25, జనవరి 2018, గురువారం

సనాతనం

సనాతనం . 
        విశ్వం విరాట్పురుషుని ,విశ్వరూపం. బ్రహ్మాండంలో ఏది ఉన్నదో అదే పిండాండంలో ఉందని శాస్త్రాలు తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఏదైతే శాస్త్రం ,బ్రాహ్మణ ,క్షత్రియ ,వైశ్య ,శుద్ర అనే వర్ణ విభాగాలు 
తెలియజేస్తున్నదో, అది ఒకే శరీరంలో ప్రతీకాత్మకంగా తెలియబడుతున్నది. ధర్మార్ధకామమోక్షాలు ఒకే సాధనను 
తెలియజేసినట్లే ,సోపాన క్రమంగా వర్ణ విభాగాలు కూడా ఇదే అంతరార్ధాన్ని తెలియజేస్తున్నాయి. 
అహం , శరీరాన్ని ఉపకరణంగా వాడుకుని ఈ నాలుగు వర్ణాలను తనలోనే కలిగి ఉన్నది. తననే సర్వస్వం అనుకుని 
సకలము తానే సాధిస్తున్నాననే అహంకారం క్షత్రియ ప్రవృత్తి . చూసినవన్నీ తనకే కావాలి ,అనే  భావంతో వైశ్యత్వము ,శరీర సుఖం తప్ప అన్యమేది అక్కరలేని తత్వం శుద్ర లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ మూడింటిని 
సాధనాలుగా తెలిసి ,మనోబుద్ధిచిత్తాహంకారాలు, పరమాత్మ సేవకు ఉపయోగపడేలా ,బుద్ధి ప్రయత్నం చేస్తే క్రమంగా శుద్ధ సత్వగుణాన్ని పొంది ఆత్మ ,పరమాత్మగా అనుభవాన్ని పొందుతుంది. బుద్ధి ప్రయత్నం ,పరమాత్మ కన్నా అన్యం లేదని తెలిసి సాధన  చేస్తున్న దశలో శరీరాన్ని త్యజిస్తే బ్రాహ్మణ జన్మను ,దేన్నో శరీరహంతో సాధించే దిశలో
శరీర ప్రయాణం క్షత్రియత్వాన్ని,ఐశ్వర్యమే జీవిత పరమార్ధమైతే జీవి వైశ్యత్వాన్ని,శరీర సుఖమే జీవన సూత్రమైతే
శుద్రుని ఇంట జన్మ సాకార మోవుతుంది. 

21, జనవరి 2018, ఆదివారం

సనాతననం

సనాతనం. 
         ధర్మార్ధ కామమోక్షాలు ,జీవ బ్రహ్మైక్య, సోపానాలుగా గ్రహించి చరించే విధానాన్ని,ఆచార సంప్రదాయాల 
రూపంలో అందించింది మన శాస్త్రం. దీన్ని అనుసంధానం వలన ,సాధన పటిష్ట మోతుంది. మనస్సు ,హృదయంలో 
అణిగి ఉండడం మోక్షం. మనసు ,చేతనతో కూడి ఉన్నప్పుడే విషయ జ్ఞానం కలుగుతుంది. ఇది లేకపోతె పరధ్యానం 
అంటాము . అంటే బాహ్యంలో గాని ,అంతరంలో గాని మనసు చరించాలంటే చేతన సహకరించాలి. కాబట్టి ఈ జంట 
కలిసి మాత్రమే చరించ గలదు. మనసు చరించక హృదయంలో అణిగి ఉండడమే మోక్షం. దీనికి సాపేక్షంగా గృహిణి 
ఇంట్లో ఉండాలి అని ఆచారంగా చూపి ,సాధనా క్రమాన్ని సూచించారు పెద్దలు. 

20, సెప్టెంబర్ 2017, బుధవారం

సనాతనం

సనాతనం. 
    
