18, ఫిబ్రవరి 2018, ఆదివారం

                                                                        సనాతనం.
                                                                       [కన్యాదానం.]
   భారతీయ సంప్రదాయంలో కన్యాదానానికి పెద్దపీట వేయబడింది. ఇదే నాలుగు ఆశ్రమాలకు పట్టుకొమ్మ అయిన
గృహస్థాశ్రమానికి ప్రారంభం. దీన్ని స్త్రీ ,పురుష పరంగా కాక ,అద్వితీయమైన అర్ధనారీశ్వర తత్వంలో అర్ధంచేసుకునే
శాస్త్ర మననంలో భాగంగా స్వీకరించాను. జీవి పుట్టిన పిదప ఆహారంతో క్రమంగా మనసు తయారవుతుంది. ఇదే కన్య. నిజానికి మనసు దేన్ని మనం కోరుకుంటే దానిలో లగ్నం అవుతుంది. ఇది అందరి అనుభవంలోని విషయం.
ఇందువల్లనే శాస్త్రం ,ధ్రువుణ్ణి ,ప్రహ్లాదుని,శ్రీరాముని సంకేతంగా చూపి బాల్యంలోనే పిల్లలకు అపరోక్షానుభూతిని
పరిచయం చేయమంటుంది. ఏ కోరిక అయినా ధ్రువుణ్ణి,ఏ ప్రశ్న అయినా ప్రహ్లాదుని,ఏ వైరాగ్యమైన శ్రీరాముని వలె,గురువును ఆశ్రయించి వారికి అనువైన విధానంలో పిల్లలకు తత్వాన్ని పరిచయం చేయడం కనీస ధర్మం.
పై వారిలో ఎవరూ సన్యాసులు కాదు,గృహస్థాశ్రమాన్ని చక్కగా నిర్వహించారు. జ్ఞానం అంటే సన్యాసం అనేది అపోహ. తన నిజానిజాలు తను తెలుసుకోవడం భగవత్ జ్ఞానం.
     మనసు కలిగిన జీవి , దానికి తండ్రితో సమానం. అష్టవర్షాత్ భవేత్ కన్య. ఆ వయసు నుండి మనసు తండ్రి ఏది చూపిస్తే అందులో లయమవడం ప్రారంభిస్తుంది.ఇలా అన్నంతో అంటే భూమినుండి అయోనిజగా జన్మించినది,కన్య.
అందు వల్లనే జనకుని ,విష్ణుచిత్తుని ఇలా ఎంతోమందిని, అమ్మాయి తండ్రిగా పరిచయం చేసింది శాస్త్రం. ఒక సంక్లిష్ట
విషయాన్ని అందరికీ అర్ధమయ్యేలా వ్యక్తులతో నిర్మితి చేసేది నాటకం.యదార్ధమైన పరతత్వాన్ని భూమిపై , ప్రకటించి  చూపినవి ఇతిహాసాలు. కన్యకు పరమాత్మను పరిచయం చేసి అతనితో ఎప్పుడూ,నిరంతరాయంగా లగ్నమై పోయేలా చెయ్యడం తండ్రి కర్తవ్యం. అలా చేసేదే కన్యాదానం. అపుడు సీతకు అరణ్యం కూడా ఆహ్లాదం గానే ఉంది. అరణ్యం అంటే జీవితం. ఒడిదుడుకులు ఏమాత్రం ఇబ్బంది పెట్టవు.ఇది బాహ్యచరణ.
    అంతరంలో తన స్వస్థితిలో కదలక,నిమిత్త మాత్రంగా కర్మాచరణ పాతివ్రత్యం.కానీ మనసు ఇంద్రియ విషయాలతో
ప్రాపంచిక విషయాలతో నిండి ఉండడం,భార్యా లోలత్వం.అంటే మనసు తాను పరిభ్రమించడానికి ,పరమాత్మయొక్క
దివ్య విభూతి అయిన కాలాన్ని నష్ట పరుస్తున్నది. దీనివలన జీవి కర్మల ఫలితంగా జన్మ పరంపరలు పొందుతాడు.
బాహ్యంలో చరించడం అంటే జీవికి కర్త్రుత్వాన్ని ఇవ్వడం,బాహ్యంలో మాత్రమే శరీరంతో కలిసిన అహం ప్రజ్ఞ ప్రవర్తిస్తుంది.అందువలన ముక్తి అసాధ్యం.అందువల్లనే బాహ్యంలో కన్యాదానం వలన ఏడు తరాలు తరిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తాయి.మనసు లయిస్తేనే కానీ పైన అనుకున్నట్లు ముక్తి అసాధ్యం.దశరథుడైన వానికి రాముడు
లభించాడు యజ్ఞంతో. సీత జనకునికి మనో రూపంగా లభించింది. వీరిద్దరి కళ్యాణం ముక్తి. అంటే పురాకృత కర్మ
అనే యజ్ఞ కుండంనుండి ఆవిర్భవించినది శరీరం,అన్నగతంగా ఏర్పడింది మనసు. ఈరెండూ కలిస్తేనే జీవన్ముక్తి.

