29, జూన్ 2016, బుధవారం

పరంపర

                                                       పరంపర
అమ్మ నేర్పితే అన్నం తినడం వచ్చిమ్ది . అదే బాటలో అన్నీ చెప్తేనే వచ్చాయి . భౌతిక విషయాలకే ఇది అవసరమైతే భగవంతుని చేర్చడానికి గురువు ఎంత బాధ్యత వహిస్తారు ?అదే పరంపర . అందరూ చెప్తున్న షిర్డీ సాయి ,ఎల్లప్పుడూ 'అల్లా మాలిక్'అన్నారేకాని ,రామ ,కృష్ణ అనలేదు . దేవత నామాన్ని కూడా ఉచ్చరించని వారికి ,హిందువులు గుడి కట్టడం శోచనీయం . మీ పూజ మీరు చేసుకొండి అన్నారు .కానీ ఆయనకు గుడి కట్టమనలేదు . భగవన్నామం చెయ్యండి అన్నారుకాని ,తన నామజపం చెయ్యమనలేదు .ఏనాడూ విగ్రహారాధన చెయ్యలేదు . విగ్రహారాధన చెయ్యని వారికి గుడిలో పూజలేమిటి ? నిజానికి వారి అనుయాయులు 'అల్లా మాలిక్ 'అనాలి అంత గౌరవం ఉంటే గుడి కట్టేకన్నా పాతమసీదులు బాగుచేసుకుని అల్లా మాలిక్ అనాలి .
        ఆచార ,సంప్రదాయాలు పాటించ వలసిన అవసరం లేదని ,సంధ్యావందనాది క్రియలకు దూరమై, భగవదత్తమైన సంప్రదాయానికి తిలోదకాలిచ్చే వారికి ,బాసట మాత్రమే సాయి భక్తి . దీని వలన అనాచారం పెరిగి సర్వమూ సంకరమైనది . ఎన్నో రూపాలతో తన దరికి ఎవరినీ రానీయక, శ్రేష్ఠ మైన అర్హునికి మాత్రమే ఉపదేశం చేశారు దత్తులు .పరశురామునికి శ్రీవిద్యని ఇచ్చి ఉపాసనా ఫలంగా మాత్రమే పరబ్రహ్మతత్వాన్ని వారికి ప్రతిపాదించారు . శ్రద్ధతో శ్రాద్ధ క్రియలు జరిపే ఇంట జన్మ స్వీకరించి తమ తమ ఆచార వ్యవహారాలు తప్పక పాటించమని సూచించారు . కొన్ని మహిమలు చేసినంతమాత్రాన వారిని దేవతలుగా మనవారు ఎన్నడూ గ్రహించ లేదు . సాధన దశలో ప్రాప్తిమ్చే సిద్ధితో ,మందిని పోగుచెయ్యడం అనుష్ఠానానికి వ్యతిరేకం . ఆచరణ అవసరంలేని వేదాంతం , సన్యాసికి మాత్రమే . సన్యాసం ధర్మాలు గృహస్తును పాటించమని ఎవరూ అనరు . గృహస్తు అంటే తనవిధిని పాటించ వలసినదే .విధి ,నిషేధాలు అవసరం లేని విషయం ప్రపంచంలో లేనే లేదు . శృతి సమ్మత జీవన శైలి పరంపరా ప్రాప్తంగా అందరూ జన్మతో కలిగి ఉంటారు . దానినే ధర్మం అని గురువు తెలియజెయ్యాలె తప్ప క్రొత్త విధానాలు ప్రవేశపెట్టి తికమక పెట్టడమే తప్ప ,అన్యంగా వేరే ఏమి లేదు .షిర్డీ సాయిని దత్తాంశగా భావిస్తున్నారు.
          శ్రీ దత్తులు 24 ప్రకృతి పరమైన అంశాలనుండి తాను నేర్చుకున్న విషయాలను తెలియజేసారు తప్ప ,ఎవరిని తమగురువుగా ప్రకటించలేదు .ముందుగా అనుకున్నట్లు శ్రీ దత్తులు ,ఎవరికి ఎంతవరకు అవసరమో అంతే అందేలా ఎన్నో విచిత్రాలు చేశారు . అందులో భాగంగా నామరూపాలకు అతీతంగా గురు తత్వాన్ని గుర్తు పట్టి సూచన గ్రహించాలి కానీ గుడులుకట్టి ,సినిమా ట్యూన్ భక్తి పాటలతో ఎవ్వరూ ఏదీ సాధించేది లేదు . గురువుచూపిన మార్గాన్ని నడవాలే కానీ గురువుకు గుడికట్టి ,సొంత నామావళితో పూజ కాదు . నారదుడు వాల్మీకికి రామనామాన్ని ,అలానే ధ్రువునికి నారాయణ నామాన్ని ఉపదేశిస్తే ,వాళ్ళు ఉపదేశించిన నామాన్ని జపించారే తప్ప నారద నామాన్ని కాదు .నమస్కరించ వచ్చు కానీ గురు బ్రహ్మా ... కానీ, గుడులు అవసరం లేదు . మీ పెద్దలు నడిచిన దారిలో నడవమన్న గురు వాక్యాన్ని విస్మరించి గుళ్ళు కడితే,తోటమాలి తోటపని మాని యజమాని పేరు జపించినట్లు ఉంటుంది. దీనికి మనవాళ్ళు పెట్టిన పేరే విష్ణుమాయ .





