15, సెప్టెంబర్ 2016, గురువారం

హిందూధర్మం

హిందూధర్మం ఎంతో సనాతనమై కోట్ల సంవత్సరాలుగా నిలిచి ఉన్నట్లు మనకు నిదర్శనాలున్నాయి . రాముని కాలంనాటి ఆనవాళ్లనిబట్టి చూచినా అర్థంచేసుకోవచ్చు . త్రేతాయుగం నమ్మితే ముందు సత్యయుగం ,హరిశ్చంద్ర
చరిత్ర ,భగీరథ చరిత్ర ,అంతరంగంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ,అని అలానే నిర్గుణ ,నిరాకార చైతన్య పరబ్రహ్మ
స్వరూపమైన తనను శివోహం అని గ్రహించినా ,ఆచరణ దశలో సత్య ధర్మాలను ఆలంబనగా జీవితాన్ని నడిపిన
తపస్సంపన్నుల కనుసన్నలలో  ఊపిరి పోసుకున్న చరిత్ర ,నాగరికత, పెద్దలు అందరూ చెపుతున్నట్లుగా జీవించే విధానం పేరు హిందూ ధర్మం .ఎంతో విస్తరించిన మహా వృక్షం నీడలో సేదతీరే సమాజం హిందువులది . ఎవరికైనా
సమృద్ధి ,సహజత్వం ,చూసినపుడు కలిగే ఈర్ష్య ,ద్వేషాలే హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు . ఇవే
మనకు పూర్వయుగాల్లో దశావతారాలను రప్పించిన రాక్షస ప్రవృత్తులు . కలిలో వివిధ మతాలుగా ,నాగరికతల
రూపంలో ఇప్పుడు కూడా అంతే ప్రభావం చూపిస్తున్నాయి . పులిని చూసి నక్క వాత అనేవే ఇతర మతాలు . కానీ
నక్కని చూసి పులి ఊళ లా ఉంది పరిస్థితి . ఎంతో కష్టపడి పెద్దలు అందించిన జీవిత విధానం వదులుకొని ,వెళ్లి
ఆకులు కట్టుకున్న ఆటవిక జాతుల నుంచి నేర్చుకునే కుహనా సంస్కారాలకు పెద్ద పీట వేసి ,వాళ్ళముందు
మేము కూడా చావుడప్పు వాయించగలం అని ,మృదంగ విద్వాంసుడు చెప్పినట్లు తయారయింది సమాజం .  

20, ఆగస్టు 2016, శనివారం

నామరూపాలు

నామరూపాలు
ఒక చిత్రకారుడు తనచిత్రాలలో 6చిత్రాలు ,కామ ,క్రోధ ,లోభ ,మోహ ,మద ,మాత్సర్యాలనే భావాలకు అనుగుణంగా అద్భుత చిత్రాలను గీశాడనుకుందాము . మనసు వాటిలో లయించినపుడు అంతే భావ స్ఫురణ కలిగి ఉండవచ్చు . కానీ
మనసు బహిర్గతమైనప్పుడు ,వీటి నిజానిజాలు గుర్తించే ప్రయత్నం చేస్తే ,నిజానికి కాగితము ,రంగులు తప్ప అన్యమేమీ
లేదు .కాగితమనే ఉనికి [existence]మీద ,గుణాలనే రంగులతో భ్రమింపజేస్తున్న సృష్టిని పరిశీలించి ,గ్రహిస్తే ఉన్నది ,నామ
రూపాలుగా వ్యక్తంఔతున్నది ,పంచభూతాత్మక ప్రకృతియే . మనసు నామరూపాలలో లయించినంత సేపు ఇది నిజమనే
అనిపిస్తుంది.కానీ గురుకృపతో జ్ఞానం ప్రకాశించినపుడు ,పరమాత్మ జ్ఞానం [ఉనికి]త్రమేప్రకాశించి,ప్రకృతిరూపమైన నామ       రూపాలు మభ్య పెట్టలేవు.చిన్న పిల్లవాడు కాగితం మీది బొమ్మను చూసి భయపడి నపుడు,పదే పదే భయపడినపుడు
తండ్రి చిత్రకారుని వలె ,కాగితాన్ని రంగులను చూపి అతని భయాన్ని పోగొడతాడు . కానీ ఇది కొంచెం పరిణతి చెందిన
వారికే ప్రయాజనం . బాగా చిన్న పిల్లలు పరిణతి లేనివారు దీన్ని అర్ధం చేసుకోలేనపుడు ,వారికి నచ్చేలా ,వేరే బొమ్మను
ఇచ్చి బుజ్జగించ వలసిందే . అవే వివిధ సాధనా మార్గాలు .
 

