శరీర పర్యంతమైనపుడు,బాహ్యంలో జంట కోసం వెతుకుతుంది. కానీ అంతరార్ధంగా గమనిస్తే,ఇది నిజానికి తనలోనే ఉన్న తనను చేరడమే.బాహ్యంలో స్త్రీ,పురుష బేధం తెలిసే 8సం. వయసు నుండి పరమాత్మ జ్ఞానాన్ని అందించ గలిగితే ,తమలో
కలిగే భావాలకు మూలం తెలియడం వలన పిల్లలు, తమను తాము అనవసర భావజాలం నుండి కాపాడుకో గలుగుతారు.శ్రీరాముని యోగ వశిష్ఠ అనుభవం ,ఈవిషయాన్ని తెలియ జేస్తున్నది.అనవసర సమయంలో,అక్కరలేని విషయాలనుండి పిల్లలను కాపాడుకోవచ్చు.విజ్ఞానం అవసరం లేని పశు జనాలకు మాత్రమే తినడం తెలిశాక, తరువాత ప్రత్యుత్పత్తి మాత్రమే గమ్యం.కానీ మానవ జన్మ పరమార్ధం
గ్రహించాలి.
dear sir very good blog and very good content
రిప్లయితొలగించండిSuryaa News