4, మే 2016, బుధవారం

త్రిపుటి

     సృష్టిలోని ప్రతి విషయము త్రిపుటికి అనుసంధానమోతుంది . కర్మ ,భక్తి ,జ్ఞానము . చాలా విషయాలు ,పలు మాధ్యమాల్లో వింటూ జ్ఞాన పరిపూర్ణులైనట్లుగా భావించడం ఇప్పుడు అత్యంత సహజం . అందులో మొదటిగా భ్రమింప
చేస్తున్నది ,తమోగుణ రూపమైన అహం . తన శరీర పర్యంత వ్యాప్తిత ,చైతన్యం తన స్వంతమని ,తాను దానికి
యజమానిగా భావించి ,తనకు తానుగా పొందే భావం అహం . ఇది తమోగుణ లక్షణం .
     దీనికి అనుసంధానమైన వెర్రితలలు చూద్దాం . భగవద్గీతను ప్రమాణంగా చెబుతూ ,కోరిక లేకుండా పరమాత్మను
పూజించాలి . ఆశ్చర్యంగా ఉన్నా ఒక విషయాన్ని గ్రహించాలి . నిజానికి ఇది స్థితప్రజ్ఞ లక్షణం . దీన్ని సాధనాపరంగా
చూడకూడదు . ఇది చేరిన స్థితి . శరీరాభిమానం ఉన్నంత వరకు ,కోరిక ,బాధ ,అవమానం వేధిస్తాయి . వీటిని
పరమాత్మకు చెప్పకుండా ,పూజ ముగించి ఏ కోరికా లేకుండా ఉన్నానని తనకు తాను మభ్యపెట్టుకోవచ్చు . కానీ తన
విషయాలను ఆత్మీయులతో పంచుకోకుండా ఎవరూ ఉండరు . అంటే ఓదార్పు వారి నుండి ఆశించే కదా .తనది ధర్మమైనా అధర్మమైనా ,సమర్ధించి తనపక్షాన మాట్లాడేవారితోనే కదా చెప్పేది?అంటే పరమాత్మకన్నా అధికంగా తనకు వారు ముఖ్యులు . ఇది పూర్తిగా తమోగుణ లక్షణం . తన శక్తితో తాను పనులు చేస్తున్న అహం చేస్తున్న అట్టహాసం . [కర్మ]
    పూజలో తనముందు ఉన్నది విగ్రహరూపంలో ఉన్న నిరాకార ప్రత్యక్ష పరమాత్మగా సంభావించి ,తన కష్ట సుఖాలను
ఎంతో ఆర్తిగా పంచుకునేదే పూజ . తనకు పరమాత్మ తప్ప వేరే దిక్కేలేదు చెప్పడానికి . ఇది భక్తి . ఆయనకు ,వస్తు సముదాయంతో కానీ ,మానసికంగా కానీ సమర్పించే ఉపచారాలకన్నా ,తనే తప్ప వేరే లేదనే భక్తుని భావమే భగవంతుని
ప్రసన్నుణ్ణి చేస్తుంది . [భక్తి ]దీనికి గమ్యం జ్ఞాన సిద్ధి . పరమాత్మకన్నా తనకెవరూ లేరనే ఉపాసన అన్నిటికన్నా మిన్న .
ప్రతి సందేహము తీరుతుంది . అలసట తీరుతుంది . ఓర్పు ఏర్పడుతుంది . సహనం సహాయపడుతుంది . చివరగా సర్వే
సర్వత్ర పరమాత్మగా ప్రకటితమై ,చెప్పేవాడు మిగలక ,చెప్పేవి లేని స్థితి ,స్థిత ప్రజ్ఞత్వాన్నిస్తుంది . పరమేశ్వరార్పణమస్తు .