15, ఆగస్టు 2016, సోమవారం

అద్వైతం

అద్వైతం
           త్రిపురసుందరి . నటరాజ నర్తనానికి సాక్షి . పరమాత్మను నామరూపాత్మకంగా [సోపాధికంగా]తెలుసుకుని , త్రిపురాలయందు భగవత్ సాక్షాత్కారాన్ని గ్రహించి సాక్షిగా రమించే అమ్మ తీరు సాకార ధ్యానం . శక్తిని చైతన్యం అని దర్శించి , ఆ కదలికల లాస్యాన్ని అంతరంలో గ్రహించి ,చలించని ధృతిలో తనలో తాను మునిగిన మోని ,నిరాకార ధ్యాని .
ధ్యాని శివుడు ,ధ్యానం శక్తి . సాకార ,నిరాకార ధ్యానాల రెండింటా ధ్యాని శివుడు ,ధ్యానం శక్తి . శరీరం శివుడు ,శక్తి స్త్రీ . శరీరంలో శక్తి దాగి ఉంది . శరీరం ద్వారా మాత్రమే వ్యక్త మోతుంది . భారతీయ సంప్రదాయం ఈ విషయాన్నే స్త్రీ గోప్యతను 
పాటిస్తుందని తెలియజేస్తుంది . అంతేకాని స్త్రీని ఎక్కడా తక్కువ అని పేర్కొనలేదు .
          ఉనికి నామరూపాత్మక ప్రపంచంగాను ,చైతన్యం శక్తిగాను ,ఆనందం  మనస్సుగాను అర్ధం చేసుకుంటే ,సత్చితానందం
యొక్క సృష్టి రూపం ప్రపంచం  . సత్చితానంద బింబరూపానికి ,సృష్టి ప్రతిబింబం . ఏ ఒక్కరికి తాను ఉన్నాను అనడానికి అద్దం అవసరం లేదు .తన ఉనికికి   బింబ లక్షణాలు అన్వయించి జీవించడం ధర్మం.ప్రతిబింబ లక్షణాలతో అన్వయించడం  అధర్మం.నిరాకారమైన శివస్వరూపానికి ,సాకార విష్ణు రూపం ,ప్రారంభం .అంటే అనంతం, నామరూపాలతో వ్యక్తమైంది.అందు
వల్లనే దశావతారాది కృత్యాలు విష్ణుపరంగా వచ్చినవే.శివుడు విష్ణు కళ్యాణం చేసి నట్లు కనపడదు . విష్ణువు పార్వతి   పరమేశ్వర   కళ్యాణం చేసినది అందరికి తెలుసు .స్వస్థితిలో ఉండడమే పార్వతీ పరమేశ్వర కళ్యాణం . వీరికి శక్తి కావాలి అనే వాంఛ ఉండదు . ప్రతిబింబం తానుగా భావించినపుడు మాత్రమే ,తాను శరీర పర్యంత జీవి నని ,తన శక్తి పరిమితమైనది అని భావించి ,పరమాత్మ యొక్క నిరాకార తత్వం సాపేక్షమైనది కాదు కనుక ,శక్తి కొరకు తనకు నచ్చిన దైవరూపంతో ,తపస్సు చేసి ,అనంత శక్తిని కోరుకుంటాడు . కానీ ఇది ప్రతిబింబ జ్ఞానం కావడం వలన పరిధులు తప్పవు . కోరిక ప్రతిబింబ లక్షణం .   