      శ్రీ గురుభ్యో నమః . 
మన వాగ్మయంలో ఇతిహాసాలు ,పురాణాలూ చదివినకొద్దీ కొత్తగా అర్ధం అవుతూ ,తమలో దాగిఉన్న రహస్యాన్ని ,పరమాత్మ కృపతో బుద్ధికి ప్రచోదనాన్ని అందిస్తాయి . ఇలా నాపరిధిలో వీటి అంతరార్ధం అందించే ప్రయత్నం చేస్తాను . 
    ముందుగా హరిద్రాగణపతి పూజను కొద్దిగా పరిశీలిద్దాము . ఈయనను అమ్మవారు తనవంటి నలుగుతో తయారు చేసింది . తండ్రి ద్వారా రెండవసారి తలను పొందాడు . ఎంతోమంది విజ్ఞులు దీనికి వ్యాఖ్యానాలు చేసారు . పృధ్వితత్వంతో తయారైన శివశక్తి ఏకరూప పరమాత్మ రూపంగా నేను భావిస్తున్నాను . అలానే మానవుని దేహం పృథ్వితత్వంతో ,తల్లి, దండ్రుల ఏక రూపమై జనిస్తున్నది . ముందుగా చేసే హరిద్రా గణపతిపూజలోని తత్వంలో శరీరాన్ని కూడా పరమాత్మరూపంగా గ్రహించి ,దానికి తగినంత అన్నపానాదులతో పోషించి ,దానిని పరమాత్మ పూజకు జడత్వంలేకుండా సహకరించేలా చూసుకుని ,అంతకన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత నియ్యక ,దేహాత్మభావాన్ని పక్కకుపెట్టి ,పరమాత్మను సేవించాలి . లఘువుగా ప్రతిపూజకు ముందు ఇది తప్పదు . 
    వినాయక వ్రత కల్పంలో ఓంకార రూపుడైన అనంత తత్వం గణపతిగా ఆవిర్భవించి గణాధిపత్యం వహించడం గురించి 
ఒకసారి చూద్దాము . ఒకే శరీరంలోని శరీరరూపం ,వినాయకుడు ,జీవరూపం సుబ్రహ్మణ్యుడు . ప్రతివారికి బాల్యంలో ముందుగా పరిచయమయేది శరీరం . బాల్యమునుండి తల్లితండ్రులు భగవద్భక్తిని వారికి అలవాటు చెయ్యాలి . అందరిలో శివ శక్తులే నిండియున్న విషయాన్నీ తెలియజేయాలి. ఈవిషయాన్ని బాగా అర్ధం అయ్యేలా చెయ్యాలి . అపుడు వ్యక్తి ఎవరిని చూసినా పరమాత్మ అనేభావాన్ని అనుసంధానం చేయగలుగుతాడు . ఇదే మనకు గణాధిపత్యం కొరకు పోటీ పడిన వినాయకుడు సుబ్రహ్మణ్యుడు విషయంలో కూడా కనిపిస్తున్నది . ముందుగా గణపతిలా శివ శక్తులే సకలము అని భావించడం వలన ,సుబ్రహ్మణ్యుడు భూప్రదిక్షిణ సమయంలో ,వినాయకుడే కనిపించాడు . అంటే అంతటా తల్లి తండ్రుల 
ఏకరూపమైన వినాయకునిగా సుబ్రహ్మణ్యునికి అవగతమైనది . శరీరం తాను కానప్పుడు ఫలం శరీరానికే అందడం ,అనేది ఆలోచించ వలసిన విషయం . కొద్దిగా గమనిస్తే పురాకృత కర్మ ఫలాలను శరీరం ద్వారా మాత్రమే పొందగలం . అందువల్ల సుఖానుభూతి కూడా అదే సమయంలో మనసు అక్కడ లేని కారణంగా సాధారణంగా ఇది శరీరానికే అన్వయ మోతుంది. అపుడు అలిగాడు సుబ్రహ్మణ్యుడు. శివుడు, సర్వ జీవులలోను పరమాత్మని చూడడమే ,నిజమైన ఫలమని ,అంతటా నిన్నే చూచిన నీవేకదా నిజమైన ఫలం అన్నాడు .