26, ఏప్రిల్ 2016, మంగళవారం

మాయ

మాయ . ఉన్నది లేనట్లు ,లేనిది ఉన్నట్లు కలిగే భ్రాంతి . చక్కనైన ఉదాహరణ కలే . ఆ సమయంలో అది లేదని ఎవరూ అనలేరు . అమ్మవారిని  ,మాయ అని కూడా అంటారు .జ్ఞాన స్వరూపిణి ,ముక్తి ప్రదాత కూడా . ఎలా విడదీయాలి ఈ
చిక్కుముడి ?నేను అని భావిస్తున్న శరీర భావన ,నిజానికి తనకు సంబంధం లేనిది . పరాయి సొత్తును తమ సొత్తుగా
ప్రకటించినపుడు ,దాని యజమాని ఎందుకు అంగీకరిస్తాడు ?నిజానికి సృష్టి అంతా అర్ధనారీశ్వరమే . శరీరం శివుడు ,శక్తి
అమ్మవారు . దీన్ని మరచి ,శరీరం తనదంటూ ,దాని వ్యవహారాలు తనవంటూ ,కర్మ వలయంలో చిక్కి ,జీవుడు
తనను తానే బంధించుకున్నాడు . పైగా భగవంతుని దృష్టిలో తరతమ బేధాలున్నాయని ,సృష్టిలోని బేధాలను వేలెత్తి
చూపుతారు . దీనికి కారణం తను వహించిన కర్తృత్వం అని ఎన్నడూ భావించడు . పరమాత్మ కృపతో సాధన సాగితే ,
సృష్టిని పరమాత్మ క్రీడగా భావించి ,అన్ని శరీరాలను పరమాత్మగా భావించి ,తనపాత్రను ఏమరపాటు లేక ,తొట్రుపడక
జీవించినపుడు మాత్రమే ,మాయవరణం తొలిగి ,అమ్మవారు ముక్తి ప్రదాతగా అనుగ్రహిస్తారు . అమ్మవారి సృష్టిలోని ఏ కణం
తనది అన్నా మయావరణం వీడదు .