17, ఫిబ్రవరి 2018, శనివారం

సనాతనం

                                                                    సనాతనం .
  ప్రాణి పుట్టిననాటి నుంచి నేర్చుకోవాలనే తాపత్రయాన్ని కలిగి ఉంటుది. నేర్చుకునే సందర్భంలోకానీ ,నిష్ణాతులైన తరువాతకానీ ఎదో ఒక గమ్యాన్ని తనంతట తానే కలిగి అది పూర్తి అయిన తరువాత కృతక్రుత్యతను ఆస్వాదిస్తోంది.
నిజానికి ఈదశలో తనలోతాను మునిగి స్వస్థితిని పొంది ఆనందాన్ని అనుభవిస్తున్నది. ఇది ప్రతివారి అనుభవం లోనిది. పుట్టుక తన స్వస్థితినుండి బయటకు రావడమే. మళ్ళీ తిరిగి చేరాలనే తపనే ఇందులోని తాత్పర్యం. నిజానికి నిద్రలోకూడా జరుగుతున్నది ఇదే. అందువల్లనే లేచాక ఎంతో హాయిగా ఉంటుంది. తన స్వస్థితి
చేరుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన.
శరీరంతో తాదాత్మ్యం చెంది ఎదో చేస్తున్నాననే భావనా బలం వలన ,కర్మల ఫలితంగా జన్మలను పొందుతున్నాము.
ఎప్పుడు మెలకువ వస్తే అపుడే ప్రపంచం అనుభవానికి అందుతుంది. అలానే ఈప్రపంచంలో ఇపుడు కర్మలను
చేస్తున్నా,ఆధ్యాత్మిక మార్గం ,నిద్రకు ,ముందు తరువాత కూడా నీవే ఉన్నట్లు ,జన్మకు ముందు తరువాతకూడా
ఉనికి సమానమని తెలియజేస్తుంది. ముందు ,వెనుక ఉన్న ఉనికి ఇప్పుడూ ఉన్నది నిజం . దీన్ని నిద్రలో కాక
మెలకువలో పొందడం ఆధ్యాత్మిక సాధన. కానీ తెలియకుండా కూడా ,గమ్యాన్ని చేరిన ప్రతిసారి పొందే అనుభవం కూడా ఇదే. తెలియకుండా జరుగుతున్న ఈప్రయత్నంలో శరీరభావన వలన పునరావృత్తి కలుగుతున్నది.
అదే పరమాత్మ జ్ఞానంతో చేస్తే మోక్షం అవుతుంది.  

16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

సనాతనం

                                        సనాతనం.
అన్ని శాస్త్రాల సారం ,నామరూపాలు భ్రాంతి అని ,స్వరూపమైన అహం ,జీవాత్మకాదని ,శరీరాన్ని తానుగా భావించడాన్ని,మనసుకి ఆలంబనగా ఇవ్వకూడదనేదే సారాంశం. మనసుకు ఎన్నో విధాలుగా నచ్చచెప్పే విధానాలను ఎందరో సాధనాపరులు తెలియజేస్తూనే ఉన్నారు . అలాంటివి మనన రూపంగా స్మరిస్తున్నాను. వ్యక్తి ఒక్కడే అయినా అతడు తండ్రికి కుమారుడు,సోదరికి అన్న అలానే భర్త ,తన పిల్లలకు తండ్రి కూడా . కానీ ఇవన్నీ అనుబంధాలు తప్ప వేరు కాదు . వీటిని వార్డరోబ్లో హాంగార్లకు తగిలించే దుస్తులుగా ఊహిస్తే ,జ్ఞానం,వైరాగ్యం సిద్ధించేందుకు అవకాశం కలుగుతుంది. నిజానికి వీటిని తిరస్కరిస్తే ,ఎప్పటికీ మనసు లొంగదు . కానీ వ్యవహారం అవసరమైనపుడు తన పాత్రకు న్యాయం చేస్తూ ,అది అవగానే తన మూలమైన స్వరూప అహంలో విశ్రాంతి పొందాలి. ఇది నిజానికి రోజూ నిద్రలో జరుగుతున్నదే . సంబంధాలు అపుడు లేవు . దానివల్ల నిజజీవితంలో ఎటువంటి ఇబ్బంది లేదు. దీనిని జాగ్రత్తులో సాధనగా మార్చినపుడు మనసు స్వరూపంలో నిలకడ పొందగలదు .