3, ఆగస్టు 2016, బుధవారం

లక్ష్మి

లక్ష్మి 
   సమయము లక్ష్మీ స్వరూపము . కాలస్వరూపిణి ఆది లక్ష్మి . శుద్ధమైన మనసు[చంద్రుడు] మాత్రమే నిరాకరమైన సమయాన్ని గుర్తు పడుతుంది .అందువలన లక్ష్మి చంద్ర సోదరి .  సంకల్ప వికల్పాలు లేని సమయాన్ని లక్ష్మీ స్వరూపం అని గుర్తుపట్టిన ముని జనుల సమూహాలతో ఆవృతమైన జ్ఞాన స్వరూపిణి ,వేదాలచే స్తుతింపబడిన మోక్ష ప్రదాయిని . మోక్షము అద్వితీయమైన వర్తమానమే . ఇది ఎక్కడ ,ఎవరికి లేదు ?ఇది విష్ణు శక్తి . శ్రీ మహాలక్ష్మి . ఇంద్రియ ,మనో ,బుద్ధులు 
ఈ విషయాన్ని తెలిసి వర్తమాన క్షణాన్ని మౌనం అని గ్రహించి ఆక్షణంలో రమించేదే మోక్షం . ఇదే ధ్యానం .
       ఈ సమయాన్ని ఇంద్రియ మనో బుద్ధులు తమ ఆధీనం చేసుకుని విహరించేదే విష్ణుమాయ .కానీ కర్తవ్య కర్మ కొరకు కదలక తప్పదు . పని చేసే ఆ సమయంలో మాత్రమే దానికి సంబంధించిన వ్యవహారం కలిగి ,వేరొక పనిలో, మొదటి పని యొక్క ఆలోచనలు లేకుండా ఉండడమే ఏకాగ్రత .ఎన్ని జన్మల సంచితమైనా ఈ విధమైన ఏకాగ్రతను భంగంచెయ్యలేదు . వర్తమానంలో ఉండడం వలన , చైతన్యరూపమైన పరమాత్మ సన్నిధిలో ,పురాకృత కర్మ తన ప్రభావాన్ని కోల్పోతుంది .పురుష 
ప్రయత్నం అని పెద్దలు సూచించినది ఇదే . తన ప్రయత్నంతో ఇలాచేసే ఈ ప్రయత్నం భగవత్కృపతో సాధనగా మారడం 
ఎంతో సహజం . ధ్యానం సహజంగా కుదురుతుంది . భౌతిక ప్రపంచంలో చరించే దశలో ఏకాగ్రత సాధన . పని ఆగిన క్షణం 
శుద్ధమైన మనసు , నిరాకార సమయంలో మునగడమే ధ్యానం . అక్కడ ఉన్నది చైతన్యం యొక్క మూలం ,ఖాళీ కాదు .
మోక్షలక్ష్మి ,ఆది లక్ష్మి .
     ధాన్యలక్ష్మి-2
      ప్రపంచంలో చరించే దశలో మంచి ,చెడుల సంఘర్షణ సహజం .ఇది క్షిర సాగర మధనమే . మనసును మంచికి
ప్రేరేపించి కార్యసాధన చేయాలి . దీనినే దేవతల గెలుపు అన్నారు . దేవతలంటే ఇష్టమని ,రాక్షసులంటే అయిష్టమనే అర్ధం కాదు . పిల్లల దుష్ప్రవర్తన ఎవరూ సహించరు . అలానే మనసు చేసే మాయలో చెడుకి సహకరించక ,మంచిని ఎంచుకుని