28, ఫిబ్రవరి 2016, ఆదివారం

ప్రతిబింబం

   ప్రతి బింబ న్యాయం .
ప్రతిబింబం రెండు విధాలుగా మనకు సరి అయిన బింబ దర్శనానికి సహకరించదు . 1బింబం సరిగా లేనపుడు ,ఎలాగూ సరిగా కనిపించదు . 2అద్దం మురికిగా ఉన్నప్పుడు సరిగా ప్రతిఫలించదు . 1భౌతిక ప్రపంచ విషయాలు . తనను సరి చేసుకుని ప్రతిబింబ రూపమైన జగత్తును చూడాలి . 2పరమాత్మ విషయంలో బింబం ఎప్పుడూ మార్పు లేకుండా ఉంది .
అంతే నిష్కల్మషంగా అనుభవానికి అందాలంటే ,మనస్సనే అద్దాన్ని శుద్ధ సత్వాన్ని ఆశ్రయించి శుభ్ర పరచి ,బుద్ధి యోగంతో
పరమాత్మను సంధానం చెయ్యాలి .
   బుద్ధి యోగం .
 జగత్తు ,పరమాత్మగా సత్యం . ప్రపంచం బాహ్యంలో ఉన్నది . అప్పటి వరకు అది పరమాత్మ . కానీ అంతర ప్రపంచం
వస్తు ప్రపంచం కాదు . నిజానికి ఇది వీడియో ,ఆడియో తప్ప వేరుకాదు . కానీ దీనికి సత్యత్వాన్ని ఆపాదించి ,జన్మ
పరంపరను ఆహ్వానిస్తున్నాము . దీనికి సాక్షిగా చూచే వినే ,చైతన్యం స్పష్టంగా తెలుస్తున్నా గమనించక పడే అనర్ధమే
బంధం .

13, జనవరి 2016, బుధవారం

ధర్మపత్ని

ధర్మపత్ని . 
                భర్త స్వరూపం ధర్మం ,కాగా దాన్ని ధ్వజంలా నిలబెట్టే భారాన్ని వహించే ,సహధర్మచారిణి . అతడు ధర్మాన్ని విడువక ,అనుసరింప జేసేలా ,తన ప్రవర్తనకు తానే బాధ్యతను వహిస్తూ ,పిల్లలకు ,ధర్మమే ప్రాతిపదికగా 
ఆచరించి చూపే చుక్కాని ,ధర్మపత్ని .
 1. అయస్కాంతాన్ని అతుక్కుని ఇనుము తన ధర్మాన్ని పాటిస్తూ ,అయస్కాంత ధర్మాన్ని మనకు తెలిసేలా చేస్తున్నది . 
చూడడానికి అయస్కాంతం ఇనుప ముక్కలాగానే ఉంటుంది .కానీ ఇనుమును పట్టి ఉంచడం దానిధర్మం కాగా, సహకరించిన కారణంగా,అవ్యక్త స్వభావం ,వ్యక్త మైనది . అవ్యక్త ప్రపంచం వ్యక్త మైందిలా .ఇనుము అయస్కాంత రాపిడితో అయస్కాంత మైంది కానీ ,అయస్కాంతం ఏ నాడూ ఇనుపముక్కగా మారింది లేదు . ఇదే కుటుంబ వ్యవస్థ .దీన్ని పదార్ధ భావంతో 
విమర్శిస్తే ,మిగిలేది పదార్ధ భావమే ,కానీ యదార్ధం గ్రహించడం ,చైతన్య లక్షణం .
 

20, డిసెంబర్ 2015, ఆదివారం

శ్రీ గోదా కళ్యాణం

శ్రీ గోదా కళ్యాణం .