15, ఫిబ్రవరి 2018, గురువారం

సనాతనం

సనాతనం. 
     స్త్రీ,పురుష సంబంధం లేని ,భార్యా లోలత్వం,పాతివ్రత్యం. జీవుడు సనాతనుడు. శరీరం లేనపుడు కూడా ,సూక్ష్మ 
శరీరంతో కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దీన్ని మనశాస్త్రం అంగీకరిస్తున్నది. పాప,పుణ్యాలు సమమైనపుడు ,
మానవదేహం కలుగుతుంది. సూక్ష్మదేహం శరీరమనే ఉపాధితో కలిసింది. అంటే సూక్ష్మశరీరం పురుషుడు,శరీరం స్త్రీ, 
అనిభావిస్తే,భార్యని పువ్వులా చూస్తూ అన్నీ అమరుస్తూ,దానికోసమే జీవితాన్ని సమర్పించడం,భార్యా లోలత్వం. 
  తన శరీరము ,ప్రాణము ,మనసు కూడా ,జన్మ పరంపరలు దాటించడానికే అనే ఎరుకతో జీవి ప్రయత్నించడం అనేది ,పరమేశ్వరుని పతిగా గ్రహించి ,ధర్మ విరుద్ధం కాని కర్మాచరణతో జీవన్ముక్త స్థితికి ప్రయత్నించడం పాతివ్రత్యం. 

25, జనవరి 2018, గురువారం

సనాతనం

సనాతనం . 
        విశ్వం విరాట్పురుషుని ,విశ్వరూపం. బ్రహ్మాండంలో ఏది ఉన్నదో అదే పిండాండంలో ఉందని శాస్త్రాలు తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఏదైతే శాస్త్రం ,బ్రాహ్మణ ,క్షత్రియ ,వైశ్య ,శుద్ర అనే వర్ణ విభాగాలు 
తెలియజేస్తున్నదో, అది ఒకే శరీరంలో ప్రతీకాత్మకంగా తెలియబడుతున్నది. ధర్మార్ధకామమోక్షాలు ఒకే సాధనను 
తెలియజేసినట్లే ,సోపాన క్రమంగా వర్ణ విభాగాలు కూడా ఇదే అంతరార్ధాన్ని తెలియజేస్తున్నాయి. 
అహం , శరీరాన్ని ఉపకరణంగా వాడుకుని ఈ నాలుగు వర్ణాలను తనలోనే కలిగి ఉన్నది. తననే సర్వస్వం అనుకుని 
సకలము తానే సాధిస్తున్నాననే అహంకారం క్షత్రియ ప్రవృత్తి . చూసినవన్నీ తనకే కావాలి ,అనే  భావంతో వైశ్యత్వము ,శరీర సుఖం తప్ప అన్యమేది అక్కరలేని తత్వం శుద్ర లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ మూడింటిని 
సాధనాలుగా తెలిసి ,మనోబుద్ధిచిత్తాహంకారాలు, పరమాత్మ సేవకు ఉపయోగపడేలా ,బుద్ధి ప్రయత్నం చేస్తే క్రమంగా శుద్ధ సత్వగుణాన్ని పొంది ఆత్మ ,పరమాత్మగా అనుభవాన్ని పొందుతుంది. బుద్ధి ప్రయత్నం ,పరమాత్మ కన్నా అన్యం లేదని తెలిసి సాధన  చేస్తున్న దశలో శరీరాన్ని త్యజిస్తే బ్రాహ్మణ జన్మను ,దేన్నో శరీరహంతో సాధించే దిశలో
శరీర ప్రయాణం క్షత్రియత్వాన్ని,ఐశ్వర్యమే జీవిత పరమార్ధమైతే జీవి వైశ్యత్వాన్ని,శరీర సుఖమే జీవన సూత్రమైతే
శుద్రుని ఇంట జన్మ సాకార మోవుతుంది. 

21, జనవరి 2018, ఆదివారం

సనాతననం

సనాతనం. 
         ధర్మార్ధ కామమోక్షాలు ,జీవ బ్రహ్మైక్య, సోపానాలుగా గ్రహించి చరించే విధానాన్ని,ఆచార సంప్రదాయాల 
రూపంలో అందించింది మన శాస్త్రం. దీన్ని అనుసంధానం వలన ,సాధన పటిష్ట మోతుంది. మనస్సు ,హృదయంలో 
అణిగి ఉండడం మోక్షం. మనసు ,చేతనతో కూడి ఉన్నప్పుడే విషయ జ్ఞానం కలుగుతుంది. ఇది లేకపోతె పరధ్యానం 
అంటాము . అంటే బాహ్యంలో గాని ,అంతరంలో గాని మనసు చరించాలంటే చేతన సహకరించాలి. కాబట్టి ఈ జంట 
కలిసి మాత్రమే చరించ గలదు. మనసు చరించక హృదయంలో అణిగి ఉండడమే మోక్షం. దీనికి సాపేక్షంగా గృహిణి 
ఇంట్లో ఉండాలి అని ఆచారంగా చూపి ,సాధనా క్రమాన్ని సూచించారు పెద్దలు.