సాగడం దేవతల గెలుపు . ఈ సాధన వలన సమయం అనుకూలిస్తుంది . అంటే లక్ష్మి కృప కలుగుతుంది .సాధన పరంగా
దీన్ని అర్ధం చేసుకోవాలే కానీ ,ఆర్ధిక పరంగా ఆలోచించి నిరాశ పడకూడదు . జన్మ పరంపరలనుండి దాటించే కృప కన్నా
ఐశ్వర్యమేముంది ?సమయమనే సముద్రంలో వ్యాపించి వసిస్తున్న మహాలక్ష్మి ,మనకు సర్వ సమృద్ధిని కలిగించే ధాన్యలక్ష్మి.
నిజానికి ,చిన్నప్పుడు బుద్ధిగా సమయాన్ని వినియోగించి సాగించిన అధ్యయనమే ,తరువాత ఆర్ధిక సమృద్ధిగా అంది వస్తుంది . అంటే సమయమే సమృద్ధి . అందుకే అమ్మ ధాన్యలక్ష్మి .
  ధైర్యలక్ష్మి -3
   ఎప్పుడైతే సమయపాలన విలువ తెలుస్తుందో , అపుడే మనో ప్రపంచం దాడి చేస్తున్న విషయం అర్ధం అవుతుంది . దీన్ని
గమనించి శ్రద్ధతో విష్ణు పాదాలయందు ద్రుష్టి నిలిపితే ,భవసాగరం భయపెట్టలేదు . విష్ణుపాదాలను పూజిస్తున్న లక్ష్మి కృప
కలుగుతుంది . విష్ణు పాదాలు ,అవి సూచిస్తున్నది , అహం యొక్క ఆధారభూతమైన చైతన్యాన్నే . రెండు పాదాలుగా
మనకు పరిచయమైన ద్వైత దర్శనలోని ,ఒకరే[అద్వైతం] కలిగిఉన్న రెండు పాదాలు. ఉన్న చైతన్యమే ,దృశ్యమానమైతే ,రెండు . చరించే ధర్మం ఒక పాదం . చెరించే దశలో కూడా తనలో స్థిరంగా తెలిసే చైతన్యం రెండోపాదం . ఎపుడూ వర్తమానంలో ఉండడంవలన కొత్తగా కర్మ ఏర్పడదు . వర్తమాన క్షణంలో ఎవరికీ అహం అనేది శరీర పర్యంతంగా భ్రమ
పెట్టదు . ఎందుకంటే రెండో వస్తువు ఉన్నపుడే పోలిక ,భ్రా0తి కలుగుతాయి . వర్తమాన క్షణంలో రెండోది లేదు . ఈదశలో పురాకృత పాపము అని తెలియబడుతున్నది కూడా ,మాయగా తెలియబడుతూ ,తన సత్తాను కోల్పోయి ,పాపక్షయం
అవుతుంది . భవ భయహారిణి ,పాపవిమోచని ,శ్రీ ధైర్యలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది .
సశేషం