         'శ్రీ రంగనాధాయ నమః '. . పరమాత్మ కరుణతో కలిగిన మానవ దేహానికి ,చూపుతో బాటు ,
మనో నేత్రం కూడా ప్రసాదించాడు . అనాది అయిన ,పురాకృత కర్మ బంధం వలన ,జగత్తుగా
సత్యమైన మాయ వలన ,మిధ్యా ఆరోపం సహజం . దీనికి దృష్టి దోషం సహజం గానే జీవికి , ఏర్పడుతున్నది . భవరోగ నివారణకి ,వైద్య శిఖామణి పరమాత్మ తానే ,గురువుగా అవతరించి ,
జ్ఞానమనే కంటి అద్దాలు ప్రసాదించి ,ముక్తి మార్గాన్ని ,సరిగ్గా ద్యోతకమయ్యేలా చేస్తాడు .
         వారి ,వారి పూర్వ సాధనా సామర్ధ్యానికి తగిన గురువు వారికి తప్పక లభిస్తారు . అలాకాదు
మాకు సరి అయిన గురువు దొరకలేదు ,భ్రమలో ఉండి పోయాము ,అనుకోవడం శుద్ధ తప్పు .
ఎవరైనా వారి పురాకృత కర్మను మించి ఏదీ పొందలేరు . కనుక సంచిత ప్రారబ్ధాన్ని సరి చేయడానికి ఆ రూపంలో వారు తారస పడతారు . అర్ధమైన తరువాత అయినా ,భక్తి అంటే ,కేవల
పూజ ,జపము ,ధ్యానము కాదని ,జీవించే ప్రతిక్షణం కనిపించే ,వినిపించే ప్రతి విషయం , పరమాత్మ లీలగా ,అందులోని తనపాత్ర ఎంత సమర్ధ వంతంగా పోషిస్తున్నాడో తెలిసి ,జీవిస్తే
తప్పక గురుకృపకు ,పాత్రులు కాగలరు . ఇది మరీ గ్రాంధికంలా ఉందంటున్నారు పిల్లలు .
పూర్వం మంచి నీళ్ళు దోసిలిలో పోసేవారు అవి మరి ధారగానే పడతాయి . తీసుకునే వారు
ఆగి ,ఆగి తీసుకోక తప్పదు .
        ఇక నాచేత వ్రాయించ బడుతున్న ఏ విషయమైనా ,శ్రీ రమణ మార్గాన్ని తప్ప వేరే కోణాన్ని
చూపించలేకపోవడం ,సహజం . శ్రీ శంకరుల ఆచారము ,శ్రీ రమణుల అనుగ్రహము ,ఇవే రెండు
కళ్ళద్దాలు . కానీ చూపు శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ .
      శ్రీ గోదా దేవి మానవుడు తానుగా భ్రమిస్తున్న అహం . చేరిన శ్రీ రంగనాధుడు జగత్తును ఆటగా ,
క్రీడిస్తున్న పరమాత్మ . సోహం అంటూ భ్రమర కీట న్యాయంగా ,లేని తనను ఉన్న సత్యంలో
ఐక్యం చేయడం కళ్యాణం .
        పుట్టిన పురిటి పిల్లకు ఎవ్వరూ చెయ్యరు పెళ్లి . వారిని పెంచే విధానం విష్ణు చిత్తుడు ,నేర్ప
వలసిందే . తల్లిదండ్రులు వారిజీవితాన్ని ,పరమాత్మనే గమ్యంగా గడిపినప్పుడు ,పిల్లలు ఎలా
ఉంటారో అని ఆలోచించే పనే ఉండదు . ఎందువల్లనంటే ,వారి చిత్తం ,శివునిది కనుక . తమను
తాము , జిజ్ఞాసువులుగా మార్చుకుని ,పిల్లలకు మార్గదర్శనం చేస్తారనే ,పరమాత్మ సంతానాన్ని ఇచ్చింది . కానీ కలి గురించి ఎన్ని కారణాలైనా చెపుతారు . కానీ ఒక క్షణం వర్తమానంలో ఉంటే
కలి లేనే లేదు . లేనిదాన్ని ఉందని నిరూపించడానికి పడే తాపత్రయం ,పరమాత్మ కొరకు
వినియోగిస్తే వేరే తపస్సు అవసరం లేదు . నిజానికి విష్ణు చిత్తునకు భార్య లేదు . కానీ మనం
అనుసంధానం చేస్తే ,మారు మాట్లాడకుండా సాధనకు సహకరించే మనస్సనే భార్యతో కలిసి ,
తన వ్యక్తిత్వాన్ని పరమాత్మకు సమర్పించాడు విష్ణు చిత్తుడు . తల్లి దండ్రులు నేర్పినంత ,నేర్చి
తనను తాను విష్ణు చిత్తునిగా గ్రహించి ,మనసును వంచి ,అహంను ,శివోహంలో లయం చేసి ,
సాక్షిగా ,శ్రీ గోదా రంగనాధుల కల్యాణాన్ని వీక్షించాలి . శరీరం ఉప్పు బొమ్మలా ప్రారబ్దానంతరం
పరమాత్మ అనే సముద్రంలో కలిసి సముద్రంగానే ఉంటుంది .
                                        శ్రీ గోదా రంగ నాధార్పణ మస్తు .