11, జులై 2016, సోమవారం

నామరూపాలు

 
 నామరూపాలు 
       నామరూపాలు,ఖేదాన్ని కాక మోదాన్ని ప్రసాదించే విద్య మోక్షవిద్య . సర్వమ్ విష్ణు మయం జగత్ . కనుక 
నామరూపాలు కూడా విష్ణు రూపమే . భగవంతునిచేత రూపొందించబడిన విగ్రహాలే నామరూపాలు . వాటికి పరంపరా 
ప్రాప్తిత కర్మల ఫలాలతో కలిపి చూడక ,చైతన్యవంతమైన విగ్రహాన్ని మాత్రమే చూసి చేసే సేవ ,మాధవసేవ . దీనివలన 
క్రమంగా నామరూపాలు చైతన్యమనే ఎరుక బలపడుతుంది . దీనికి మానవ సేవ పేరుతో చందాల అవసరం లేదు . తాను 
ప్రపంచంలో తనుకాక ఎవరితో మెలిగినా అదే స్పృహ కలిగి ఉండాలి . దీనివల్ల క్షమాది షట్క సంపత్తి ఏర్పడుతుంది . దీనివలన మానవ సంబంధాలు బలపడతాయే కానీ చెదిరిపోవు . అంతే కానీ ,నామరూపాలతో ప్రాప్తిత కర్మను కలిపి చూడడం వలన కామక్రోధాది దుర్లక్షణాలు కలుగుతాయి . కానీ కర్మతో ముడిపడిన అనుబంధాలు ధర్మబద్ధంగా అనుసంధానం చేసినపుడు మాత్రమే జీవనం సార్ధకత పొందుతుంది .
          నామరూపాలు ,ధ్యాన సమయంలో తన ఉనికిలో నిలువనివ్వక ,మనో సామ్రాజ్యం ఆహ్వానిస్తుంది . ఎప్పుడూ
ఖాళీ లేకుండా పరుగులు తీసే అలవాటు వల్ల ,ధ్యానం అనగానే ఆ తీరికని వాడుకోడానికి మనస్సు ఎంతో ఉత్సాహంగా
తన ప్రతిభను ప్రదర్శించి ,మాయలేడిలా భ్రమ పెడుతుంది . సీతలా శరీర పర్యంతంగా తనను భావించే అహం ,లేడివెనుకే
చైతన్యాన్ని పంపుతుంది . మిగిలినది అందరి ఎరుకలోని ,ధ్యానం అనే స్ఫురణ జారిపోవడమే జరుగుతుంది .దీనికి తోడుగా ధర్మ బద్ధమైన జీవన విధానం ,శరణాగతి ,ప్రపత్తి అనే మూడు ఆయుధాలతో ,దశానన చెరనుండి ,పరమాత్మ కృపతో
రామపత్నిగా ,రాజపత్నిగా మోక్షాన్ని జీవులు పొందవచ్చు .
      సీత ఎప్పుడు రామునిదే . అలానే సృష్టి ఎప్పుడూ పరమాత్మదే . సృష్టికి పూర్వము ,సృష్టిగాను ,సృష్టినుండి లయించిన తర్వాత కూడా . యిలా మూడుగా గాని ,జీవాత్మ పరమాత్మ యిలా రెండుగా గాని అనిపించడమే మాయ. దీనికి పెద్దలు
చూపిన ఉపమానము ,ఘట లేదా మఠ ఆకాశము . ఇవి తయారైనప్పుడు ఆకాశం ఏకమే . అవి అలా ఉన్నప్పుడూ ఆకాశమే ,కుండ విరిగినా ,మఠం కూలినా ఉన్నది ఆకాశమే . నిద్రలో ఉన్న వారికి వారు లేరనే అర్ధం లేదు . ఉన్నారు కానీ
తెలియడం లేదు . మెలకువలో తాను ఉన్నాననే స్పష్టత ఉన్నది . మెలకువ లోని స్పష్టత మాయతో కూడి ఉన్నది . దీన్ని మాయా ముక్తం చేయడం కర్తవ్యం . మాయలేడి వెంట వెళుతున్న చైతన్యం మనకు దొరకదు . అందుకే ధ్యానం . దీన్నే
ఆలోచనకు సాక్షిగా ఉండడం అంటారు . దీనికి తనలో విషయాన్ని తెలుసుకోవాలనే తపన ముఖ్యం . రోజులో ఎన్ని సార్లయినా ,ఎవరు ఆలోచిస్తున్నారు ?వింటున్నారు?చూస్తున్నారు ?అని మనసుని నిలిపితే ,మోనమే సమాధానం .
కానీ తెలుసుకుంటున్న వారుగా అక్కడ ఉన్నారు . మోనానికి అర్ధం ఉండడం . అదే ఉనికి . కానీ ఉన్నది శరీర పర్యంత
వ్యక్తి కాదు . పరమాత్మ . అక్కడే ఉంటే పరమాత్మ . దేహంతో తాదాత్మ్యం చెంది చెప్పినా ,విన్నా ,ఏం చేసినా జివి .
దీన్నే మోన వ్యాఖ్య అంటారు . మోనంలో ఉన్న చైతన్యం పరమాత్మ మాత్రమే . ఆలోచన మొదలైన క్షణం సృష్టి . సృష్టి
లేకున్నా ఉనికి ఉన్నది . కానీ ఉనికి లేక సృష్టి లేదు .దీన్ని శంకరాచార్యులవారు కోహం అని ప్రశ్నించారు . దీన్నే
రమణులు ఎవరు నేను ?అన్నారు .
   









       

6, జులై 2016, బుధవారం

వరాలు ,శాపాలు .

      వరాలు ,శాపాలు .
మనం పొందే సుకృత ఫలాన్ని ,వరమని ,దుష్కృత ఫలాన్ని శాపమని ప్రస్తుత జన్మలో పొందుతాము . ఇది అనివార్యము .
అలానే ఇబ్బందులు కలిగినపుడు జాతకాన్ని పరిశీలించి ,వాటికి పరిహారాన్ని చేయించుకోవడం పరిపాటి. కాలసర్ప దోషాలు 
పితృ దోషాలు ,ఇలా రకరకాలు ,వాటి పరిహారాలు అందరికి తెలిసినదే . వంశంలో తరతరాలు ఆస్తిలా అనుభవించే దోషాలు
ఉంటాయి . ముందు తారాలలో జరిగిన పొరపాట్లకు ,తరువాతి తరంలో ఇబ్బందులు తప్పవు . దీనికి ఉదాహరణయే
భగీరథ చరిత్ర .దీనికి భగీరధుడు ఎందుకు తపించాలి ?హాయిగా జీవితాన్ని అనుభవించ లేకనా ?దీన్ని కృతజ్ఞత అంటారు .
 రాబోయే తరాలపట్ల దయ . అందువల్లనే కదా రాముడు ఆ వంశంలో కలిగాడు . మన విషయాలకు వస్తే ,నాస్తిక వాదం
పేరుతోనో ,అశ్రద్ధ చేతనో ,నా కర్మ ఇంతే అనే నిరాశతోనో ,జీవితాన్ని అలానే గడిపెయ్యవచ్చు . కానీ ఎప్పుడో పెద్దలు చేసిన
దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం . అనేదానిలోని సాధక బాధకాలు ఒకసారి చూద్దాం . సర్వసాక్షి అయిన పరమాత్మ
అంతరంగం నుండి అన్ని పాపపుణ్యాలు లెక్క కట్టి నూతన జన్మను ఇస్తాడు . జనన మరణాల మధ్యన స్వర్గ నరకాలలో
కర్మ తూకంలో సరి సమానమైనపుడు ,తిరిగి మానవజన్మ సాధ్యం . తండ్రి తననే పుత్రునిగా పొందుతాడనేది శాస్త్రం .
అలా వంశంలో పూర్వము తాను చేసిన కర్మకు తానే బాధ్యత వహిస్తూ మళ్ళీ అదే వంశంలో జన్మిస్తాడు వ్యక్తి . అందువలన
తనకర్మకు తానే కర్త కనుక సర్వులూ సరి అయిన ప్రాయశ్చిత్తాన్ని గ్రహించి ,పూర్వులను ,తమ తరాన్ని ,రాబోయే తరాలను
రక్షించుకోవాలి . ప్రాయశ్చిత్తానికి తగిన శరీరం పొందినందుకు భగవంతునికి ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా సరిపోదు .