    

27, నవంబర్ 2015, శుక్రవారం

సేవ

సేవ .... దీనికి ముందుగా చెప్పేపేరు అమ్మ . ఒక కుటుంబం నిలబడింది అంటే అమ్మవల్ల . తాను అమ్మగా నిలబెట్టిన కుటుంబం తనతో మొదలు కాదు . కానీ ముందు తరం అమ్మకు తానిచ్చిన గౌరవం ఎంత ?తాను కోరుకుంటున్నది ఎంత ?
         ఇది కేవలం కుటుంబానికి పరిమితమయ్యే అంశం కాదు . ఇది సాధనకు సంబంధించి ,ధర్మాన్ని పరిరక్షించే మొదటి సోపానం . సృష్టిలోని రెండు ఉపాధులు ,ఆడ ,మగ . శాస్త్రం మగ వారిని శివునితోను ,ఆడవారిని శివానిగా అనుసంధానం చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే . స్థిరము ,చరము కలిస్తేనే సృష్టి . శివుని స్థిరంగానూ ,అమ్మను చరంగానూ గుర్తిస్తే
స్థిరం మీద ఆధారపడి చరం అనేది ప్రకృతి నియమం . ఈ కారణంగానే వివాహం తరువాత గోత్రం మార్చి, చర వస్తువును
మూలమైన స్థిర ప్రజ్ఞకు కలిపి సంపూర్ణం అన్నారు . చరమైనది ఎప్పుడూ స్థిరమైనదాన్ని చేరితేనే సంపూర్ణం . కాబట్టి వదలి
వచ్చినది తనకు పరాయిదని తెలిసి ,తనకు కుటుంబాన్ని అందించిన ,అత్త మామలను తన తల్లి దండ్రులుగా భావించే
సంస్కృతిని ,వేదమతం అందించింది . ఈ పరంపరలో చర స్వరూపమైన మనస్సు స్థిరం చేసే ప్రక్రియే ,అహం తొంగి చూడని
అత్త మామల సేవ .
        కానీ ఇప్పుడు ఆడపిల్లలు, తమ తల్లిదండ్రులను సేవించగలరు . సమాజం లోని వృద్ధులను ,అనాధలను ,తోడు లేని
వారిని ఉద్ధరించడానికి ముందుకు వస్తారు . కానీ దీనిలో జరుగుతున్న అంతర్ సంస్కారాలు ఎలా ఉన్నాయి ,అనేదాన్ని
పరిగణనలోకి తీసుకోవడం లేదు . నిజానికి తన అహం ఎక్కడ పొగడ బడుతుందో, అక్కడ సేవ అనే పేరుతో స్వీకరించి
ధర్మాన్ని తప్పుగా చిత్రీకరించి ,ప్రగల్భాలు చెప్పుకునే ,పరధర్మాన్ని విడిచి ,తనకు అహాన్ని నిర్జించి ,పరమాత్మను చేర్చే
సోపానంగా అత్తమామల సేవను గుర్తించాలి .