29, జూన్ 2016, బుధవారం

పరంపర

                                                       పరంపర
అమ్మ నేర్పితే అన్నం తినడం వచ్చిమ్ది . అదే బాటలో అన్నీ చెప్తేనే వచ్చాయి . భౌతిక విషయాలకే ఇది అవసరమైతే భగవంతుని చేర్చడానికి గురువు ఎంత బాధ్యత వహిస్తారు ?అదే పరంపర . అందరూ చెప్తున్న షిర్డీ సాయి ,ఎల్లప్పుడూ 'అల్లా మాలిక్'అన్నారేకాని ,రామ ,కృష్ణ అనలేదు . దేవత నామాన్ని కూడా ఉచ్చరించని వారికి ,హిందువులు గుడి కట్టడం శోచనీయం . మీ పూజ మీరు చేసుకొండి అన్నారు .కానీ ఆయనకు గుడి కట్టమనలేదు . భగవన్నామం చెయ్యండి అన్నారుకాని ,తన నామజపం చెయ్యమనలేదు .ఏనాడూ విగ్రహారాధన చెయ్యలేదు . విగ్రహారాధన చెయ్యని వారికి గుడిలో పూజలేమిటి ? నిజానికి వారి అనుయాయులు 'అల్లా మాలిక్ 'అనాలి అంత గౌరవం ఉంటే గుడి కట్టేకన్నా పాతమసీదులు బాగుచేసుకుని అల్లా మాలిక్ అనాలి .
        ఆచార ,సంప్రదాయాలు పాటించ వలసిన అవసరం లేదని ,సంధ్యావందనాది క్రియలకు దూరమై, భగవదత్తమైన సంప్రదాయానికి తిలోదకాలిచ్చే వారికి ,బాసట మాత్రమే సాయి భక్తి . దీని వలన అనాచారం పెరిగి సర్వమూ సంకరమైనది . ఎన్నో రూపాలతో తన దరికి ఎవరినీ రానీయక, శ్రేష్ఠ మైన అర్హునికి మాత్రమే ఉపదేశం చేశారు దత్తులు .పరశురామునికి శ్రీవిద్యని ఇచ్చి ఉపాసనా ఫలంగా మాత్రమే పరబ్రహ్మతత్వాన్ని వారికి ప్రతిపాదించారు . శ్రద్ధతో శ్రాద్ధ క్రియలు జరిపే ఇంట జన్మ స్వీకరించి తమ తమ ఆచార వ్యవహారాలు తప్పక పాటించమని సూచించారు . కొన్ని మహిమలు చేసినంతమాత్రాన వారిని దేవతలుగా మనవారు ఎన్నడూ గ్రహించ లేదు . సాధన దశలో ప్రాప్తిమ్చే సిద్ధితో ,మందిని పోగుచెయ్యడం అనుష్ఠానానికి వ్యతిరేకం . ఆచరణ అవసరంలేని వేదాంతం , సన్యాసికి మాత్రమే . సన్యాసం ధర్మాలు గృహస్తును పాటించమని ఎవరూ అనరు . గృహస్తు అంటే తనవిధిని పాటించ వలసినదే .విధి ,నిషేధాలు అవసరం లేని విషయం ప్రపంచంలో లేనే లేదు . శృతి సమ్మత జీవన శైలి పరంపరా ప్రాప్తంగా అందరూ జన్మతో కలిగి ఉంటారు . దానినే ధర్మం అని గురువు తెలియజెయ్యాలె తప్ప క్రొత్త విధానాలు ప్రవేశపెట్టి తికమక పెట్టడమే తప్ప ,అన్యంగా వేరే ఏమి లేదు .షిర్డీ సాయిని దత్తాంశగా భావిస్తున్నారు.
          శ్రీ దత్తులు 24 ప్రకృతి పరమైన అంశాలనుండి తాను నేర్చుకున్న విషయాలను తెలియజేసారు తప్ప ,ఎవరిని తమగురువుగా ప్రకటించలేదు .ముందుగా అనుకున్నట్లు శ్రీ దత్తులు ,ఎవరికి ఎంతవరకు అవసరమో అంతే అందేలా ఎన్నో విచిత్రాలు చేశారు . అందులో భాగంగా నామరూపాలకు అతీతంగా గురు తత్వాన్ని గుర్తు పట్టి సూచన గ్రహించాలి కానీ గుడులుకట్టి ,సినిమా ట్యూన్ భక్తి పాటలతో ఎవ్వరూ ఏదీ సాధించేది లేదు . గురువుచూపిన మార్గాన్ని నడవాలే కానీ గురువుకు గుడికట్టి ,సొంత నామావళితో పూజ కాదు . నారదుడు వాల్మీకికి రామనామాన్ని ,అలానే ధ్రువునికి నారాయణ నామాన్ని ఉపదేశిస్తే ,వాళ్ళు ఉపదేశించిన నామాన్ని జపించారే తప్ప నారద నామాన్ని కాదు .నమస్కరించ వచ్చు కానీ గురు బ్రహ్మా ... కానీ, గుడులు అవసరం లేదు . మీ పెద్దలు నడిచిన దారిలో నడవమన్న గురు వాక్యాన్ని విస్మరించి గుళ్ళు కడితే,తోటమాలి తోటపని మాని యజమాని పేరు జపించినట్లు ఉంటుంది. దీనికి మనవాళ్ళు పెట్టిన పేరే విష్ణుమాయ .